Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే పంచాంగం చెప్పలేవా'' అన్నట్టుగా తయారైంది నేటి మన చదువుల పరిస్థితి. నిజానికి అక్షరాస్యత రానురాను పెరుగుతుండటం హర్షణీయమే కానీ అదే సమయంలో పెరుగుతున్న కళాశాలలు విద్యార్థుల సంఖ్యకు ధీటుగా నాణ్యత కొరవడుతున్నదన్నది వాస్తవం. ప్రాథమిక స్థాయి నుండి కూడా నాణ్యమైన విద్య అందక నాసిరకం చదువులతో నెట్టుకొచ్చిన విద్యార్థి నైపుణ్యం, సజనాత్మకత కొరవడి అనంతర కాలంలో నిరక్షరాస్యుడి కంటే దీనంగా కాలం వెల్లదీస్తున్న నిరుద్యోగులు కోకొల్లలు. నిజానికి విద్యా సంస్కరణలపై అనేక కమిటీలు చేసిన విలువైన సిఫార్సులను లెక్కచేయని మన ప్రభుత్వాలు అభివద్ధి అనగా నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ అందిస్తే చాలు అన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయడమే కాక తాత్కాలిక బడ్జెట్ కేటాయింపుల పెంపు (అంకెల గారడీ)తో అత్యద్భుతమైన ఫలితాలు ఆశించటం దురదష్టకరం.
ప్రభుత్వ విద్యాలయాలకు పోటీగా లాభాపేక్ష లక్ష్యంగా ప్రైవేటు విద్యవల్ల విద్యా వ్యవస్థ అనేక ఒడిదుడుకులకు లోనవుతోంది. ముఖ్యంగా తల్లిదండ్రులలోనూ ర్యాంకుల పట్ల ఆసక్తి, పాఠ్యాంశాల బట్టీతో ఫలితాలు చూపి, మాట తీరుపై వాంఛ పెంచి, సకల సౌకర్యాలను సాకుగా చూపి పిల్లలను చేర్చుకుంటున్నారు. లాభాలు ఆర్జిస్తూనే, పలు సందర్భాల్లో వారి అపసవ్య పోకడలైన సెలవుల రద్దు, విపరీతమైన ఒత్తిడి, శారీరక మానసిక హింస, ఫీజుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించకపోవడం, అనర్హులను ఎంపిక చేసుకోవడం లాంటివి నేటికాలంలో సర్వసాధారణం అయిపోయాయంటే కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే.
ఇక పరీక్షల విషయానికి వస్తే హైదరాబాద్ లాంటి నగరాన్ని కాస్త మినహాయిస్తే, పర్యవేక్షణ అధికారులు లేక నిరంతర పర్యవేక్షణ కొరవడి విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీని ఫలితాలు ఎక్కడ బయటపడతాయోనన్న ఆందోళన, ఫలితాలపై రాజకీయ ఒత్తిడి, ర్యాంకులు, ఉత్తీర్ణత శాతం మెరుగుపరుచుకోవాలనే ఆరాటంలో ''సంతప్తీకరణ'' విధానం గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న తంతు. ఇది కేవలం పదో తరగతికే పరిమితం అనుకుంటే పొరపాటు. ఉన్నత విద్య వరకు కూడా, విద్యార్థులు రాసే దానికి, వారి భావ వ్యక్తీకరణకు, వేసే మార్కులకు సంబంధం లేకుండా పోయింది. అయినా సజనాత్మకతకు చోటులేని, నైపుణ్యాన్ని పెంచలేని, నవ్య ఆలోచనలకు నాంది వేయించలేని ఆ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రతీ స్థాయిలో ప్రస్తుతం పరీక్షల నిర్వహణ ఒక తంతులాగా మారింది. విద్యార్థిలో ఆసక్తి, అభిరుచి, సజనాత్మకత, నైపుణ్యం, భావవ్యక్తీకరణ, సమాజ సమస్యలపై అవగాహన, అధ్యయనానికి పురికొల్పేలా గాక మార్కులు, ర్యాంకుల ప్రాతిపదికగా తయారైంది. నిజానికి పబ్లిక్ పరీక్షల వల్ల చిన్న వయసులోనే విద్యార్థులపై అనవసర ఒత్తిడి తప్ప లాభం లేదు. పైగా దానికి విద్యార్థిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఒత్తిడి, తోటి విద్యార్థులతో పోలికలు, సమాజం మొత్తం దష్టి తనపైనేనన్న ఆందోళనలతో విద్యార్థిలోకం తీవ్రంగా సతమతమవుతున్నారు. అసలే నైతికత పతనమై, విలువలు దిగజారుతూ స్వార్థ చింతన పెరిగిన సమాజం మరోవైపు మానసిక దఢత్వాన్నివ్వని విద్య వల్ల అనాలోచిత నిర్ణయాలు (ఆత్మహత్యలు) కూడా ఈ మధ్య కాలంలో అధికమవుతున్నాయి. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వాలు పరీక్షల్లో సంస్కరణలు త్వరితగతిన ప్రవేశపెట్టాలి. భవిష్యత్తుపై భరోసా ఉండేలా, సజనాత్మకత పెంపొందించే విధంగా, నైపుణ్యాన్ని మెరుగుపర్చేలా, విద్యార్థి చొరవకు ప్రాధాన్యత ఇచ్చేలా, నవీన ఆవిష్కరణలకు పురికొల్పేలా మార్పులు చేయాలి.
- వినోద్కుమార్ సుద్దాల
సెల్ : 9908312949