Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచేదం తా న్యాయం కాదు'' అని అం టారు కారల్మార్క్స్. కారణా లు ఎన్ని ఉన్నా పరిమితులు తెలిసినా.. త్రిపుర ప్రజలను తమ బిడ్డలుగా చూసుకునే ''మాణిక్యం'' లాంటి నిరాడం బర ఆదర్శంగల త్యాగధను లున్న ''ఎర్రజెండా'' పార్టీ ఓడిపోవడం కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, వామపక్ష అభిమానులు, హేతువాదులు, ప్రగతి కాముకులకు తీవ్రమైన బాధను కల్గించింది.
ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశం లోని పేదప్రజలు, కార్మికుల ప్రయోజనాలే అతిము ఖ్యంగా భావించి నిబద్ధత, నిస్వార్థం, త్యాగంతో పని చేయడమే కాకుండా తాము ఏలిన రాష్ట్రాలలో ఆద ర్శవంతమైన పాలన అందించింది. ఈ గమనంలో పార్టీ ఎన్నో పరీక్షలకు గురైంది. రాజకీయంగా నష్ట పోయింది. ఎంతో మంది నాయకులను, కార్యకర్తల ను బలిదానం చేసుకున్నది. దేశమంటే మట్టికాదో రు, దేశమంటే మనుషులని నమ్మి ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని మరో జాతి దోపిడీ చేయ ని సమసమాజంతో కూడిన అత్యంత మానవీయ సమాజ నిర్మాణం కోసం ఆటంకాలెదురైనా అలుపె రగని ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నది.
ప్రజల ఐక్యతకు, జీవితాలకు అవరోధాలైన అతి వాద, మితవాద మత ఉన్మాద, ఉదారవాద విధానా లను సైద్ధాంతికంగా ఎదిరించింది. ఉద్యమాలు చేప ట్టింది. మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని అస్సాంలో బోడో వేర్పాటువాద ఉద్య మం, త్రిపురలో త్రిపుర జుబా ఉపజాతి సమితి, బెం గాల్లో గూర్ఖాలాండ్ సైద్ధాంతికంగా ఎదురొడ్డింది. దేశంలో మతోన్మాద భావాజాల దాడులను నిలువ రించడానికి విశేషమైన కృష చేస్తున్నది. ఇది ఎర్రజెండా పార్టీ (సీపీఐఎం) సైద్ధాంతిక నిబద్ధతకు నిలువుటద్దం. సోవియట్ యూనియన్ కుప్పకూలిన అనంతరం ఇంకేక్కడుంది ఎర్రజెండా, కమ్యూనిస్టుల కు కాలం చెల్లిందని భయంకరమైన దాడి చేసిన ఆ సందర్భంలోనే ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలను కూడగట్టి సోషలిజం అజేయమని పెట్టుబడిదారుల విషప్రచారాన్ని సహితం ఎదుర్కొని నిలబడ్డది.
దేశాన్ని సుదీర్ఘకాలంపాటు ఏలిన కాంగ్రెస్ బెంగాల్ అభివృద్ధికి సహాయం చేయలేదు. పారిశ్రా మిక రంగం అభివృద్ధికి తగిన తోడ్పాటునివ్వలేదు. రాష్ట్రాలకున్న అధికారాల మేరకు, ఉన్నంతలోనే పేదప్రజలకు సేవ చేయడం భూపంపిణీ, కౌలుదార్ల కు హక్కులు కల్పించడం, విద్య, ఆరోగ్యం, భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వటం జరిగింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన అందిస్తోంది.
ఏ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నా ఆ రాష్ట్ర వనరులలో ఆత్యధిక భాగం అట్టడుగున ఉన్న పేద ప్రజల కొనుగోలు శక్తి పెంచుకోవడానికి మత సామరస్యం, శాంతిభత్రల వంటి అతిముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యతనివ్వటం జరిగింది. నేతలు ఆదర్శంగా ఉండటం, తక్కువ జీతాలు తీసుకోవడం నిరాడంబరంగా ఉండటం, ఎక్కడైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకోవడం జరుగుతున్నది. అందుకే ఇన్నేండ్ల వామపక్ష ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క అవినీతి అరోపణ వచ్చిన సందర్భాలు లేవు. అంతా నిజాయితీగా, నిబద్ధతతో బూర్జువా ప్రజాస్వామ్య దేశంలో ఇంతకాలం పేదలకు, కష్టజీవులకు అనుకూ లమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, నిలుపుకో వడం అంటే... నేడున్న ప్రపంచీకరణ సామ్రాజ్యవా ద పెట్టుబడిదారుల, మతవాదుల ప్రమాదకర విధానాలను అడ్డుకోవడం, ప్రభుత్వాలను కాపాడు కోవడం పరీక్షగానే ఉంటున్నది. సామ్రాజ్యవాదం, దేశ పెట్టుబడిదారుల దోపిడీ ఆర్థిక విధానాలను వామపక్షాలు అడ్డుకుంటున్నందువల్లనే అందరు కలిసి బెంగాల్పై దాడి చేసి తమ దోపిడీకి అడ్డు తొలగించుకున్నారు. ఆర్థిక విధానాలు, కుంభకోణాల లో విసిగి వేసారిన ప్రజలు ప్రత్యామ్నాయం కోరుతు న్నారన్న సందర్భంలో అంతవరకు కాంగ్రెస్కు అండ గా వున్న కోటీశ్వరులు, కుబేరులు, కాంగ్రెస్కు ప్రత్యా మ్నా యంగా బీజేపీని బలపర్చడం మొదలైంది. దే శంలో వామపక్షాలు అభ్యుదయశక్తులు బలహీనమవ డం, ప్రాంతీయ పార్టీల అవకాశవాద రాజకీయాల వలన నేడు బీజేపీ విష కౌగిలిలోకి భారత ప్రజలు చేరువవుతున్నారు.
సూత్రబద్ధ సైద్ధాంతికతతో నిలబడ్డది. కాలానికి తట్టుకొని నిల్చింది. ఆయా సందర్భాలలో దాడులకు, హత్యలకు గురయ్యారు. అయినా తన సైద్ధాంతిక నిబద్ధతను తాకట్టు పెట్టలేదు. కానీ బూర్జువా మతో న్మాద పార్టీలు కుల, మత, వేర్పాటువాద, ఉగ్రవాదు ల ఇలా ఏది, ఏ సందర్భంలో ఉపయోగ పడ్డా, ఆ సందర్భాన్ని ఉపయోగించుకోవడం, లాభపడటం, అవకాశవాదంగా వ్యవహరించడం జరుగుతున్నది. నేడు బీజేపీ త్రిపురలో కుల, మత వేర్పాటువాద ఉగ్ర వాద సంస్థలలో జతకట్టి లాభపడింది. వీటికితోడు గా వీరంతా ప్రపంచబ్యాం కుకు తాబేదార్లుగా వ్యవ హరించడం, పెట్టుబడిదారు లకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అమలు చేయడం, దోచిపెట్టడం, తిరిగి వారి డబ్బుతోనే ప్రజలను కుల, మతాలవారి గా విభజించడం, బలహీనపర్చడం జరుగుతున్నది.
ఎంత అనైతికతా! మెజార్టీ పార్టీలను అధికారంలోకి రానివ్వరు, 2,3, సీట్లు వచ్చినా వారే ముఖ్యమంత్రులు అవుతారు. నేడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రష్టు పట్టించి ఆర్థిక అరాచకాలతో దేశంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. చిన్న రాష్ట్రం త్రిపురకు వేల కోట్లు పంచడమా.. ఎంత దారుణం? మళ్లీ దాడులు, హత్యలు, విధ్వంసాలు, ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా దేశభక్తి? ఇప్పుడు బీజేపీకి గల ఒక లక్ష్యం స్పష్టంగా ప్రజలకు కన్పిస్తున్నది. ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం లేదనీ జీవన ప్రమాణాలు, అభివృద్ధి, సామరస్యం సాధించడానికి ఆపసోపాలు పడాల్సిన పని లేదని, కారణం ఎంతటి బలమైన రాష్ట్రాన్నైనా ''బడ్జెట్''తో కొనేయగలమనీ దాని ద్వారా దేశంలో భయోతోత్పాలను సృష్టించి తాననుకున్న ఏకీకృత పాలనన సాధ్యం చేసుకోవ్చని బీజేపీ భావిస్తున్నది. ఈ ఫాసిజం పోకడలను దేశంలోని అభ్యుదయ, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే. కానీ గెలుపన్నది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. గతం కన్నా మెరుగైన పాలన అందించడానికి గెలుపు దోహదం కావాలి. కాని అరాచకాలకు, విధ్వంసాలకు వ్యక్తుల, సమూహాల నిర్మూలనకు కాదు. మార్క్సిజం మానవతా సిద్ధాంతం. మార్క్సిజాన్ని నిర్మూలించాలంటే మనిషి నిర్మూలనే జరగాలి. అది మతోన్మాద శక్తులవల్ల కానేకాదు. చరిత్రలో హిట్లర్, ముస్సోలినీలు అంతర్థానం అయ్యారు. మార్క్సిజ సిద్ధాంతాన్ని మనస్సార నమ్మి ఆచరిస్తున్న కమ్యూనిస్టులు ఎల్లప్పుడు త్యాగాలకు సిద్ధంగానే ఉంటారు. దోపిడీ రహిత సమసమాజం కోసం ప్రయాణిస్తూనే ఉంటారు.
- దయ్యపు రాధాకృష్ణ
సెల్: 7730877841