Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో విద్య, ఆరోగ్యశాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. బదిలీల ప్రక్రియలో భాగంగా ఐదేండ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొంతమంది అడ్డదారులు తొక్కారు. 'ఫ్రిఫరెన్షియల్ క్యాటగిరీ కింద తమకు తమ కుటుంబ సభ్యులకు అనారోగ్యం లేకున్నా అనారోగ్యంతో బాధపడుతున్నామని, శస్త్రచికిత్సలు సైతం చేయించామని, వివిధ రకాల వ్యాధులకు సంబంధించి జిల్లాల్లోని మెడికల్ బోర్డులోని వైద్యులతో కుమ్మక్కై నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు.. ఇలాంటి 'నకిలీ'ల వల్ల అసలు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మరింత ఇక్కట్లకు గురికావాల్సిన పరిస్థతి నెలకొంది. ó జిల్లాల వారీగా మెడికల్ బోర్డు నుండి సర్టిఫికెట్లు పొందిన వారి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి. నకిలీ అని తేలితే సర్వీస్ నుండి తొలగించాలి. పారదర్శకంగా బదిలీలు చేపట్టాలి. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా బదిలీలు చేపట్టి శాఖల ప్రతిష్ట పెంచాలి.
- ఆనందరాజు