Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న కామపిశాచుల చేతిలో నలిగిపోయిన ని ర్భయ దగ్గర నుంచి నేటి కథువా ఘటన వర కు ప్రతిరోజు భారతావనిలో ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉన్నా యి. మానవ మృగాలు పెచ్చు మీరుతూనే ఉ న్నాయి. నిర్భయ ఘటన తర్వాత కేంద్ర ప్రభు త్వం నిర్భయ చట్టం తీసుకొచ్చింది. అయినప్ప టికీ కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉ న్నారు. బయటికి వెళ్లిన కూతురు ఇంటికి తిరి గి వస్తుందా లేదా? అన్న టెన్షన్తో తల్లిదండ్రు లు బతుకుతున్నారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు ని మ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. నిందితులను జైళ్లో పెట్టి సం వత్సరాలపాటు రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. నిందితులు ము ప్పూటలా తిని తిరిగి నిస్సిగ్గుగా నిర్లజ్జగా చెబుతూ చట్టం నుంచి తప్పిం చుకొని బయటకు వస్తున్నారు. ప్రతి రోజు బేటీ బచావో బేటీ పడావో అని గర్జించే కేంద్ర పాలకులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నిందితులను కఠినంగా శిక్షించాల్సింది పోయి నిందితులనే వెనకేసుకొస్తున్నారు. జ మ్మూకాశ్మీర్లో కథువా ఘటన మీద లాయర్లు నిందితులను అరెస్టు చే యాలని నిరసన తెలుపగా, సభ్యసమాజం సిగ్గు పడేలా బీజేపీ రాష్ట్ర మంత్రులు చౌదరిలాల్ సింగ్, చందర్ ప్రకాష్ గంగలు నిందితులను స మర్థిస్తూ ర్యాలీ తీశారు. ఉత్తరప్రదేశ్లో శాసనసభ్యుడే అత్యాచారం చేస్తే పట్టించుకోని నిస్సహాయ స్థితిలో సన్యాసి ప్రభుత్వం ఉంది. కేంద్ర మం త్రి స్మృతిఇరానీ నాడు జరిగిన మహిళా అత్యాచారాన్ని నిరసిస్తూ మన్మో హన్సింగ్కు గాజులు పంపింది నేడు కథువా ఘటనను ఖండించలేదు.
ఓ మనువాదుల్లారా| ఎనిమిదేండ్ల బాలికపై వారం రోజులు గుడి లో అత్యాచారం జరుగుతుంటే కాపాడలేని దేవుడు మసీదులో తుపాకు లు దాచుకొని తిరిగే ఉగ్రవాదులని చూడలేని అల్లా, చర్చిలో బాంబులు పేలి చనిపోతున్నా ప్రజలను కాపాడలేని యేసుక్రీస్తుల గురించి మాట్లా డుతూ దేశాన్ని అంధకారంలో నెడుతున్నారు. సభ్య సమాజం సిగ్గు పడే లా కండ్ల ముందు జరుగుతున్న ఇలాంటి ఘోరాలను అంతమొందించ డానికి అడుగైనా వెయ్యలేని అసమర్థుల్లారా| ఇప్పటికైనా కండ్లు తెరవం డి. ఒక నిర్భయ, ఒక ఉన్నావో, ఒక కథువా వంటి ఘటనలు జరగకుం డా ముక్కుపచ్చలారని అమ్మాయిలని నలిపేయకుండా దేశాన్ని కాపా డండి. సమస్యను శాస్త్రీయ కోణంలో చూసి బాధితులకు అండగా, నిం దితులకు కఠిన శిక్ష పడేట్టు, న్యాయదేవత కండ్ల గంతలు విప్పి చట్టాల ను బలంగా అమలు చేయాల్సిన బాధ్యత మీదే. అత్యాచారాలు, మహిళ లపై వివాదాస్పదంగా గ్రామ సర్పంచ్ నుండి దేశప్రధాని వరకు ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకునేలా ఉండాలి. ఓ కేంద్ర పాలకులా రా| మనది హిందూ దేశం కాదు, లౌకికదేశమని గుర్తించి బడుగు, బల హీన, అణగారిన వర్గాల పరిరక్షణకు, ఇప్పటికైనా చిత్తశుద్ధితో పని చేయండి. లేదంటే ప్రజాకోర్టులో ప్రజలు మీ సంగతి తేలుస్తారు.
- శ్రీకాంత్ అంబేరి
సెల్:9963418781