Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మీరెందుకు ఊరు పరువు, ప్ర తిష్టలు, గౌరవ మర్యాదలకు మచ్చతె స్తున్నారు. ఈ విషయం బయటివాళ్ల కు తెలిస్తే మన పరువేంకాను'' స్వ చ్ఛభారత్ మిషన్కు ప్రచారం కల్పి స్తూ తీసిన వీడియోలో అమితాబ్ బ చ్చన్ డైలాగులు ఇవి. మన ఆలోచ నల్లో కుళ్లు, కుతంత్రాలు, మన మది నిండా విద్వేషం నింపుకుని స్వచ్ఛ భారత్ అంటూ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ ఉద్దేశం ఎలా నెరవేరు తుంది? మన ప్రధాన మంత్రివర్యు లు నరేంద్ర మోడీ అట్టహాసంగా గొప్ప సంకల్పంతో స్వచ్ఛ భారత్ నినాదానికి పిలుపునిచ్చారు. బాలీవుడ్ బిగ్బాస్ అమితాబ్ బచ్చన్ దీని ప్రచార బాధ్యతలు భుజస్కందాల పై వేసుకున్నారు. చెప్పుకున్నంత స్థాయిలోనే ప్రచారమూ చేశారు. ఎక్కడ చూసినా బిగ్ బి వీడియోలతో కూడిన స్వ చ్ఛ భారత్ సందేశాలు మనకు కనిపిస్తాయి. మన పరిస రాలనుంచి అపరిశుభ్రతను పారదోలడం, పరిశుభ్రతకు నిలయాలుగా మారడం ఇంతకంటే ఎవరికైనా ఇంకేం కా వాలి. కానీ మన హృదయాలు మురికి కూపాలయ్యాయి, మన మెదళ్లు విషపూరిత ఆలోచనలకు నిలయమయ్యా యి. మన ఆలోచనలు, మన హృదయాలు మురికికూపాలై తే సమాజంలో స్వచ్ఛత ఎలా సాధ్యమవుతుంది. మన మనస్సులు, మన ఆలోచనలు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛతగా ఉంటేనే స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుంది. స్వ చ్ఛ భారత్ నినాదంతోపాటు హృదయ స్వచ్ఛత, ఆలోచనల స్వచ్ఛత ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేడు దేశంలో మైనారిటీలను వెంటాడుతున్న అభద్రతాభావం కానీయండి, హత్యలు, లైంగి కదాడులు కానీయండి వీటన్నింటికీ ప్రధాన కారణం మన సంకుచిత బుద్ధి, విషపూరిత ఆ లోచనలే. కొంతమంది స్వార్థపరుల వక్రబుద్ధి తో దేశ వాతావరణమంతా కలుషితమైంది. అ లాంటప్పుడు మన వీధులు, పట్టణాలు శుభ్రం చేసి ప్రయోజనమేమిటి? మన ఆలోచనలు, మన మనసులు పవిత్రంగా ఉండనంతవర కూ స్వచ్ఛభారత్ నినాదం ఉద్దేశం నెరవేరదు. కథువా దుర్ఘటన కూడా ఈ విషపు ఆలోచన ల వల్లనే చోటుచేసుకుంది. ఎనిమిదేండ్ల పసిపాపను వారం రోజులపాటు మందిరంలో బంధించి లైంగికదాడి జరిపి హతమార్చడం ఏ మతం బోధించింది. మనిషిలో క్రూరత్వం కేవలం హృదయ మాలిన్యం, విషపూ రిత ఆలోచనల వల్లనే పుడుతుంది. అందుకే విషపు ఆలో చనలను, హృదయ మాలిన్యాలను కడిగేయనంత వరకు స్వచ్ఛభారత్ లక్ష్యం నెరవేరదు. ఈ విషయం ప్రధాని మో డీకు అర్థం కాకపోయినా స్వచ్ఛభారత్ ప్రచారం చేస్తున్న అమితాబ్ బచ్చన్కైనా బోధపడాల్సి ఉంది. ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి వెనుక ఉద్దేశ్యాలు తెలుసుకుంటే కథువా దుర్ఘటన మళ్లీ పునరావతం కాదు. కథువా లైంగిక దాడికి అండగా బీజేపీ మంత్రి నిరసనలు చేయడం హృ దయ మాలిన్యం కాదా? యూపీ ఉన్నావ్లో దళిత బాలిక పై లైంగికదాడికి పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యేను రక్షించేందు కు చేస్తున్న ప్రయత్నాలు యోగీ ఆలోచనలు ఎంత విషపూ రితమో అద్దం పడుతున్నాయి. అందుకే ఇలాంటి విషపూ రిత, హృదయ మాలిన్యాలను కడిగేయడం అవసరం కా దంటారా? కేవలం మరుగుదొడ్లను వాడకపోయినంత మా త్రానికే మన పరువు ప్రతిష్టలు మసకబారతాయని అమితా బ్ జీ స్వచ్ఛ భారత్ ప్రచార వీడియోలో చెబుతు న్నారు. మ రి మన ఆడబిడ్డల మానమర్యాదలు మంటగలి పి, వారి భ ద్రత గాలిలో దీపం అవుతోంది. మనదేశంలో పదివేల మం ది మహిళలు లైంగికదాడులకు గురయ్యారని ఐరాస ప్రధాన కార్యదర్శి స్వయంగా ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పుడే మైంది మన ప్రతిష్ట. మహిళలపై జరుగుతున్న అకత్యాల గు రించి విదేశాల్లో మన దేశ ప్రతిష్ట ఎంత మసకబారుతుందో తెలియదా? అమితాబ్ జీ ఒక్కసారి ఆలోచించండి.
- ముహమ్మద్ ముజాహిద్
సెల్ : 9640622076