Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండగట్టు అంజన్న చెం త ఘోర రోడ్డు ప్రమా దం.. 60 మంది దుర్మరణం. దేశం లోనే అతిపెద్ద ప్రమాదం. 55 మంది పట్టే బస్సులో 101 మందిని కుక్కా రు. ఘాట్లో ప్రమాదమని తెలిసినా ఆర్టీసీ బస్సులు నడుపుతూనే ఉంది. ఆ ప్రమాదాలను నివారించడానికి ఆర్టీసీగానీ ప్రభుత్వంగానీ, ఆర్Êబీ, దేవాలయం బోర్డుగానీ వీసమంత కూడా ప్రయత్నించలేదు. దాని ఫలిత మే బస్సు ప్రమాదాల చరిత్రలోనే అత్యంత విషాదం. అసలే వాలు..పనిచేయని బ్రేకులు. డ్రైవరు ఎంత ప్రయత్నించినా ఆగకుండా 15 మీటర్ల లోతు గుంతలో రెండు పల్టీలు కొ ట్టిన బస్సు జనం ప్రాణాలు తీసింది. బ్రేకుల్లేని డొక్కు బస్సు, చెత్త రోడ్లు. ప్రమాణాలులేని ప్రమాదకరమైన మలుపులు, నిరంతరం సొంత డబ్బా కొట్టుకొనే ప్రభుత్వ నిర్లక్ష్యమూ అధికారుల నిర్లిప్తతా ఆర్టీసీ దురాశా - అన్నీ కలిపి 60 ప్రాణాలను బలి తీసుకున్నాయి. పల్లె గుండె పగిలింది. కన్నీళ్లకే కన్నీళ్లు. పాడెనుక పాడె. ఈ చేతితో బువ్వ పెట్టాను. ఈ చేతితోనే కొరివి పెట్టాలా.. గుండెలవిసేలా రోదన లు...శీతలీకరణ యంత్రాలకు నోచుకోని శవాలు. ''బిడ్డల కడచూపు కోసం, ఉనుక మంచుగడ్డలపైనే శవాలు'' ఊరు గొల్లుమంది, కాడు గోడుమంది. నిబంధనల ప్రకారం ఒక్కో ఆర్టీసీ బస్సు 8 లక్షల కి.మీ. మాత్రమే నడపాలి. ప్రమాదా నికి గురైన బస్సు పెద్దపెల్లి జిల్లా మంథని డిపోలో రెండు నెలల క్రితమే 20 లక్షల కి.మీ తిరిగింది. 20 లక్షలైనా ఇంకా తిరుగుతుందనే ''ఆ బస్సు గొప్పతనం చూడండ హో'' అనే ఉన్నతాధికారుల మెప్పుకోసం, జగిత్యాల డిపోకు తరలించా రు. కొడిమ్యాల నుంచి జగిత్యాల రూట్లో నడుపుతున్నారు. ఆ బస్సు ఘోర ప్రమాదం జరిగే నాటికి రెండు నెలల కా లంలో మరో 4 లక్షల కి.మీ తిరిగింది. మూడేండ్ల క్రితం వర కు 8 లక్షల కి.మీ తిరిగిన బస్సులను ఆర్టీసీ స్క్రాప్ కింద ప క్కకు పెట్టేది. తర్వాత 10 లక్షల కి.మీ, 12 లక్షల కి.మీ వరకు పరిమితి పెంచి ఇటీవల 14 లక్షల కి.మీ తప్పనిసరి చేసిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు 3 నెలల క్రితమే మరమ్మతులు చేసి రంగుపూసి రోడ్డెక్కిచ్చినట్టు ఆర్టీసీ అధికారుల సమాచారం. 24 లక్షల కి.మీ నడిచి, రెండు డిపోలు తిరిగి, శిథిలావస్థకు చేరిన ఆ బస్సు అంతా చిన్నాభిన్నం అయింది. స్టీరింగ్ ఎక్కడ కు పోయిందో తెలియదు. గేర్ రాడు బాక్స్ తుక్కుతుక్కు అయ్యింది. సీట్ల కిందవున్న ఇ నుప గొట్టాలు తుప్పుబట్టి, కొండ దిగుడు వాలు వేగంలో బస్సు కొట్టిన పల్టీలకు, సీటు ఒక్కటి కూడా దృఢంగా నిలిచిలేదు. 24 లక్షల కి.మీ తిరిగి తుప్పు పట్టి శిథిలావస్థకు చేరిన ఇనుప బోలు గొట్టాల సీట్లన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. ఇరుక్కున్నవారు తీస్తుండగానే చనిపోయారు. మృతజీవుల శావాలు కుప్పలు గా పడివున్నాయి. క్షతగాత్రుల ఘోరమైన గాయాల ఆహాకా రాలతో కొండగట్టు ప్రాంతం వణికిపోయింది. బస్సుల సామర్ధ్యానికి మించి జనాన్ని ఒకరి మీద ఒకరిని కుక్కి, కం డక్టర్లకు టార్గెట్, డ్రైవర్లకు మైలేజీ పేర సామాన్యుల శవాల కుప్పలపై, ఆర్టీసీకి ఆధాయం పెంచుకోవడానికి బ్రహ్మాం డమైన ప్రణాళిక వేసింది. కనీస భద్రత లేకుండా భక్తులను మరణపులోగిల్ల లాంటి ప్రమాదకరమైన ఘాట్రోడ్డులో తండోప తండాలుగా తరలించి, కొండలపై వున్న దేవుని హుండీ ఆదాయం నింపడానికి పక్కా ప్రణాళిక వేసినట్టుం ది. కట్టుదిట్టమైన భద్రత, బంధించిన తలుపులు, క్లోజ్డ్ సర్కూట్ కెమెరాల మధ్య భక్తులు వేసిన హుండీలోని ప్రతి పైసా ఆధాయాన్ని లెక్కించడానికి ఒక ప్రణాళిక వుంటుంది. భక్తులు వేసిన హుండీ పైసల్లో ఒక్క పైసా తేడావున్నా కఠిన చర్యలుంటాయి. కానీ ఘాట్ రోడ్లలో కొండలు దిగే దేవుడి భక్తుల ప్రాణాలకు ఎలాంటి గ్యారెంటీ లేదా? 60 నిండు ప్రా ణాలు కండ్లెదుటే క్షణాల్లో గాల్లో కలిసినా ప్రభుత్వానికి, ఆర్టీ సీకి, దేవాలయ బోర్డు, ఆర్Êబీ శాఖలకు ఏం పట్టదా? ఈ సామాన్యుల ప్రాణాలకు విలువ లేదా? సామూహిక ఘాటు రోడ్డు దుర్మరణాలు అనుకోని ప్రమాదంగా మాత్రమే చూడ డానికి వీలులేదు. బస్సు సీట్ల సామర్ద్యం 55. కానీ 101 మందిని ఎందుకు ఎక్కించారు? ప్రభుత్వం, ఆర్Êబీ శాఖకు, దేవాలయబోర్డుకు భక్తుల హుండీపై వున్న భక్తి, ఘాట్రో డ్డును సురక్షితంగా తీర్చిదిద్దడంలో ఎందుకు లేదు? 60 మంది దుర్మరణాలకు ప్రభుత్వం, ఆర్టీసీ, ఆర్Êబీ ఆలయ బోర్డులు పూర్తి బాధ్యత వహించాలి. మనుషుల ప్రాణాలపట్ల ఏమాత్రం విలువలేని ప్రభుత్వ శాఖల జమిలి నిరక్ష్యపు హత్యలివి. కాదంటారా? ఎందుకంటే 8 లక్షల కి.మీ నడిచా క పాత ఇనుప సామాను స్క్రాప్కు బస్సును అమ్మాలి. కానీ కాలం చెల్లిన డొక్కు బస్సును, 24 లక్షల కి.మీ తిప్పి, రెండు డిపోలు మార్చి, శిథిలమైన బస్సుకు రంగులద్ది, 60 మంది ప్రాణాలను బలిగొన్న వారిది బాధ్యత లేదా? నిర్లక్ష్యం, అవినీతి, దురాశ - అన్నీ ఉన్నాయిక్కడ. ఈ ప్రభుత్వ నిర్ల క్ష్యం ఉగ్రవాద చర్య కంటే తక్కువెలా అవుతుంది? ఆర్టీసీ పెట్టిన 8 లక్షల కి.మీ నిబంధన కంటే మూడు రెట్లు అదనం గా తిరిగిన డొక్కు బస్సు ఎప్పుడో ఒకప్పుడు ఇలా ప్రాణాలు తీస్తుందని ఊహించడం కష్టమా? ముఖ్యమంత్రి, మంత్రు లు, అధికారులు 24 లక్షల కి.మీ తిరిగిన వాహనాలనే వాడుతున్నారా? ఎన్ని కి.మీ, ఎన్ని రోజులకు ఓ కొత్త వాహ నం మారుతుంది? ప్రపంచంలో ప్రతి మంచి వాహనం మంత్రుల వాహన శ్రేణిలో చేరుతూనే వున్నాయి.
ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి విచారణలో మొత్తం నేరాన్ని డ్రైవరు మీదకు నెట్టేశాడు. ఏపెద్దలను కాపాడటం కోసం? హాండ్ బ్రేక్ వేయని డ్రైవర్ నిర్లక్ష్యమంటూ తేల్చేసాడు. డ్రైవ ర్కు 25 సం. సీనియారిటీ. ఉత్తమ అవార్డు గ్రహీత. జీవిత కాలంలో ఒక్క ప్రమాదం చేయనివాడు. తల్లిని కోల్పోయి, చావు నోట్లోంచి బయటపడ్డ అర్చన అంటుంది. ''బ్రేక్లు పనిచేయడం లేదు, దూకేవారు కిందకు దూకండని డ్రైవర్ బిగ్గరగా అరిచాడు'' (చావు నోట్లోకిపోతూ, మీరన్న బతకండీ అని చెప్పడం ఎంత గొప్ప దైర్యం). ఒకరు దూకితే మొఖం నుజ్జు నుజ్జు అయింది. అంతకుముందు అదే ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదాల మాటేమిటి? అక్కడే వరసగా ప్రమాదా లు ఎందుకు జరుగుతున్నాయి? ఈ పెను ప్రమాదంతో ఆర్టీసీవారికీ ప్రభుత్వానికీ, ఆర్Êబీకి, పై అధికారులకూ దేవాలయ బోర్డుకీ ఎటువంటి బాధ్యతా లేదని చెప్పడానికి మొత్తం తప్పును డ్రైవరు మీదకు నెట్టేయడమే ఈ విచారణ లక్ష్యంలా కనిపిస్తుంది. ఫిబ్రవరి 2013లో కొండగట్టు కొండ దిగుతూ వ్యాన్ బోల్తాపడి 13 మంది మరణించారు. దీనికంటే కొద్ది రోజుల ముందు కొండగట్టు ఘాట్ దిగుతూ మరో ఇద్దరు చనిపోయారు. ఘాట్రోడ్డు నిర్మాణంలో పంచా యతీరాజ్ శాఖ ప్రమాణాలకు పాతర, అవినీతికి అందలం వల్లనే తరచూ ప్రమాణాలు జరుగుతున్నాయి.
దీనిపైన నిజాయితీ పరులైన సుప్రీం కోర్టు జడ్జి నాయ కత్వాన, ఐఐటీ నిపుణులతో విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. నాలుగేండ్ల విచారణలన్నీ బుట్టదాకలై నందున, ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులకు ఈ 60 మరణాలపై విచారణచేసే నైతిక హక్కులేదు. మృతులకు ప్రభుత్వం 10, ఆర్టిసీ 5, మొత్తం 15 లక్షలు ఇవ్వాలి. సీఎం కేసీఆర్ ఆపార దైవ భక్తి విశ్వాసాలు గలవారు. కేసీఆర్లా చండీయాగం ఎ వ్వరు చేయలేదు. కొండగట్టు ఘోర బస్సు ప్రమాదం దేశం లోనే అత్యంత విశాదకరమైనది. సీఎం, పీఎంలు పరమా ర్శించిన ఎంతో చిన్న ఘటనలున్నాయి. కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే 60 మరణాలు కేసీఆర్ను కరిగించడంలేదా? ప్రగతిభవన్ నుంచి పరామర్శకు దిగి రాకపోవడం బాధాకరం. ఉనుక మంచుగడ్డల్లోని శవాలని పట్టించుకునే ప్రభుత్వ నాథుడు లేక గొల్లుమన్న ఊళ్లను ఓదార్చేవారెవరు? వారి కన్నీళ్లను తుడిచేవారెవరు?
- నైనాల గోవర్ధన్
సెల్ : 9701381799