Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కులం వారిని విడదీసింది. ప్రాణ సఖిని ఊపిరున్నంత వరకూ కాపాడుకుంటా నన్న గొంతు మూగబోయింది. కుల రక్కసి చాచి న కోరలకు వారి ప్రేమ ఆవిరైపోయింది. పాతికేం డ్ల ప్రేమ ఆ తల్లిదండ్రులకు తుది వీడ్కోలు పలి కింది. వందేండ్లు కలిసుంటానని ప్రమాణం చే సిన ఆ యువప్రాయం ఇక తిరిగి రానంటూ.. ప్ర ణయసఖికి దు:ఖసాగరం మిగి ల్చింది. ''నా నర నరాన నీవే'' అంటూ చెప్పిన ఆ మాటలు కన్నీటి మూటలుగా మిగిలాయి ఆ ఇల్లాలికి. ఎన్ని అడ్డు గోడలైనా మమ్మల్ని విడదీయలేవంటూ లోకానికి చాటిన ఆ జంటను జీవితమిచ్చిన తండ్రే విడదీసి..అల్లున్ని విగతజీవిని చేశాడు. కులమనే కత్తిని మెడకేసుకున్న ఆ కర్కశుడు కూతురి బతుకు లో నిప్పులు పోశా డు. చివరకు తాననుకున్నదే తడవుగా కూతురి ప్రాణనాథున్ని కిరాయి హంతకులతో తుదముట్టించాడు. చూడగానే ఒకరి కోసం ఒకరు పుట్టా రేమో అన్నంత అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులను చూస్తే ఎవరికైనా అసూయ పుడుతుంది. అంత అందమైన జంటను చివరకు కులమనే రాక్షసి విడగొట్టింటి. డెబ్బై ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో జరిగిన అన్య ఘటనల్లో ఘోరమైనది. ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుంది...?
ఎవడికి పుట్టింది కులం? పుట్టినప్పుడు లేని కులం, తినే తిండిలో లేని కులం , చచ్చిన తర్వాత మనల్ని పెట్టే మట్టికీ లేని కులం, బతికే ఈ నాలుగు రోజులు కూడా ఆనందంగా గడపకుండా కులం అంటూ విషం కక్కుతున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై దళిడైన ప్రణరును హత్య చేశారు. అయినా ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా స్పందిచకపోవడం బాధాకరం. దళిత ప్రజాప్రతినిధులే స్పందించకపోతే ఇలాంటి హత్యలు పెరుగుతాయే తప్ప తగ్గవు. దేశం ఎటుపోతుంది. లౌకిక దేశం కులాలకు మతాలకు అతీతమైన దేశం అని మనం గర్వంగా చెప్పుకునే ఈదేశంలో రోజురోజుకి కుల ఉన్మాదం విపరీతంగా పెరుగుతున్నది. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ వ్యాప్తంగా దళితులపైనా దాడులు తీవ్రతరమయ్యాయి. గుజరాత్లో ఒక దళిత యువకుడు పెండ్లి చేసుకుని గుర్రంపై ఊరేగుతుంటే, 'నువ్వు ఒక దళితుడివి. నీ పెండ్లీ ఊరేగింపుకు గుర్రం కావాలా?'' అని అతన్ని తీవ్రంగా కొట్టిన పరిస్థితి ఈ దేశంలో ఇటీవలే వెలుగు చూసింది. తెలంగాణలో మంథని మధుకర్, అంబోజి నరేష్, స్వాతి, నుంచి నేటి ప్రణరు వరకూ ప్రతీ రోజు ఏదో ఒక రకంగా దళితులపైనా దాడులకు అగ్రకులస్థులు పాల్పడుతూనే ఉన్నారు. కన్న తండ్రులే కసాయిగా మారి కూతుర్ల జీవితంలో కులం కుళ్లుతో నిప్పులు జల్లుతున్నారు. కూతుళ్ల జీవితాల్లో వెలుగు నింపాల్సిన తండ్రులు క్రూరంగా తయారై ఆ యువతనులను ఆనాథలను చేస్తున్నారు. వలిగొండలో దళిత యువకుడైన నరేష్ బీసీ కులానికి చెందిన స్వాతిని పెండ్లి చేసుకుని ఎక్కడో రాష్ట్రానికి దూరంగ వెళ్లి వారి ఆనందమైన జీవితాన్ని గడుపుతుంటే వారిని నమ్మించి 'జరిగిందేదో జరిగింది. ఇక ఇంటికి రండి' అని మోసపూరిత మాటలు చెప్పి వచ్చిన తరువాత కన్న కూతుర్ని ఇంట్లో ఫ్యాన్ ఉరేసి చంపాడు. నరేష్ను ఊరి చివరకి తీసుకెళ్లి విపరీతంగా కొట్టి అతనిపై కిరోసిన్ పోసి తగలబెట్టిన దుర్మార్గమైన పరిస్థితులు మన 'బంగారు తెలంగాణ'లో చోటు చేసుకున్నాయి. ఇంత జరిగినా ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరిస్తోంది. దళితులపైన ఇన్ని హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందిచడం లేదంటే ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. అధికారంలోకి రాకముందు 'రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు' అని చెప్పి రాష్ట్ర ప్రజలును నమ్మించి, మోసగించి పీఠం ఎక్కాడు. ఆ తర్వాత కూడా దళితులకు మూడెకరాల భూమి, ఇండ్లులేని వారికి డబుల్ బెబ్ రూం ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఇలా ఓ పక్క మాటలతో మరోపక్క అగ్రకుల అ హంకారంతో దళితులపైన దాడి చేసిన వారిని శిక్షించకుండా వదిలేస్తు న్నారు. అసలు ఈ రాష్ట్రంలో దళితులంటే మనుషులే కాదు అన్న రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఇకనెనా ప్రభుత్వం స్పందించి ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఎంతైనా ఉంది. ప్రణరు హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఉరి తీస్తేనే ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉంటాయి.
- గంటేపాక శ్రీకాంత్
సెల్ : 8184945145