Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో ఎక్కడా లే ని కుల సంస్కృతి భా రత్లో ఉంది. కుల సంస్కృతితో దేశం సా మాజికంగా వెనుకబా టుకు గురౌతోంది. కు లోన్మాదాన్ని పాలకులు ఓట్ల కోసం పెంచిపో షిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా రోజురోజుకూ కులదురహంకార హత్యలు జరుగుతున్నాయి. సైన్సు పురోగా భివృద్ధి చెందుతున్న తరుణంలో మన దేశం అనాగరిక సమాజం వైపు తిరోగమనం చెందుతున్నది. కుల రక్కసి వల్ల అమాయకు లు నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. చట్టం ముందు అంతా సమానమని చెప్పే రాజకీ య నాయకులు కులదురహంకార హత్యల పై నోరు మెదపరేం?
మనుషులంతా ఒకటేనని ప్రపంచమం తా ఏప్పుడో తెలుసుకుంది. కులాన్ని, మతాన్ని అమితంగా ప్రేమించే వాళ్ల వల్లే ఈ దాడులు జరుగతున్నాయి. కులం కంటే మానవత్వం గొప్పదని, ప్రణరు హత్య కులదురహంకార హత్యేనని, ఈ తరహా దుశ్చర్యలకు రాజకీయ పరిష్కారం కావాలం టూ సీపీఐ(ఎం), బీఎల్ఎఫ్ ధైర్యంగా ప్రక టించాయి. జంతువులను సైతం ప్రాణంగా ప్రేమించే మనుషులు తోటి మనిషిని ప్రే మించలేక పోతున్నారు. కులం, డబ్బుతో వ చ్చిన అహంకారంతో కండ్లు కావరమెక్కి కుల వివక్ష చూపుతున్నారు. పరాయి దేశంలో ప్రేమించే వారిని గౌరవిస్తారు. మన దేశంలో ప్రేమిస్తే చంపేస్తున్నారు. ఖండాంతర ప్రేమ వివాహాలు జరుగుతున్న తరుణంలో దేశంలో కులాంతర వివాహాలకు మరణమే శరణ్యమ వుతోంది. సమాజంలో ఉన్న అసమానతలే దీనికి కారణం. నేటి చదువులు సంస్కారాన్ని నేర్పలేకపోతున్నాయి. దీంతో సామాజిక అవగాహన మనుషుల్లో కొరవడింది. కులం అనేది పనిని తెలుపుతోంది. పని విభజన క్రమంలోనే కులాలు ఏర్పడ్డాయి. కొందరి స్వార్థం కోసం కులాలను పెంచిపోషిస్తున్నా రు. మనం మనుషులం తోటి మనుషులను గౌరవించాలి. అందరం పీల్చేది ఒకే గాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు రక్తం అవసరమైతే నా కులం రక్తమే కావాలంటామా? నాకులం వాడు పండించిన పంటే తింటామంటామా? అలాంటప్పుడు ఈ కుల భేదాలెందుకూ?
కులం, మతం కాదు మనమంతా ఒకటే. అంతా మనుషులమేనని ఎప్పుడు తెలుసుకుంటాం? కులాన్ని సపోర్టు చేసే వాళ్లని చూసి సిగ్గపడండి. కుల భావాన్ని వీడండి.. కులమనేది కుళ్లు, రోగం వంటిది. నాలుగేండ్లలో 19 కులదురహంకార హత్య లు జరిగాయి. నిజామాబాద్లో సాయికుమా ర్, మంథని మధుకర్, నరేష్, స్వాతి నేడు నల్లగొండలో ప్రణరులను దారుణంగా చంపేసారు. కన్నబిడ్డల కన్నా కులం గొప్ప దా? కుల నిర్మూలనకు సర్కారు చర్యలేవీ? కులాంతర వివాహాలకు భద్రతేది? ఇకనైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి కులాంతర వివాహా లకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. ఇటువం టి హత్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం తేవాలి. ప్రాథమిక విద్యలోనే కుల నిర్మూలనా అంశాన్ని బోధించాలి. కుల వివక్షను రూపుమాపేందుకు ప్రభుతం తగిన చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు జీవితం పట్ల సరైన అవగాహన కల్పించాలి. ఈ హత్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
- చాట్ల రాము
సెల్ : 9908998191