Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో నే అత్యధి క ంగా ఆహార సమస్య క లిగిన దేశం భారత్. ఇ క్కడ సుమారు 50 కో ట్ల మందికి తిండి దొర కడం లేదు. ఆహా రం అందక అనేక అనారో గ్య సమస్యలతో చాలా మంది మరణిస్తు న్నా రు. భారత ఆకలి సూచి క (ఇండియా స్టేట్ హంగర్ ఇండెక్స్) తాజా నివేదికలో నిగ్గుతేలిన నిష్ఠుర సత్యాలివి. పా లకుల వైఫల్యాలకిది నిదర్శనం.
ప్రజల కనీస అవసరాలుగా కూడు, గూ డు, దుస్తుల్ని రాజ్యాంగం గుర్తించింది. స్వా తంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్ప టికీ ప్రజలకు సరిగ్గా తిండి లేదు. ఆహార భద్రత ర్యాంకుల పరంగా ప్రపంచంలో భా రత్ 97వ స్థానంలో ఉంది. 19కోట్ల మందికి పైగా తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధప డుతున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 12కోట్ల మందికి రోజూ భోజనం లభించడం లేదు. 2017లో భూమ్మీద ఆకలితో అలమటి ంచిన అభాగ్యులు 82.1కోట్ల మంది. ప్రతి తొమ్మిది మందిలో ఒకరు పౌష్ఠికాహారలేమి బాధితులేనని ప్రపంచ ఆహార భద్రత, పౌష్టికాహార స్థితి-2018 (ఎస్వోఎఫ్ఐ) నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఐదు సెకన్లకు ఓ చిన్నారి మరణిస్తున్నట్టు యూనిసెఫ్ వెల్లడించింది. ఈ సమస్యకు పే దరికం, ధరల పెరుగుదలలే ప్రధాన కార ణాలు. కేంద్ర ప్రభుత్వం 40కోట్ల మంది కడు పు నింపాలనే లక్ష్యంతో 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది. దీని ద్వారా తక్కువ ధరలకు నిత్యావసరాల సరు కులను అందించాల్సి ఉంది. 2013 జూలై నుంచి ఈ చట్టం అమల్లోకొచ్చింది. కానీ ఆశి ంచిన ఫలితాలు దక్కలేదు. సరైన తిండి లేక పోవడం వల్లే దేశంలో 5 శాతం మరణాలు చోటుచేసుకుంటున్నాయని అంచనా...! దారి ద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వారికి బియ్యం, గోధుమలను అందజేసేందుకు అం త్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ వంటి పథకాలను అమలుచేస్తోన్నా... ఇప్పుడవి ఏ స్థాయిలో పేదలకు చేరుతున్నాయి..? 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ చౌక ధర దుకాణాల ద్వారా తొమ్మిది రకాల సరు కులను రాయితీ కింద రూ.185కే అందించి నా...ఇప్పటి ప్రభుత్వం ఆ పథకాన్ని తుం గలో తొక్కేసింది. ఈ పథకం ద్వారా 7.50 కోట్ల మందికి లబ్ది చేకూరినా... అవేవి ఇప్పు డు అమలులో లేవు. కేసీఆర్ ''నేను అధికా రంలోకొస్తే బంగారు తెలంగాణ తెస్తా'' అన్నా డు. ఇదేనా బంగారు తెలంగాణ...? రాష్ట్రం లో 2018, సెప్టెంబర్ ప్రకారం ఎఫ్ఎస్సీ (ఫుడ్ సెక్యురిటీ కార్డు) కింద 79,81,152 కార్డులకు గాను 2,59,04,687 మంది ఉన్నారు. వీరికి 15,54,28,122 క్వింటాళ్ల బియ్యాన్ని, ఏఎఫ్ఎస్సీ కింద 5,51,369 కార్డులకు గాను 14,97,483 మంది ఉన్నారు. వీరికి 1,92,97,915 క్వింటాళ్ల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. బియ్యం ఒక్కటే సరఫరా చేస్తే ప్రజల్లో ఆకలి సమస్య తీరుతుందా..? రూపాయికి కిలో బియ్యం పథకం ద్వారా బియ్యం, చక్కెర, ఉప్పు, వంట నూనె, చింతపండు, గోధుమలు, గోధుమ పిండి, కందిపప్పు, కారం, పసుపు, మూడు లీటర్ల కిరోసిన్ అందించాల్సి ఉంది. ఇప్పుడు బియ్యం ఒక్కటే సరఫరా చేస్తున్నారు. కేవలం ఏఎఫ్ఎస్సీ కార్డు ఉన్నవారికి కేజీ చక్కెర అందిస్తున్నారు. ఈ అరకొర సరుకులతో పేద ప్రజలు బతికేదెలా..? సిలిండర్ లేని వారికి మాత్రమే లీటర్ కిరోసిన్ ఇస్తున్నారు. ఆ ఒక్క లీటర్తో నెల మొత్తం ఎలా గడు స్తుంది..? కొన్ని గిరిజన, గ్రామీణ ప్రాంతాల లో కరెంటులేక చీకట్లోనే కాలం గడుపుతు న్నారు. వారికి ఈ లీటర్ కిరోసిన్ సరిపోతుం దా..? ప్రాజెక్టులు, గొర్రెలు, బర్రెలంటూ వేల కోట్లు ఖర్చుచేస్తోన్న ప్రభుత్వం ఈ పేదల కడుపు నింపాల్సిన అవసరం ఉంది. మళ్లీ అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలని ఆలో చిస్తున్నారే కానీ, సామాన్య ప్రజల గురించి ఆలోచించడం లేదు. పథకాలను ప్రవేశ పె ట్టడం కాదు.. అవి సరిగ్గా అమలవుతున్నా యో లేదో చూసుకోవాలి..! ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే చౌకధర దుకాణాల ద్వారా 16 రకాల సరుకులను రాయితీ కింద సరఫరా చేయాలి. పేదోడి ఆకలి తీర్చాలి.
- చిన్న బంద్యాల నందిని
సెల్ : 7893082502