Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి, తన మేధస్సును ఉప యోగించి మర మను షులను సష్టిస్తున్నాడు. వాటిని మనుషులతో ముఖాముఖిగా మాట్లాడి స్తున్నాడు. క్లోనింగ్ ద్వారా తనక్కా వాల్సిన కొత్త రకాలైన జాతులను కోరుకున్నట్టుగా అభివృద్ధి చేస్తున్నాడు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఆర్గాన్స్ను ఒకటి కంటే ఎక్కువ మంది బాధితులకి అమర్చి వారి జీవితాల్లో వెలుగు నింపే శస్త్ర చికిత్సలు జరగడాన్ని అర్థం చేసుకుంటున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. శరీరంలో ముఖ్యమైన అవయవం ఏదైనా, పనిచేయడం ఆగిపోయిన సందర్భంలో సరిగ్గా అదే రకమైన కత్రిమ అవయవం అమర్చి, ఆ వ్యక్తిని యధాస్థితిలోకి తీసుకొచ్చే ప్రయోగాల్ని చేస్తూ విజయం సాధిస్తున్నాడు. ఒకరి అవయవాన్ని మరొకరికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాన్టేషన్ ద్వారా అమర్చి, బతికించుకునే విజ్ఞానం అత్యంత సాధారణమైపోయింది. తల్లి గర్భసంచిని అవయవమార్పిడి పద్ధతి ద్వారా, బిడ్డకు అమర్చి, అదే గర్భసంచితో కూతురు మరొక బిడ్డకు జన్మనివ్వడం చూశాం, విన్నాం. ఇవన్నీ ఆశ్చర్యకర సత్యాలు. మానవ మేధస్సు అకుంటిత దీక్షతో అనేక విఫల ప్రయోగాల అనంతరం, సాధించిన విజ్ఞాన ఫలాలు. మేధోపరంగా మనిషి ఎంతో ఎదిగాడు. అయినప్పటికీ, జీవితాన్ని మరింత సులభతరం చేసుకోవడానికి తన కొత్త ఆలోచనలను, ప్రయోగాలను ఆపడం లేదు. కానీ ఇదే సమాజంలో నమ్మకాల పేర వివిధ పుణ్యక్షేత్రాలకి వెళ్లి, ప్రమాదాలను కొనితెచ్చుకుని, మరణించిన సందర్భాలు కోకొల్లలుగా చూశాం, చూస్తూనే ఉన్నాం. కుంభమేళాలో తొక్కిసలాట నుండి విజయవాడలో హారతి దర్శనానికి పోయి జలసమాధి వరకు, మక్కాలో సైతాన్ కన్పించదు కానీ, ఆచారం ప్రకారం ఉందనుకొని దానిపై రాళ్ళు విసిరే క్రమంలో జరిగన తొక్కిసలాటల ఘటనల నుండి పంజాబ్లో రైలుపట్టాలపై నిలబడి రావణ దహనాన్ని వీక్షిస్తూ రైలు ప్రమాదానికి గురైనంత వరకు. ఎన్నో, ఎన్నో ఎన్నెన్నో. ఏమని చెప్పాలి? ఎంతని చెప్పాలి? మూకుమ్మడి మరణాలు. వీటన్నింటికి కారణం ప్రభుత్వ తప్పిదాలు కొన్నైతే, మనస్సులో మానులైన మత నమ్మకాలు మరికొన్ని. పై సంఘటనలన్నింటిలో సారుప్యమైన విషయం ఏమంటే, అప్పటిదాక అత్యంత సంతోషంగా గడిపిన వారిని, మత్యువు ఏదో రూపంలో వచ్చి తమను తాము రక్షించుకోలేని పరిస్థితిలోకి నెట్టి మరణ కూపంలోకి తోయడం.
నమ్మకాలు వ్యక్తిగతం. ఎవరికి నచ్చింది వారు పాటించుకోవచ్చు. దానిలో ఎలాంటి అభ్యంతరం లేదు. కాని, అవే జీవితాన్ని కబలించే స్థాయికి చేరితే? ఎవరికి నష్టం? వారి మీద ఆధారపడిన కుటుంబాలకే కదా! అమత్సర్ జోడాపాఠక్లో జరిగిన రావణ దహన విషాదంలో 61 మంది, రైలు ఢకొీట్టడంతో మత్యు ఒడిలోకి జారుకోవడం,70 మందికి పైగా గాయపడటం, వారిలో 10 మంది పరిస్థితి విషమించడం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రైలు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి ప్రభుత్వాధినేతలు స్పందిస్తూ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని మేజిస్టేరియల్ విచారణ కమిటీని నియమిస్తున్నామని చెప్పారు. నిజంగా ఆ కమిటీ వలన బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందా? అనే సందేహం కలుగుతున్నది గత అనుభవాలను పరిశీలిస్తే. మొన్న గోదావరి పుష్కర సమయంలో జరిగిన దుర్ఘటనపై నియమించిన విచారణ కమిటీ ఏం నివేదిక ఇచ్చింది? ఎవరిని దోషిగా నిలబెట్టింది? దుర్ఘటనకి కారణం ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోయింది. అధికారికంగా నిర్వహించే మత కార్యక్రమాల్లో ప్రజల తప్పిదాలకన్నా నిర్వహణ లోపానిదే ఎక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వాలను, నిర్వాహకులను కాపాడే నివేదికలే వస్తాయి. వాటిలో తప్పంతా ప్రజలమీదకే తోసి, అసలు కారణాలను మరుగున పడేస్తారు. జోడా పాఠక్ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెల్సుకునేందుకు నియమించిన కమిటీ కూడా ఇచ్చే నివేదిక, ఇంతకన్నా భిన్నంగా ఏం ఉండకపోవచ్చు. పంజాబ్లో ఇప్పటికే ప్రమాదంతో తమకేం సంబంధం లేదని ఒక్కో వ్యవస్థ తప్పుకుంటుంటే ఎవరిని నిందించాలి? రాజకీయ నాయకులు మాత్రం దీన్ని కూడా ఓట్లు రాల్చుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజల పక్షం ఆలోచించేదేవరు? ప్రభుత్వాలు నియమించే విచారణ కమిటీలు, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టివ్వవు అని గత అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. పాలకులు మత కార్యక్రమాలు ప్రోత్సహించరాదన్న ఆదేశాన్ని తుంగలో తొక్కి అధికారికంగా నిర్వహించడానికి అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలే కదా మొదటి ముద్దాయిలు. చిన్న కార్యక్రమం చేసుకోవడానికి అనుమతి తీసుకోవాలంటేనే, ఎన్నో సాకులు చెప్పే పొలీసు వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థలు అక్కడ సరిపోయినంత మైదానం లేకున్నా, పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నా, అనుమతి ఎలా ఇచ్చింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవరిని ఎన్ని అన్నా, పోయిన ప్రాణాలు తీసుకురాలేం. కానీ భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి నివారణ మార్గాలు మాత్రం తప్పక వెతకాల్సిందే.
మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేముందు ఎవరైనా ప్రజల సమస్యలను దష్టిలో పెట్టుకుని దాన్ని వ్యతిరేకిస్తే వారిని మత వ్యతిరేకులుగా చిత్రీకరిస్తారు. పైగా ప్రజల నమ్మకాలను గౌరవించాల్సిన బాధ్యత తమ మీద ఉంది కాబట్టి దానిని జరపాల్సిందే అని ప్రభుత్వాలే పట్టుబట్టి చేస్తే ఇక చేసేదేముంది. నిజమే అభిప్రాయాలను గౌరవించాల్సిందే, దానిలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ దానినుంచి ప్రజలకు ఏం ప్రయోజనం వస్తుంది అన్న ప్రాథమిక ఆలోచన చేయాలి కదా. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పాలకుల కనీస బాధ్యత కాదా! ఎప్పుడో, ఏదో జరిగిందని చెప్పి, దహనం చేసి, వారిపై పగ తీర్చుకుందామని/ దాన్ని తిలకించి పుణ్యం సంపాదించుకోండి అని చెప్పి జనసమీకరణ చేసినవారు, నిలబడటానికి సరిపడా స్థలం ఉందా, లేదా అనే ఆలోచన చేయకపోవడం విచారకరం. ఈ ప్రమాదానికి కారణం ఆ రాష్ట్ర మంత్రి గారి భార్య నవజ్యోత్కౌర్ ఆలస్యం ఒకటైతే, ఆమె వచ్చిన తర్వాత కార్యక్రమ నిర్వాహకుడు అమెనుద్దేశించి చేసిన ప్రసంగం మరొకటి. ఆ ప్రసంగంలో ''మేడం, మిమ్మల్ని చూడటానికి ఇంతమంది వచ్చారు, పట్టాలపై 5వేల మంది ఉన్నారు. వారు 500 రైళ్లొచ్చినా లెక్కచేయరు' అని ఉద్వేగంగా అన్నట్టు ప్రసార మాధ్యమాలలో విరివిగా ప్రచారమవుతున్నది. నిజంగా ఒక కార్యక్రమ నిర్వాహకుడు అనాల్సిన మాటేనా అది. ఎంత బాధ్యతారాహిత్యం? వచ్చిన వారందరూ క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు బాధ్యతగా వ్యవహరించే నిర్వాహకుల్ని చూశాం కాని ప్రభుభక్తి కోసం అమాయకుల ప్రాణాలను ఫణంగా పెట్టి రెచ్చగొట్టే ప్రసంగం చేసిన ఇలాంటి వారిని చూడలేదు. అతగాడి బుద్ధి గడ్డితిని అలా అని ఉంటాడు, మరి అతిథిగా వచ్చిన మంత్రి గారి భార్యకేమైంది? అతనలా అంటుంటే వారించవచ్చు కదా! రైలు పట్టాలమీద నుంచి అందరిని ఖాళీ చేయించవచ్చు కదా? అదేమైన అసాధ్యమా? కాదు కదా. ప్రమాదానికి మరో ప్రధాన కారణం, రైలు దగ్గరికి వచ్చేంత వరకు పట్టాలపై నిల్చున్నవారు గమనించలేదు. దాని తాలుకు శబ్దం కూడా వారికి వినిపించలేదు. కారణం అత్యంత భారీ శబ్దాలు చేసే బాణసంచాను కాల్చుతూ దహన కార్యక్రమాన్ని కొనసాగించడం. రైలు రావడం, బాణసంచా పేలడం రెండు ఏకకాలంలో జరగడంతో, ఈ విజయదశమి ఎందరో అభాగ్యులకు కడుపుకోతను, చేదుజ్ఞాపకాలను మిగుల్చుతూ, రావణ దహనం సాక్షిగా ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెట్టివేసింది. ప్రభుత్వ, నిర్వాహకుల, వ్యవస్థల మూకుమ్మడి లోపాల వలన జరిగన ఈ ప్రమాదం మనకు పెద్ద హెచ్చరిక కావాలి. ఏదేమైనా రైలు, మత్యు శకటమై అమాయకులను కబలించడం ఇప్పుడిప్పుడే మానిపోయే గాయం కాదు. భవిష్యత్ లోనైనా ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి అభ్యర్థించినప్పుడు అన్ని వ్యవస్థలు పక్కా సమాచారం తీసుకుని ప్రజల భద్రతకు ప్రాముఖ్యతనిస్తూ, ఎలాంటి ప్రమాదం, ప్రాణనష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆశిద్దాం.
రవికుమార్ సంగనమోని
సెల్ :789390340