Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ధన మూలమిదం జ గత్' అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ధనాన్ని సరైన ఇంధనంగా మా ర్చుకుని చక్కని ప్రణాళికతో ము ందుకెళ్తే ఏ విధమైన సమస్యలూ వుండవు. సమాజంలో పేదలు, నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబీకులు, ధనికులు, కు భేరులు, నల్ల కుబేరులు, శ్రా మికులు, కర్షకులు, కార్మికులు, వర్తకులు అని రకరకాల వర్గాలు ఏర్పడ్డాయి. ఈ వర్గాల న్నీ ఆర్థిక అంతరాల నేపథ్యంలో ఏర్పడినవే. ఈ ఆర్థిక వ్యవస్థకు అసలైన కందెన 'ధనం' అనే విషయం గురిం చి వేరే చెప్పవలసిన పని లేదు. ఈ డబ్బును పోగు చేయాలంటే... మొదట పొదుపు గురించి ఆలోచించా లి. ఆ పొదుపు ద్వారానే అంచెలంచెలుగా అభివృద్ధి చెం దడానికి అవకాశముంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఏర్పడిన కరువు ప్రభావంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడటం తో నెహ్రూ చాలా చోట్ల అంబలి కేంద్రాలను (గంజి కేంద్రాలను) ఏర్పాటు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా వున్నప్పుడు పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతోపాటు ఆహార ధాన్యాల కొరత ఏర్పడటంతో 'జై జవాన్-జై కిసాన్' అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. అప్పుడు చాలామంది రాత్రి పూట భోజనం మాని కేవలం చపాతి మాత్రమే తిన్నారు. కాగా... కాలానుగు ణంగా చాలా మార్పులు, చేర్పులు జరగడంతో నేడు ఆహారధాన్యాలకు గతంలో మాదిరి కొరత లేదు. ఇదేవిధంగా నేటి ఆధునిక పద్ధతులలో భాగంగా చాలా మందికి డబ్బు సంపాదించడం తేలికైన పనిగా మారింది. అయితే... ఇదే సందర్భంలో అదే డబ్బును విచ్చలవిడిగా వింధులు, వినోదాలకు, ఐశ్వర్యానికి ఇతరత్రా విలాసాలకు ఖర్చుపెట్టడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు భూతల స్వర్గంలాంటి అమెరికా 2008లో వచ్చిన ఆర్థికమాంధ్యపు సంక్షోభంలో చాలా అతలాకుతలమైంది. నేటికీ... అమెరికాలో సరైనవిధంగా పరిస్థితులు చక్కబడలేదు. అందుకే.... ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ మన ఉద్యోగాలు, మన నియామకాలు, మన నిధులు అనే పదాలతో ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన అమెరికన్ల మీద సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. మూడు సంవత్సరాల కిందట గ్రీసు రాజ్యం పూర్తిగా దివాళా తీసింది. రెండేండ్ల కిందట భారతదేశంలో వచ్చిన పెద్ద నోట్ల రద్దు వ్యవస్థ ద్వారా సామాన్యులు అనేక అవసరాల కోసం చిల్లర నోట్లు దొరకక ఎన్నో బాధలు పడ్డారు. మొత్తం మీద నేటి 21వ శతాబ్దంలో కూడా ప్రపంచవ్యాప్తంగా పేదరికం జనాభా సరాసరిన 30శాతం వుండగా భారతదేశంలో ఈ పేదరికం 40శాతం వరకు వున్నది. ఈ పేదలను ఆడంబరాలకు దూరంగా వుంచి వున్నంతలో పొదుపు పాటిస్తూ సర్దుకుపోయే విధంగా మానసిక చైతన్యవంతులను చేయడానికి ప్రధాని మోడీ ఆ మధ్య వివాహ ఖర్చుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చారు. అదే సందర్భంలో అప్పటి జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ కేవలం రూ.5 లక్షల ఖర్చుతోనే పెండ్లిలు చేయాలని ఆ రాష్ట్రానికి అనుగుణంగా చట్టం తీసుకొచ్చారు. రెండు నెలల కిందట కేరళలో వచ్చిన తుఫాను వల్ల మొత్తం రాష్ట్ర ప్రజలు కొన్ని రోజులు గుక్కెడు తాగునీళ్లు, పిడికెడు భోజనం దొరకక అవస్థలు పడ్డారు. మొత్తం దేశ ప్రజలు వారికి సంఘీభావం తెలుపుతూ ఎవరికి తోచిన రీతిలో వారివారి స్థాయిలో విరాళాలు పంపించారు. 20 రోజుల కిందట శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన తుఫాను ద్వారా కూడా ఆ జిల్లాలోని కొన్ని మండలాల ప్రజలు ఆహార పొట్లాల కోసం ఎదురు చూశారు. వారు పూర్వ వైభవం కోసం ప్రభుత్వం, దాతలు అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి ఉపధ్రవాలు ఏర్పడినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా పొదుపు చేసుకొని బీమా కంపెనీలలో తమ ఆస్తులకు, వ్యాపారాలకు బీమా చేయించి వుంటే... ఆ పొదుపు సొమ్ము, ఆ బీమా సొమ్ము నేడు ఎంతగానో వారికి ఉపయోగపడేది. ఇలాగే 1981లో బంగ్లాదేశ్లో ఒక నిరుపేద మహిళ చిన్న బుట్టలో పండ్ల వ్యాపారం చేస్తూ రూ.10 లాభం రోజూ ఆర్జించేది. ఒక వ్యక్తి చెప్పిన స్ఫూర్తి మాటలతో ఒక పూట పస్తు వుంటూ ఆ పది రూపాయలలో ఒక్క రూపాయి పక్కన దాచిపెట్టేది. అలా యాభై రోజులకు పోగైన యాభై రూపాయలతో సరుకు (పండ్లు) అప్పు రూపంలో కాకుండా నేరుగా కొనుక్కోవడంతో అప్పటినుంచి ఆమెకు ఇరవై రూపాయలు లాభం వచ్చేది. ఆ తరహాలో ఆమె బాటలో మరికొంతమంది మహిళలు పొదుపు మార్గం పట్టడం, ఆ మహిళలే తరువాత మహిళా సంఘాలుగా, పొదుపు సంఘాలుగా, మహిళా సమాఖ్యలుగా మారారు. నేడు భారతదేశంలో మహిళా సమాఖ్యలు పోటీ వ్యవస్థను నడిపే స్థాయికి వచ్చాయి. పాలకులు ఎవరు వచ్చినా.... మహిళా సమాఖ్యల సహకారం తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ మహిళా సమాఖ్యల కోసమే మహిళా బ్యాంకు కూడా ఏర్పాటైంది. ఈ తరహాలో యువజన సంఘాలు, రైతు సంఘాలు, ఇతరత్రా సామాజిక సంఘాలు పొదుపు మార్గాన్ని పాటించి బలోపేతమై వారి జీవితాలను వారే చక్కబెట్టుకొనే స్థాయికి ఎదగాలి.
తిప్పినేని రామదాసప్పనాయుడు
సెల్ : 99898 18212