Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయాల్లో శాశ్వత శత్రు వులు లేదా మిత్రులు ఎప్పు డూ ఉండరని పెద్దలు అంటుంటారు. ఇది నిజమే. నేడు శత్రువులు లేదా మిత్రులు కాదు ఫ్రంటులు, పొత్తులు, ఎత్తులు కూడా ఎప్పుడు ఉంటయి, ఉండయి అనేది చెప్పడం అసాధ్యం. ఎందుకంటే నేడు రాజకీయం సిద్ధాంత రాద్ధాంతాలతో సంబంధం లేదు. జిత్తులు, గెలుపు పందెమే నేడు ముఖ్యమైనది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రసవత్తరంగా ఆ వైపుగా సాగు తోంది. ఉభయ రాష్ట్రాల సీఎంలు మరోసారి గెలుపు కోసం వ్యూహాలు సృష్టించుకున్నారు. అమలు చేస్తున్నారు. కేసీఆర్ గామధ్య ఫెడరల్ ఫ్రంటు గురించి మాట్లాడినప్పుడు విలేకరులు చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటర? అని అడిగి నప్పుడు 'ఆయన నా మంచి మిత్రుడు' అని చెప్పిండు. నేడు తెలంగాణ ద్రోహి, అవినీతిపరుడు అంటున్నడు. ఇగ చంద్ర బాబైతే.. ఇంగ్లీష్ చానల్కిచ్చిన ఇంటర్వ్యూలో 'కేసీఆర్ ఈజ్మై కొలీగ్' అని చెప్పిండు. మొన్ననైతే 'నేను కేసీఆర్తోనే దోస్తీ చేద్దామనుకున్న. కాని మోడీ మా మధ్య లొల్లి పెట్టిండు' అని చెప్పిండు.అట్ల మిత్రులు కేసీఆర్, చంద్రబాబులు పల్లవి మార్చుకున్నరు. కానీ నేడు తమను తాము రాజకీయంగా శత్రువులుగా చెప్పుకుంటున్నరు.
'సెంటిమెంటు' వ్యూహాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే అభివృద్ధి, సమస్యల పరిష్కారాల గురించి, తామేం చేస్తారో నాయకులు చెప్పడం లేదు. సెంటిమెంటు పంట పండిస్తరు. ఓట్లు పొందుతరు. గద్దెనెక్కి పాలిస్తరు. గత ఎన్నికల్లో అదే వ్యూహంతో తెలుగు చంద్రులు (కేసీఆర్, చంద్రబాబు) విజయం పొంది ముఖ్య మంత్రులయ్యారు. తెలంగాణలోనైతే ఆత్మగౌరవ నినాదంతో నీళ్లు-నిధులు-నియామకాలు త్రయంతో బలమైన తెలంగాణ ప్రాంతీయత్వంతో కేసీఆర్ ఎన్నికల యుద్ధంలో ఎదురు నిలబడ్డడు. ఆంధ్ర పాలకులు, గత పాలకులను విలన్గా చూపించి తెలంగాణ సమాజాన్ని టీఆర్ఎస్కు ఓటేయమని అభ్యర్థించిండు. బొటాబొటి మెజార్టీతో సీఎం పీఠమెక్కిండు. చంద్రబాబైతే తనకు అనుభవముందని అడ్డగోలుగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని, కట్టుబట్టలతో విడగొట్టిందని, విభజనలో హేతుబద్ధత లేదని, ఇటువంటి సమయంలో రాష్ట్రానికి తనలాంటి అనుభవశాలియైన నాయకుడు అవసరమనే సెంటిమెంటు నూరిపోసిండు. కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించిండు. మోడీ, పవన్కళ్యాణ్ హవా తోడ్పాడుతో ఈయన కూడా బొటాబొటి మెజార్టీతో వైసీపీ కంటే కేవలం 2 శాతం ఎక్కువ ఓట్లతో ముఖ్యమంత్రి పీఠమెక్కిండు.
మళ్లీ అదే వ్యూహాలు
ఒకసారి మోసపోతే పర్వాలేదు కాని మరోసారి అదే తరహా మోసపోతే అది కచ్చితంగా మోసపోయేవాడి తప్పు. ఎందుకంటే మోసపోయేప్పుడు మోసపోతున్నామని తెలు స్తోంది. కాబట్టి అక్కడ అడ్డుకట్ట వేసుకోవాలి. కొంతమేరనైనా తెలివి ఉపయోగించాలి. వ్యూహానికి ప్రతివ్యూహామూ పన్నా లి. ఏమిటీ అదే వ్యూహాలు అంటే గవే 'సెంటిమెంటు' వ్యూహా లు. 'తెలంగాణ గడ్డ ఇది, ఇక్కడ ఆత్మగౌరవ గులాబీలు మాత్రమే పాలించాలి' అని చెప్పి ప్రచారం షురూ చేసిండు గులాబీ దళపతి. కొంగరకలాన్ వేదిక మీదికెళ్లి ఇగ ముందస్తు ప్రారంభించి, ముహూర్తం మంచిగున్న రోజు హుస్నాబాద్లో మాట్లాడిండు. కొత్తకుండల ఈగ సొచ్చినట్టు తెలంగాణల టీఆర్ఎస్ అధికారంలకొచ్చినప్పుడున్న కష్టాలు కన్నీళ్లు ఉన్నయని, ఇప్పుడు గవన్నీ తీర్చిన అని చెప్పి ప్రచార పర్వాన్ని రక్తికట్టిచ్చేందుకు తనదైన శైలిలో వ్యూహాన్ని పన్ని తెలంగాణ ఎన్నికల యుద్ధంలో ఎదురొడ్డుతాండు. తెలంగాణ ఆత్మగౌర వం గురించి గర్జించే ఉద్యమ సింహం, ఉస్మానియాల మౌన ముద్ర దాల్చడానికి కారణమేందో చెప్పాలి. తెలంగాణ సి ద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్సారు, ఇంజినీరు ఆర్.విద్యాసాగర్రావు స్మారక స్థూపాలు, భవనాలు ఎందుకు నిర్మించలేదు? వాళ్లు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు కాదా? వాజ్పేయి, నందమూరి హరికృష్ణ స్మారకార్థం భవనం నిర్మిస్తామని గులాబీ ప్రభుత్వం చెప్పి, తెలంగాణ ప్రతీకలైన నాయకులను ఎందుకు మరిచింది. వాజ్పేయి లేదా హరికృష్ణ స్మారకార్థం భవనాలు నిర్మిస్తే మంచిదే, కాని తెలంగాణ ప్రతీకగా నిలిచిన వారిని కేసీఆర్ మరిచిండన్న విషయం ప్రజలు, తెలంగాణ సభ్యసమాజం గమనించాలి. ప్రజలకు తాను చేసిన ప్రగతి గురించి వివరించకుండా సెంటిమెంటు పంట పండించి, మళ్లా సీఎం పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తాండా అనే అనుమానం ప్రజల్లో వస్తుంది? ముఖ్యంగా నిరుద్యోగుల్లో, చైతన్యం గల ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే నాడు చెప్పిన మాటలు నేడు లేవు. చెప్పేటోనికి ఇజ్జత్ లేకుండా ఏందిగనీ ఇనెటోనికన్న ఇజ్జతు ఉండాలే గద అని అన్నడు. అది నిజమే. గానాడు అసెంబ్లీ సాక్షిగా లక్షా7 వేల ఉద్యోగాలు టీఆర్ఎస్ అధికారంలోకొచ్చినంక అధికారి కంగా చెప్పిండు ఇస్తనని. ఇంక చాన చెప్పిండు. డబుల్ ఇండ్లు, డల్లాస్ నగరం లెక్క హైదరాబాదు, మూడెకరాల భూమి, రిజర్వేషన్ల పెంపు, సాగు నీరు, తాగునీరు వీటన్నింటి గురించి కదా ఆయన ప్రచారం చేయాలే. కాని ఇవేవి చెప్తలేడు. తిట్ల పురాణం షురూ చేసిండు. టాయిలెట్ జోకు కాంగ్రెసోల్ల మీద, అవినీతి పరులు 'ఓటు'కు నోటు కేసు టీడీపోళ్ల మీద గరమై టీఆర్ఎస్ మైలేజ్ పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తాండు. అసలెట్ల నిరుద్యోగ భృతి ఇస్తరు అన్నడు? మళ్లా భృతి ఇస్త అంటాండు. మ్యానిఫె స్టో పాక్షికంగా పండుగకు ముందు రిలీజ్ చేసి కానుక ఇచ్చిన అంటాండు. అసలు భృతి కావాలనే నాడు టీఆర్ఎస్ 610 జీవోను వ్యతిరేకించి స్థానికేతురలకు ఇక్కడ ఉద్యోగాలొద్దు తెలంగాణ వాసులకే, నిరుద్యోగులకు ఉద్యోగాలియ్యాలన్నది. నాడు ఉద్యోగమిస్తనని, నేడు నిరుద్యోగ భృతి ఇస్త అంటాండు. ఇది న్యాయమేనా? తెలంగాణ చైతన్య సమాజం ఓసారి ఆలోచన చేయాలే. సెంటిమెంటు భావోద్వేగంతోటి మళ్లా టీఆర్ఎస్ను ఎన్నుకోవాలా? లేక తమ బతుకులు మార్చే ప్రజానాయకులు అధికారంలకు రావాల్నా?
ఇగ చంద్రాలు సారు ఏం చేసిండు? బాబు వొస్తే జాబు వొస్తది అన్నడు, కాపు రిజర్వేషన్ అన్నడు, సింగపూర్ లాంటి రాజధాని, ప్రత్యేక హోదా, ఇట్ల చెప్పుకుంటపోతే చాన ఉన్నయి. పరిశ్రమలు, అభివృద్ధి సుపరిపాలన వంటి హామీలతో అధికారంలకొచ్చిండు. నేడు ప్రత్యేక హోదా కోసం రూట్ మార్చి తాను మద్దతిచ్చిన బీజేపీతో తెగదెంపులు చేసుకున్నడు. డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి వాటికి, ఏకకాలం ఎన్నికలు (పార్లమెంటు-అసెంబ్లీ) మద్దతిచ్చి మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వ్యతిరేకించిండు. నేడు వీటన్నింటిని ప్రశ్నించేందుకు వామపక్షాలు, పవన్కళ్యాణ్, జగన్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంలో ఎదురున్నారు. ఎగబాకుతూ, ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రాలు సారు తన వ్యూహాలు మార్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటడు. ఆంధ్ర ప్రజల్లో ప్రత్యేకహోదా పట్ల భావన బలంగా ఉందని, బీజేపీ దానిని విస్మరించిందని, తెలుసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాటం అని చెప్పి, ధర్మదీక్షలు, పోరాట దీక్షలు, గ్రామదర్శిని వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకమైద మని తెలివిగా బీజేపీతో బంధం తెంచుకున్నడు. అయితే ఇక్కడ గమనించాల్సిన నాలుగున్నరేండ్లు అంటకాగి ఇప్పుడు నాకేం తెలియదు నమ్మిన అంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా ఉన్నారా? నాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నదెవ రు? వెంకయ్యనాయుడు గారిని సన్మానించినది ఎవరు? తెలుగుదేశం శ్రేణులు కాదా? ఆత్మ సమీక్ష, ఆత్మ పరిశీలన చేసుకోవాలే. ఒకనాడు పాచిపోయున లడ్డు అని పవన్ కళ్యాణ్ చెబితే దానిని సమర్థించిండా? రాజధాని ఎంతవరకు నిర్మాణం అయింది? ఇవన్నీ తెలుపాల్సి ఉంది.
అయితే చంద్రులిద్దరూ ఒక ఆకుల చదువుకున్నోళ్లే కాబ ట్టి వీరిలో ఏకస్వామ్య, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఎవరి కి వారే సాటి. ప్రయోజన రాజకీయలే పరమావధిగా పాలిటి క్స్ చేస్తున్నరు. అయితే ప్రజాస్వామ్యం అంటే ఏకపక్ష నిర్ణయా లు కాదు, ప్రజాకాంక్షలు, అభిమతాలు అసలైన లక్ష్యాలు చేసుకుని సామాజిక న్యాయస్థాపన కోసం పాటుపడేవారిని తమ నాయకులుగా ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుంది. ఆ దిశగా ప్రతి ఓటరూ వ్యూహం పన్ని తమ బాధ్యతయుతమైన పౌర పాత్ర నిర్వహించాలి.
అంబీర్ శ్రీకాంత్
సెల్: 8185968059