Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగమన్నా, ప్రజాస్వామన్నా వాటి ఆధారంగా నడిచే వ్యవస్థలన్నా, స్త్రీ-పురుష సమానత్వమన్నా ఆర్ఎస్ఎస్కు అసలు గౌరవముండదు. వాటికి అనుకూలంగా ఏ నిర్ణ యం వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండదు. ఎక్క డాలేని రీతిలో విష ప్రచారానికి దిగుతూ ప్రజల మధ్య చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నది. ఎప్పు డూ ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ప్రజల మధ్య మత పరమైన భావోద్యేగాలు రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలు రాజేయడమే ఆర్ఎస్ఎస్ అసలు ఎజెండా. మొదట్లో మూకోన్మాదమంటే తమ అభిప్రాయాలను గౌరవించని వ్యక్తులపై దాడులు అనుకునేవారు. ఇప్పుడు రాజ్యాంగ సంస్థలనూ, న్యాయస్థా నాలనూ హిందూ మతోన్మాద సంస్థలు వదలడం లేదు.
ఇటీవల కోర్టు తీర్పులపై బీజేపీ నేతలు, సంఫ్ుపరివార్ శక్తులు చేస్తు న్న వ్యాఖ్యానాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఒకవైపు రాజ్యాం గ వ్యవస్థలను నాశనం చేస్తూ మరోవైపు న్యాయస్థానాలపైన ప్రజల్లో న మ్మకం సన్నగిల్లేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఆందోళనకరంగా ఉ న్నాయి. అయోధ్య భూ వివాదంపైనా, శబరిమలకు మహిళల ప్రవేశం పై నా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర మ ంత్రులు, బీజేపీ పాలిత సీఎమ్లు, సంఫ్ుపరివార్ పెద్దలు చేసిన వ్యా ఖ్యలు పరిశీలిస్తే మరోరూపంలో మూకోన్మాదంతో ప్రజల్లో భావోధ్యేగాల ను రెచ్చగొడుతున్నారని చెప్పవచ్చు. శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడమే మహాపరాధమన్నట్టు కేరళలోని వామపక్ష ప్రజా తంత్ర కూటమి(ఎల్డీఎఫ్) ప్రభుత్వాన్ని పడగొడతామని అమిత్షా అన్నా రంటేనే భారత రాజ్యాంగంపైనా, ప్రజాస్వామ్యంపైనా ఉద్దేశపూర్వకంగా దాడికి సిద్ధమయ్యారన్నది వాస్తవం. తమకు అనుకూలంగా తీర్పు లేకుం టే ఇలానే చేస్తారా? బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నతస్థాయికి వెళ్ల డం వారికిష్టం లేదనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది. పైకి తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేరిందని బీజేపీ నేతలు చెప్పుకోవడం విడ్డూరం.
నాలుగున్నరేండ్ల పాలనలో తమ అసమర్థత ఎక్కడ బయటప డుతుందోనన్న భయంతో చట్టాలు, రాజ్యాంగ వ్యవస్థలు సరిగా లేవన్న ట్టుగా చిత్రీకరించేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. అయోధ్య విష యంలో కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకు రావాలని చెప్పడమంటేనే దేశాన్ని మళ్లీ వెనక్కుతీసుకెళ్లడమే. ఇటీవల ఒక కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టులో బీజేపీ ఎంపీ వ్యవహరించిన తీరు ఆందోళన కలిగించిన అంశం. తాను చట్టాన్ని అదుపులోకి తీసుకోకుంటే కొంతమంది మూక ప్రభుత్వం సీల్ వేసిన వ్యాపార దుకాణాల తాళాలు పగులగొట్టి హింసాత్మక దాడులకు పాల్పడేవారనీ, అందుకే తాను ప గులగొట్టాల్సి వచ్చిందని చెప్పడం వల్ల ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎ లాంటి సూచనలు ఇస్తారు. చట్టవ్యతిరేకంగా నడుస్తున్న దుకాణాలను అ క్కడున్న రాష్ట్ర ప్రభుత్వం సీల్ వేయడం ఎలా తప్పు. చట్ట వ్యతిరేకంగా న డవడం లేదని ఆధారాలు చూపిస్తే కోర్టే సరైన తీర్పు ఇచ్చేది. కోర్టుల పట్ల తప్పుడు భావనను కలిగించడమే బీజేపీ ప్రయత్నమని అర్థమవుతున్నది.
త్రిపుర, రాజస్థాన్, చత్తీస్గడ్, మహారాష్ట్ర ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎమ్లు ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చకు రానీయకుండా భావోద్యేగాలను ఎగదోసేందుకు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. నాలుగున్నరేండ్లలో నిర్మాణాత్మకం గా ప్రజలకు ఏమి చేశారో చెప్పుకోలేని కమలనాధులు ఈ మూక భావోద్వే గాలను నమ్ముకోవడం కొత్తమీ కాదు. ఇది దేశానికి ప్రమాదకరమని తెలిసినా వారికి చింత లేదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతో న్మాదులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. గతంలో ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో గొడవలు సృష్టించిన వారు ఇప్పుడు తాము పాలిస్తున్న రాష్ట్రాల్లోనే మూకోన్మాద దాడులకు తెగబడ్డారు. ఆర్ఎస్ఎస్ శిక్షణ పూర్తి చేసుకున్నవారిలో చాలామంది మోడీ ప్రభుత్వంలో వివిధ హౌదాల్లో పదవులు అనుభవిస్తున్నారు. ప్రధానితో పాటు సాక్షాత్తూ రాష్ట్రపతే ఆర్ఎస్ఎస్ శిక్షణ నుండి వచ్చిన వారే. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నవారిలో ఎక్కువమంది ఆ సంస్థలో శిక్షణ పొందినవారే. కొంతమంది అధికారంలో ఉన్నా, లేకున్నా ఒకే రకమైన మూక మనస్తత్వం గలవారన్నది గతంలో వారు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. బీజేపీ పాలిత రాజస్థార్ ఆల్వార్లో ఉమర్ఖాన్ అనే రైతును గో గూండాలు కాల్చి, తలను నరికి స్థానిక రైల్వే ట్రాక్పై పడేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచ లనమైంది. ఆ తర్వాత అదే ప్రాంతంలో అదే సామా జికవర్గానికి చెందిన రైతునూ చంపేశారు. ఈ రెండూ సంఘటనల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు వాస్తవాలను వక్రీకరించి కేసును పక్కదారి పట్టించేందుకు కుటుంబ సభ్యులను బెదిరించారు. బాధిత కుటుంబాలకు పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ సాయం చేయ లేదు. వీటిని ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలు ఖండించడానికి ముం దుకురాలేదు. చనిపోయిన కుటుంబాలు మైనార్టీలు కావడంతో తాము చెప్పింది నిజమని చెప్పడానికి మూకలు ప్రయత్నించాయి. ఇలా మూకో న్మాద దాడుల్లో దేశవ్యాప్తంగా 50 మందికి దాకా చనిపోయారు. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయి. హక్కుల నేతలనూ వదల్లేదు. దళితు లపై దాడులు చేశారు. మహిళలను వేధించారు. గోవులను కాపాడే నెపం తో జరుగుతున్న మూక హింసను నిషేధించేందుకు చట్టం చేయాలని సుప్రీంకోర్టు సూచించినా కేంద్రం ఏ మాత్రం స్పందించలేదు. కేంద్రం దారిలోనే బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అనుకరించాయి. అయోధ్యపై నాలుగున్నరేం డ్లుగా పట్టించుకోని సంఘపరివారం ఎన్నికల సమయంలో సుప్రీం కోర్టు ఆ విషయాన్ని వెంటనే తేల్చాలని పట్టుబట్టడం వెనుక రాజ కీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే బీజేపీ, సంఫ్ు పరివా ర్ పెద్దలు చట్టం, న్యాయం, రాజ్యాంగంతో సంబంధంలేని అంశాల గురిం చి మాట్లాడుతున్నారు. ఇది మూక భావోద్వేగాలను రెచ్చగొట్టడమే.
జి.వేణుమాధవరావు
సెల్ : 9490099023