Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల నగారా మోగిన వేళ రాజకీయ పా ర్టీలు ప్రత్యక్ష, పరోక్ష మాటల యుద్ధాలను ప్రారంభించాయి. రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యక రమైన మాటల యుద్ధం కాకుండా అసంబద్ధమైన అసభ్య పదజాలంతో కూడిన ప్రసంగాలు బాధ కలిగిస్తున్నాయి. ప్రసార మాద్యమాలు వారి టీఆర్పీ రేటింగులు పెంచుకునేందుకు వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయడం, పదేపదే అవే పంచ్లను చూపి ంచడం, రాజకీయ నాయకుల అప్రజాస్వామి కమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రసారం చేయడం, రాజకీయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేస్తోంది. రాజకీయాలలో పదవులు రావాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ వాటి కోసం పార్టీలు పోటీపడే ప్రయత్నంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, వారిని కుల, మత, వర్గ, ప్రాంతీయ ప్రాతిపదిన విడగొట్టి తమ పబ్బం గడుపుకోవడం, ఒకరిపై ఒకరు బురద జల్లుకొని తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు వాటిని ప్రజలపైకి విసరడం శోచనీయం. ఇప్పటికై నా ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్థి పలికి, ఎన్నో సమస్యలతో సతమ తమవుతూ, వాటి పరిష్కారం కోసం రాజకీయ నాయకులపై ఆశలు పెట్టుకుంటున్న ప్రజల బాగోగులపై, రాజకీయాలకు అతీతంగా శ్రద్ధ వహిస్తే, వారు ఆశించే పదవులను ప్రజలే స్వచ్ఛందంగా కట్టబెడతారు.
సి. కనకదుర్గ
సెల్ : 7674887456