Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గులాబీకారు దూసుకుపోతున్న తరుణంలో అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు ఎంతో ఉత్సహంగా కని పించారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఆ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మంత్రి పదవి కోసం ఆశల పల్లకీ ఎక్కారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతున్నది? అందు లో తమ పేరు ఉంటుందా? లేదా? సామాజిక సమీ కరణాలు ఎలా ఉంటాయి? తనకు వస్తుందా? రాదా? అనే సందేహాలు వెంటాడుతున్నాయి. జిల్లాకో మంత్రి పదవి వస్తుందని భావిస్తున్న కొంత మంది సీనియర్ ఎమ్మెల్యేలు పాత్రికేయులతో లాబీల్లో ఈ విషయాలను పంచుకుంటున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చందులాల్ ముందస్తు ఎన్నికల్లో ఓడి పోవడంతో వారి స్థానంలో తమకే అవకాశం వస్తుం దన్న నమ్మకాన్ని పెంచుకున్నారు. ముఖ్యంగా అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి పద విపై సీఎం కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకుం టారు. అడిగితే వచ్చే పదవి కూడా రాదని, అందుకే తమ మనసులోని మాట కూడా బయట పెట్టడం లేదు. ఒకవేళ పదవి ఆశిస్తున్నట్టు తెలిస్తే అసలుకే ఎసరు అన్న భయం పట్టుకుంది.
- గుడిగ రఘు