Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత పరిస్థితుల్లో జొన్న. సజ్జ గట్కకు గిరాకీ పెరుగుతున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మన తాత ముత్తాలు జొన్న, సజ్జ గట్క, రాగి సంకటి తిన్నారు గనుక ఎంతో ఆరోగ్యంగా ఎక్కుకాలం జీవిం చారు. శారీరక శ్రమ, ఎక్కువ దూరం నడవడం వల్ల రోగాలు వాళ్ల దరికి చేరలేదు. ఇప్పుడు కార్లు, బైక్ల వాడకం పెరగడం, నడక మానేయడం, శరీరాన్ని కష్టపెట్టకుండా కూర్చోవడంతో బీపీ, షుగర్లు వస్తున్నాయి. అప్పటి తిండి ఇప్పుడు కనుమరుగైంది గట్క తినేవారంటే గరీబోళ్లని, తినడానికి తిండి లేనోళ్లనే భావన ఏర్పడింది. దీంతో కనుమరుగైంది. పాలీష్ వేసిన బియ్యం అందుబాటులోకి రావడంతో రైస్ వైపు మళ్ళారు. రైస్ ఎక్కువ తీసుకోవడంతో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. దీంతో డాక్టర్లు డైట్ మెయింటన్ చేయాలని చెప్పడంతో వాళ్లందరూ చిరుధాన్యాలు, అంబలి, రాగి సంకటి, జొన్న, సజ్జ గట్క తినడానికి ముందుకొస్తున్నారు.పెద్ద ్దపెద్ద హోటల్లలో కూడా ఈ తిండి ఫ్యాషన్ అయింది. బాగా డబ్బులుండి రోగాల బారిన పడ్డ వారు ఈ తిండిని అమృ తంతో సమానంగా చూస్తున్నారు. మొత్తంగా జొన్న, సజ్జ గట్క తినేందుకు జనం ఇష్టపడడంతో గట్కకు గిరాకీ పెరుగుతుంది.
మోత్కూరు యాదయ్య