Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి పుట్టుక, భూమిపై జీవం ఆవిర్భావం, దాని పరిణామక్రమం అర్థమ వ్వాలన్న సైన్స్ను చదవకుండా, అర్థం చేసుకో కుండా సాధ్యం కాదు. నిరూపణ ద్వారా తెలుసుకోగల్గే శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం 'సైన్స్' అంటాం! అందుకే విధిగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థు లకు పర్యావరణంపై, పరిణామక్రమంపై జీవం ఉద్భవించడంపై అవగాహన, శాస్త్రీయ దృక్పథం కోసం సైన్స్ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. ఉండాల్సిందే కూడా. కానీ దేశంలో శాస్త్రీయ ప్రతిబంధానికి, ఆర్ ఎస్ఎస్ అనుకూల బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో శాస్త్రీయ దృక్కోణాన్ని ధ్వంసం చేయ డానికి ప్రణాళికాబద్దంగా పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. దాని లో భాగంగానే పాఠశాల విద్యలోని తెలుగు పాఠ్యపుస్తకాల్లో పురాణాలు, ఇతివాసాలు, వేదాలతో నింపి వేసింది. చరిత్రను వక్రీకరించే పనిలో నిమ గమైంది. తద్వారా పిల్లల ఆలోచన విధానంలో, శాస్త్రీయ దృక్పధంలో, అవగాహనలో హేతుబద్దత కుంటుపడుతుందనడం వాస్తవం. రేపటి విద్యార్థులు ఆధునిక యుగంలోని పోటీ ప్రపంచ దేశాల స్థాయిలో మన దేశం నుంచి నవకల్పన, నూతన ఆవిష్కరణల ద్వారా సైన్స్ను అభివృద్ధి చేయగలరా...! అనేది ఆలోచించాల్సి ఉంది. మొన్న ఈ మధ్య ఆంధ్రా యూనివర్సిటీ విసి.నాగేశ్వరావు పంజాబ్ లోని జలందర్పూర్లో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ, కౌరవు లంతా టెస్ట్ట్యూబ్ బేబిలు అనడం పూర్తి సైన్స్ కాంగ్రెస్ సమావేశాలనే అపహాస్యం చేసినట్టుగా మనం భావించాల్సి ఉంది. ఎందుకంటే ఒక ప్ర ఖ్యాత యూనివర్సిటీ అధిపతి, సైన్స్ను, టెక్నాలజినీ, శాస్త్రీయతనీ పెంపొదించాల్సిన బాధ్యతగల ఒక సైంటిస్ట్. ఉహజనితంగా, హేతువిరుద్దం గా మాట్లాడటం దుర్మార్గం. దీని ద్వారా విద్యార్థులకూ, ప్రజలకూ ఏం సంకేతం ఇస్తున్నట్టు. భూమిపై గల ప్రతి జీవి పుట్టుక, మనుగడపై శాస్త్రీ య విమర్శనాత్మక పరిశోధన, పరిశీలనలపై చర్చించి నిరూపించాల్సిన బాధ్యత గల ఒక సైన్స్ వేదిక సాక్షిగా కట్టు కథలు, విష ప్రచారాలా...? టెస్ట్ ట్యూబ్ బేబి ఏర్పడ్డ విధానమంత మానవ విజ్ఞానం. సైన్స్లో ముడిపడి ఉంది. ఆ బేబి ఏర్పడే టెక్నాలజి విధానాన్ని మనం ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. స్త్రీ జీవి నుంచి అండాలను, పురుష జీవి నుంచి శుక్రకణాలను గ్రహించి ఈ రెండింటిని రసాయన ద్రవ పదార్థంలో ఫలదీకరణం చేయాల్సి ఉంటుంది. అలా చేసిన 3 రోజులలో ఎబ్రియో ఏర్పడుతుంది. దాన్ని తిరి గి 1950 సెంటిగ్రెడ్ వద్ద శీతలి కరించాలి. తల్లి గర్భంలో ఆ ఎబ్రియోను ప్రవేశపెట్టిన తరువాత వివిధ రూపాంతరాల అనంతరం తల్లి గర్భం నుంచి బేబి బయటికి వస్తుంది. కానీ ఈ ప్రక్రియ అంతా మనకు మహాభారత కథలో జరగలేదు. కుంతి పాండవుల అగ్రజుడు ధర్మరాజుకి జన్మనిస్తున్నది. కుంతి కంటే ముందే గర్భం ధరించిన గాంధరి జన్మించకపోవడంతో ఆసూయ, కోపంతో గాంధరి గర్భాన్ని బాదుకోవడం వలన గర్భ విచ్చిత్తి జరుగుతున్నది. అప్పుడు వేదవ్యాసుడు అవిచ్ఛితి ముక్కలను 100 బాగాలుగా విడగొట్టి నెల రోజు ల వ్యవధిలో 100 కుండల నుంచి 100 బేబీలను బయటకి తీయ్యడం జరుగుతుందనేది మహాభారతంలోని కౌరవుల జన్మ కథ. ఇక్కడ సైన్స్కి, టెక్నాలజికి, శాస్త్రీయతకు సంబంధిం చిన ఒక్క చర్య జరగలేదు. టెస్ట్ ట్యూబ్ టెక్నాలజి ద్వారా తిరిగి పిండాన్ని గర్భంలో ప్రవేశ పెట్టాల్సిందే. కానీ గాంధరి కథలో అలా జరగలేదు. శుక్ర, అండ కణాల ఫలదీకరణం జరగలేదు. ఎబ్రియో ఏర్పడలేదు. శీతలీక రణ చర్య జరగలేదు. అలాంటి టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు ఏవి లేవు. అలా జరిగిందనడానికి చర్రిత ఆధారాలు లేవు? ఈ టెస్ట్ ట్యూబ్ బేబి పరిజ్ఞానం గాంధరికి ముందుగానీ తరువాత సమాజంపై గానీ లేదు. ఒక్క గాంధారికి జరుగుతుంది. ఎం దుకలా ఈ పరిజ్ఞానం ఉంటే అప్పటి స మాజంపై ఆ ప్రభావం ఉండాలి కదా! మరి లేదు ఎందుకు? ఇదంతా పు రాణాల కథ, ఆధారాలు లేని, నిరూపణ సాధ్యం కాని కథ. కథ, కథలాగే ఉంటే అభ్యంతరం లేదు కానీ అదే జ్ఞానం, విజ్ఞానమంటూ భ్రమింపచేసే ప్రభుత్వ అనుకూల మను వాద ప్రొఫెసర్లను అధిపతులుగా నియమిస్తే భారతదేశ భవిష్యత్, పిల్లల జీవితాల్లో కొత్త ఆవిష్కరణలు ఎలా చిగురి స్తాయి. శాస్త్ర జ్ఞానానికి, హేతుబద్దతకు అవరోధంగా ఉండే మతోన్మాదం ఇప్పుడు అధికారంలో వుంది. మానవ వ్యవహారాల్లో నిశ్చితత్వాన్ని పెంపొ ందించేందుకు భవిష్య త్ గురించి విశ్వసనీయ ఆధారాలతో ఖచ్చితమైన అంచనాకు రావడానికి శాస్త్ర విజ్ఞానం అవసరం. కానీ ఆ శాస్త్రీ విజ్ఞానం స్వేచ్చగా తనకు తాను గా లేదు. రాజకీయాల్లో చిక్కుకొని బందిగా ఉంది. అందుకే రాజకీయ వికృత క్రీడలకు సైన్స్ జ్ఞానానికి పరస్పరం ఘర్షణ జరుగుతూనే ఉన్నది. సరిగ్గా యేడాది క్రితం మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ డార్విన్ సిద్దాంతాన్ని పాఠ్య పుస్తకాల్లో నుం చి తొలగించాలని చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చ కూడా జరిగింది. ఆ తరు వాత శాస్త్రవేత్తలు కూడా స్పందించి 'డార్విన్ సిద్దాంతాలకు ఉన్న శాస్త్రీ యత, మానవ పరిణామ క్రమం ఇప్పుడున్న ఏ ఒక్క దానికీ లేదు. ఉంటే నిరూపించండి' అంటూ ఘాటుగా స్పందించారు. మరోవైపు దేశ ప్రధాని ఏకంగా వినాయకుని మేడ ప్లాస్టిక్ సర్జరి అంటాడు. పుష్పక విమానం ఉంది అంటాడు. సీఎస్ ఐఆర్ సైంటిస్టులు కూడా దాన్ని సమర్థి స్తారు. చంద్రుడికి రెండోవైపు గ్రహాలను పంపి పరిశోధన చేస్తున్న రష్యా, అమెరి కా, చైనాలతో ఈ పుక్కిట పురాణాలు హేతువులేని కట్టు కథలతో దేశ ప్రగతిని ఎలా సాధిం చగలం. అశాస్త్రీయతకు, మూఢనమ్మకాలకు అసలు స్థానం లేని వేదిక నుంచి రాజకీయాలకు లోబడి, స్వప్రయోజ నాలకు ఆశపడి, చదువుకున్న విజ్ఞానాన్ని మరచి, విష ప్రచారాలు చేస్తుంటే ప్రజ లు, విద్యార్థులు ఏం ఆలోచించాలి. ఏం అర్థం చేసుకోవాలి.
- గడ్డం శ్యామ్
సెల్ : 9908415381