Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగనాయకమ్మ
- 2 -
విషాదం చూపే కంటితో రెం డు కన్నీటి చు క్కలుకూడా కార్చాలన్నాడు. సావిత్రి అలా చెయ్యగలనని అంగీకరించి, అలాగే చేసినట్టు ఆ ఘట్టం నడిపారు. నిజం సావిత్రి, గ్లిజరిన్ లేకుండానే విషాద ఘట్టాల్లో కన్నీళ్లు కార్చగలిగేది - అని వెనకటి పుస్తకాల్లో చదివాం. సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా కొన్ని విషాద ఘట్టాల్లో కన్నీళ్లు కారేంతగా బాధపడతారు. వాళ్లేమన్నా గ్లిజరిన్ పెట్టుకుంటేనే అలా అవుతారా? విషాదం కలిగితే, రెండు కళ్లూ ఒకే రకంగా చెమర్చడంలో వింతేమీ వుండదు. నటించే సందర్భం అంత విషాదం అయితే, సావిత్రికి కళ్లు చెమర్చేవేమో! ఆమె, బిచ్చగాళ్లని చూసి దయ చూపే మనసుగల మనిషే కదా? విషా దంతో ఆమెకి గ్లిజరిన్ లేకుండానే కళ్లు చెమర్చి వుండవచ్చు. కానీ, సావిత్రి, ఒక్క కంటితో నవ్వి, ఒక్క కంటితో ఏడ్వ గలదు - అని చూపించ డమా? ఒక్క కంటితో రెం డు చుక్కలు కార్చడం, ప్రకృతి సహజత్వానికే విరుద్ధం అ వుతుంది గానీ, అది ఆ నటి నేర్పరితనం అవదు. అ సలు ఒక్క కంటితో ఏడ్వడం జరగదు. ఇటువంటి క ల్పనలతో చిత్రణ సాగిస్తే అది, నిజ జీవిత చిత్ర ణ అ వుతుందా? ఇలాగైతే, ప్రతీ ఒక్కరి జీవితా న్నీ రకర కాల కల్పనలతో చూపించవచ్చు. ఈ 'మహానటి' విష యంలో జరిగింది, ఎక్కువ కల్ప నలతో నిండినట్టే కనపడుతుంది.
సావిత్రికి మద్రాసులో, గణేషన్తో పరిచయం క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. అతను, సావి త్రిని తన వెంట తిప్పుకుంటూ, గుర్రపు స్వారీ, కారు డ్రైవింగూ, బ్యాట్ ఆటా - వంటి సిటీ టెక్నిక్కులు నేర్పడం ప్రారంభించాడు. అతడు చాలా ఉత్తముడనీ, ఆమె క్షేమం కోసమే ఆమెకి అవన్నీ నేర్పుతున్నాడనీ, అతణ్ణి గురించి ప్రేక్షకులు అనుకునేవిధంగానే అతని పాత్ర చిత్రణ వుంటుంది. ఆ మద్రాసు ప్రపంచంలో, సావిత్రికి, ఆ గణేషన్ సహాయకారిగా, సన్నిహితుడిగా, అయ్యాడు. అతడి ప్ర వర్తన సా విత్రిని బాగా ఆకర్షించింది. అతని వీపు మీదకి చిన్న పిల్ల లాగ ఎక్కి ఆనందించే స్తాయికి కూడా ఆమె ఆకర్షణ పెరిగిపోయింది.అంత దశ వరకూ చేరిన తర్వాత, గణేషన్ సావిత్రిని సముద్ర తీరంలో కూర్చో బెట్టి, కొన్ని వాస్తవ విషయాలు సుతారంగా చెప్పా డు.అప్పటికి సావిత్రి 'దేవదాసు' సినిమాలో, పార్వతి గా నటిస్తూవుంది. పార్వతీ దేవదాసుల ప్రేమ గురించి వీళ్ల మధ్య మాటలు జరిగాయి మొదట. ''దేవదాసు ఒక పెళ్లి జరిగినవాడైనా, అతణ్ణి పార్వతి కూడా పెళ్లి చేసుకుంటుంది. ఆమెకి ప్రేమ కదా?'' అంటుం ది సావిత్రి. అప్పుడు గణేషన్ నిర్భయంగా మొదలు పెట్టాడు. ''సావిత్రీ! నేను పెళ్లి అయినవాడినే. కాలేజీలో చదివే రోజుల్లో, డబ్బు అవసరం కోసం, మా మేనమామ కూతుర్నే, అలివేలు మెడలో తాళి కట్టా ను. ఆ తర్వాత పుష్పవల్లితో కూడా సంబంధం జరిగింది. కానీ అవేవీ ప్రేమలు కావు. నిజం ప్రేమ నీ తోనే సావిత్రీ!'' అంటూ నిధానంగా చెప్పుకొచ్చాడు. సావిత్రి నిర్ఘాంతపోతూ చూసింది. అప్పటికి మౌనం వహిం చింది. ఆ తర్వాత అతనితో దూ రంగా వుండటం మొదలుపెట్టింది. అతను పల కరించబోతే తిరస్క రించేది.కానీ, ఒకసారి గణేషన్ మీద స్టుడియోలో ఏదో విరిగిపడి అతనికి యాక్సిడెంట్ జరగబోతూ తప్పింది. అక్కడే వున్న సావిత్రి, అతని దగ్గిరికి పరిగెత్తి చూసి, త ర్వాత తప్పుకుంది. కానీ, ఆ తప్పుకోడం ఎన్నాళ్లో సాగలేదు. అతనే వెంటపడి 'ప్రేమ భాషణ' సాగించాడు. ''నా ప్రేమ, నీ మీదే. నాకు ప్రేమే గానీ 'పెళ్లి' నచ్చదు. 'పెళ్లి'ని ఆటవిక కాలంలో మొదలు పెట్టారు. మనుషులు ఒకరికి ఒకరు వుంటే, పెళ్లెందుకు?'' లాంటి మాటలు మాట్లా డాడు. ''నేను లేకుండా నువ్వు వుండగలవా?'' అన్నాడు. 'ఉండలేను' అన్నట్టే చూసింది. ఆ పక్కనే ఏదో గుడి వుంటే, అక్కడ 'పసుపు కొమ్ము'తో కట్టి వున్న తాళ్లు వున్నాయి. మొగ వాడు, ఆడదాని మెడలో ఆ తాడు కడితే, అది 'పెళ్లే!' అది దంపతుల సంబంధమే!
ఆ పసుపుకొమ్ము తాడు సావిత్రికి కట్టాడు. ఆ తాడుని సావిత్రి, జాకెట్టు లోపలికి దాచు కుంది. సా విత్రికి తెలుసు, అతనికి ఇంకో ఇద్దరు స్త్రీలతో సంబంధాలు వున్నాయి - అని. అయి తే యేం? అవి, 'ప్రేమలు కావని' అతను చెప్పా డు కదా? వాళ్లతో వుండేది ప్రేమ లేని శారీరక సంబంధాలే, అంతే! అతని ప్రేమ అంతా తనదే కదా? - ఆ తాడు కట్టించుకున్న క్షణం నించీ అతడితో సావిత్రికి ఆనంద విహారం! 'ఈ క్షణాలు ఎవరివీ కావు, నావే!' అని గాఢ నమ్మ కం! ఈ గణేషన్, సావిత్రికి 'అద్భుత ఉత్తమ భర్త' అయి నట్టే, సినిమా అంతా నడుస్తుంది. అతనిలో 'క పటత్వం' ఏదీ ఎక్కడా కనపడదు. అసలు సినిమా మొదట్లో సావిత్రి జబ్బుతో స్పృహ తప్పి పడి వున్న ప్పుడు, ఆ భర్త, తను ఎంత నిర్దోషినో అని ఘంటా పథంగా చెప్పుకున్నాడు. 'నన్ను అం దరూ అనుమా నిస్తున్నారు. నా భార్యకి ఎంత వై ద్యమో చేయించా ను' అనే రకం మాటలు గర్వా తిరేకంగా చెప్పుకు న్నాడు. ఆ విషయం జరిగిన తర్వాత, దాని మీద సిని మాలో వ్యాఖ్యానాలేవీ చూపించలేదు. సినిమాలో, అతడు ఉత్తమ భర్తే. ''భర్త, అంత ఉత్తముడైతే, అ తనితో విడి పోవడానికి సావిత్రి ఏం కారణం చెప్పు కుని వుం టుంది?'' అని ఒకటే సందేహం పట్టుకుంది నన్ను, వాళ్ల ఆనంద విహారాలు చూసిన క్షణం నిం చీ. అయితే, సావిత్రి తన పెళ్లి కబురు ఇంటి వాళ్లకి ఆ తాడు కట్టించుకున్ననాడే చెప్పలేదు. సినిమాలో వున్న ప్రకారం అయితే, రెండు మూ డేళ్లు గడిచాకే ఆ రహస్యం ఇంటి వాళ్లకి తెలిసింది. ఎలాగంటే, సావిత్రికి ఆ రహస్య భర్త పంపిన ఉత్తరం ఒకటి పెదనాన్న చేతుల్లో పడడం వల్ల. అందులో గణేషన్ ఏం రాశా డంటే, 'సావిత్రీ! నేను మీ ఇంటి ముందుకు వచ్చి రెండు సార్లు హారన్ కొడతాను. నువ్వు బైటికి రా' అని వుంది.అంటే, తమ కూతురు ఎవడి తోనో తప్పుడు తిరుగుళ్లు తిరుగుతోందని ఇంట్లో వాళ్లు అనుకున్నారు. తల్లి కూతుర్ని లెంప మీద కొట్టింది. పెద నాన్న తెగ అరిచాడు.అప్పుడు సావిత్రి, జాకెట్టు లోపల దాచి వుంచిన పసుపుకొమ్ము తాడుని తీసి చూపించింది. తాము భార్యాభర్తలమే- అని ప్రకటించింది.
పెదనాన్న అగ్నిహోత్రం అయిపోయాడు. ''పెళ్లాం వున్నవాణ్ణి పెళ్లి చేసుకుంటావా?'' అని తుపాకీ తీశాడు. ''దీన్ని కొత్తగా కొన్నాను. దీనితో అవసరం అప్పుడే వస్తుందనుకోలేదు. వాణ్ణి పేల్చేస్తాను'' అన్నాడు. సావిత్రిని అక్కడే ఒక గదిలోకి తోసేసి, తలుపు లు మూసేశాడు. గదిలో పడ్డ సావిత్రి కాసేపు తలుపులు బాదుతూ ఏడ్చి, తర్వాత గదిలోవున్న కిటికిలో నించి బాల్క నీలోకి దిగి, అక్కడి నించి కిందకి దూకి, భోరున కురుస్తూ వున్న వర్షంలో తడుస్తూ, భర్తగారి ఇంటికి పరిగెత్తింది. సావిత్రి నిజ జీవితంలో ఇలాగే జరిగిందా - అనే సందేహం అక్కరలేదు. ఇదంతా సినిమా కల్పన. పెదనాన్న కోపాన్ని చూపించే కల్పన. సావిత్రి ఏడుస్తూ, భర్తగారి గుమ్మం ముందు నిలబడితే, అదే భర్తగారి మొదటి భార్యే తలుపులు తీసి, ఈ మెని ఆదరంగా చూసింది. అంతలో, ఆ భర్త కూడా లోపల్నించి అక్కడికి వచ్చాడు. ఆ మొదటి భా ర్యకి, భర్తగారి కొత్త ప్రేమ సంగతి మొదటి నించీ తెలి సిం దే అనుకోవచ్చు. ఎందుకంటే, ఆ మొదటి భార్య, ఈ ఏడ్చే భార్యని లోపలికి రమ్మని పిల్చి, ''ఇప్పుడేడ్చేం లా భం?'' అంటుంది. అంటే, ఆ మెకి తెలిసి వున్నట్టే. ఏ డ్చే భార్యకి, ఆమె టీ కూడా ఇస్తుంది, ''టీ తాగి, మొ హం కడుక్కో'' అంది కూడా. ఆ భర్త, ఏడ్చే భార్య పక్క న కూర్చుని, ''నేనే వచ్చి మీ వాళ్లతో చెప్పాలనుకు న్నాను. నా అవసరం తీరింది. ఇంత అందగత్తెని ఎ వరో ఎత్తుకుపోతే మీ వాళ్లకి కోపం రాదా మరి?'' అ న్నాడు. ఆ మాటలు మొదటి భార్య వింటూనే వుం టుందని అతడికి తెలుసు. ఆవిడ ముందు ఇంకో ఆడదాన్ని 'అందగత్తె' అని పొగడడం! అంత ఉత్తముడు ఆ పురుషుడు! తర్వాత చెప్పుకోవలిసిన విష యం, ఆ పురుషుడు, నడి రోడ్డులో ఒక వాహనం టాపు మీద ఎక్కి, ''సోదర సోదరీ మణులారా! అందరూ వినండి! నేను జెమినీ గణేషన్ని. అదుగో, ఆ అందగత్తెని చూడండి! ఆమె సావిత్రి. ఆమెని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఆమె సావిత్రీ గణేషన్'' అంటూ అరుపులతో ప్రకటించాడు.
తర్వాత, చక్రపాణి అనే సినిమా పెద్ద మనిషి, ఆ దంపతుల్ని వెంటబెట్టుకుని, సావిత్రి పెదనాన్న దగ్గిరికి తెచ్చాడు, అతణ్ణి శాంతపరచాలని. పెదనాన్న, ''భార్యాబిడ్డలు వున్నవాణ్ణి పెళ్లి చేసుకుంటుందా?'' అన్నాడు. అప్పుడు చక్రపాణి పాత్రధారి, ''పెళ్లి లేకుండా రహస్య సంబంధాలతో వుండవచ్చా?'' అన్నాడు, తన గొప్ప తర్కంతో. ''అలా వుండవచ్చని నేను అంటున్నానా?'' అనలేదు పెదనాన్న. చక్రపాణిగారి గొప్ప తర్కానికి నోరు మూసేసినట్టు మౌనం వహించాడు పెదనాన్న. అయినా, సావిత్రిని వదిలేసి, పెద నాన్నా వాళ్లు తమ వూరు వెళ్లిపోయారు. సావిత్రికి సినిమాల ఛాన్సులు పెరిగిపోతున్నాయి. ఆదాయం పెరిగిపోతోంది. ఆమె చేసే దాన ధర్మాలు కూడా పెరిగిపోతున్నాయి. గణేషన్ కూడా సినిమా హీరో అవుతున్నాడు. ఇద్దరూ ఒకే సినిమాలో వేసే సందర్భాలు కూడా వస్తున్నాయి. సావిత్రికి కూతురూ కొడుకూ కలిగారు. ఆ తల్లీ పిల్లల సంబంధాల గురించి, సినిమా లో ఎక్కడా తగిన దశ్యాలు లేవు.
(తరువాయి భాగం గురువారం సంచికలో)