Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది రాజకీయాలు ఏం మాట్లాడకపోయినా వార్తల్లో ఉంటారు. మరికొంత మంది ఏం మాట్లాడినా వార్తే అవుతుంది. మరికొంత మంది వార్తల్లో ఉండేందుకే మాట్లాడుతారు. ఇంకొంతమంది నేతలు మాత్రం ఏదో సమస్యపై మాట్లాడాలనే ఉత్సుకతతో రోజూ మాట్లాడేస్తుంటారు. వీరిని ఆస్థాన రాజకీయ నాయకులు, పేపర్ పులులు అంటూ వీరికో పేజీ ఉంటుంది. తెలుగురాష్ట్రాల్లో ఇటువంటి బాపతు రాజకీయ నాయకులు చాలామంది కనిపిస్తుంటారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున సంగారెడ్డి నుంచి గెలిచిన జగ్గారెడ్డికి మాస్ లీడర్గా పేరుంది. ప్రతిపక్షంలో ఉండగానే సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాసమస్యలను ప్రస్తావించారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తున్నది. కేసీఆర్, కేటీఆర్ చాలా మంచివాళ్లే గానీ హరీశ్రావు మాత్రం సంగారెడ్డికి అన్యాయం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్కు చెప్పకుండా మంజీరా నీటిని ఎస్ఆర్ఎస్పీ తరలించి సంగారెడ్డి ప్రజల గొంతు ఎండబెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఉన్నట్టు ఉండి జగ్గన్న వైఖరిలో ఎందుకు ఈ మార్పువచ్చిందో? ఇది దేనికి సంకేతం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'బుగ'్గకారు కోసం కారుకూతలు కూస్తున్నారని హరీశ్ అనుచరులు చెప్పడం గమనార్హం....
- గుడిగ రఘు