Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి ఆధునిక కాలంలో స్త్రీ పురుష సమానత్వ భావన పై వాడివేడిగా చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన (1948)లోని ఒకటో ఆధు నికరణ ప్రకారం మానవులందరూ పుట్టకతోనే స్వేచ్ఛతోపాటు స్వాభి మానం, హక్కులు వంటి అంశాలలో సమానత్వం కలవారు. భారత రాజ్యాంగం కూడా ఎటువంటి లింగభేదం లేని సమాన స్థాయిని ఉద్ఘాటిస్తూ అందరికీ సంపూర్ణ సమానత్వాన్ని, స్వేచ్ఛనూ, న్యాయాన్ని 14, 15వ ఆధునికరణాల ద్వారా ప్రతిపాదించింది. కానీ ఎన్నో పో రాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న ఈ హక్కులు కాగితం మీద రాతలుగా మిగిలిపోయాయి. మార్చి 8న అంత ర్జా తీయంగా మహిళల కోసం గుర్తించబ డిన రోజు. ప్రగతిశీల మహిళా, కార్మిక, ప్రజా సంఘాలు పనిచేసే పరిమిత ప్రాంతాలు మినహాయిస్తే చాలా సంస్థలు మహిళా దినోత్సవాన్ని ముగ్గుల పోటీలు, వంటల పోటీలు ఆటల పోటీలు పెట్టి బహుమానాలు, బొకేలు పంచుకుంటూ దాన్నో వేడుకగా మార్చేసి పోరాట స్ఫూర్తిని తుంగలో తొక్కేస్తున్నాయి.
మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం వెనక ఉన్న చారిత్రక నేపథ్యం మనందరికీ తెలిసిందే. పారిశ్రామిక విప్లవం తరువాత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్థ అవసరాలు, ఫ్రెంచ్ విప్లవం తరువాత విస్తృతమైన స్వేచ్ఛా స్వాతంత్య్ర ఆకాంక్షలు స్త్రీలను సామాజిక రంగాలలోకి ఎంతగా నడిపించాయో అంతగా ఉమ్మడి ప్రయోజనాల కోసం సంఘటితపడేట్టు కూడా చేశాయి. చట్టపరంగా, సామాజికంగా పురుషుల తోపాటు స్త్రీలకు సమానత్వ స్థాయిని కల్పించాలన్న డిమాండ్తో స్త్రీల ఉద్యమాలు నిర్మించబడ్డాయి. మరోవైపు పరిశ్రమలలోకి కార్మికులుగా ప్రవేశించిన స్త్రీలు పని పరిస్థితులు, వేతనాల గురించి స్వీయ అనుభవాల నుండి చర్చించడం ప్రారంభించారు. స్త్రీల ఆరోగ్యం, లైంగికత, కటుంబం మొదలైన అంశాలను 19వ శతాబ్దం చర్చకు పెట్టింది. ఈ క్రమంలో సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ప్రకటనను అనుసరించి యూనైటెండ్ స్టేట్స్లో 1909 ఫిబ్రవరి 28ని జాతీయ మహిళల రోజుగా గుర్తించి క్లారాజెట్కిన్ చూపిన చొరవ వలన 1907లో స్టుట్గార్డులో అంతర్జాతీయ సోషలిస్టు మహాసభ జరిగింది. ఆ తరువాత మూడు సంవత్సరాలకు 1910లో కోపెన్హగెన్లో జరిగిన రెండవ అంతర్జాతీయ మహాసభలో అంతర్జాతీయ మహిళా దినం గురించిన ప్రతిపాదన చేసింది క్లారాజెట్కిన్. స్త్రీల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాలను గౌరవించడా నికి, స్త్రీలు సార్వత్రిక ఓటు హక్కును సాధించే విషయంలో తోడ్పడటానికి గుర్తుగా అంతర్జాతీయ మహిళా దినం ఉండాలన్నది అంతర్యం. 17 దేశాలకు చెందిన వందమంది స్త్రీలు ఉన్న ఆ రెండవ అంతర్జాతీయ సోషలిస్టు మహాసభ లో ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. విభి న్న బేధాలలో విడిపోయి ఉన్న స్త్రీ జనాభా మొత్తం ఆధునిక యుగంలో స్వేచ్ఛా సమానత్వాల కోసం, న్యాయం కోసం, శాంతి కోసం, అభివృద్ధి కోసం తమ జాతి భూగోళమంతటా చేస్తున్న పోరాట సంప్రదాయాన్ని గుర్తు చేసుకోవడానికి అందిపుచ్చుకోవడానికి ఒక ప్రతీష్టకాత్మక వ్యక్తీకరణగా ఆవిర్భవించింది అంతర్జాతీయ మహిళా దినం. కానీ నేడు దాదాపు అన్ని దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని సామ్రాజ్యవాద సంస్కృతిలో భాగంగా, ఒక వేడుకగా, ఒ క వ్యాపారంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అం తర్జాతీయ మహిళా దినోత్సవం పట్ల సరైన దృక్పథాన్ని అవ గాహనను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళా దినోత్సవాన్ని ప్రపంచ మహిళలకు అందించిన క్లారాజెట్కిన్ స్త్రీ విముక్తికి శాస్త్రీయమైన సిద్దాంతాన్ని రచించిన సిద్దాంతకర్త, పితృస్వామ్యాన్ని నిర్మూలించడానికి అహర్నిశలు పోరాడిన యోధురాలు. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా, దోపిడీ చేయబడుతున్న ప్రజలందరూ కలిసి సంఘటితమైన విప్ల వకర వర్గ పోరాటం మాత్రమే మనల్ని గమ్యానికి చేర్చగలదు తప్ప వర్గభేదాన్ని దృష్టిలోకి తీసు కోకుండా పురు షాధిక్యతకు వ్యతి రేకంగా సాగే మహిళల పోరాటం గమ్యాన్ని చేరలేదని స్పష్టపరిచారు. ఆ వెలుగులో నేటి ఆధునిక సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలన్నది నేటి యువతరం ముందున్న సవాల్. నేటి సమాజంలో మహిళలు ఉద్యోగ బాధ్యతలతోపాటు కుటుంబ బాధ్యతలను కూడా నిర్వర్తించవలసి వస్తోంది. గృహ హింసతో పాటుగా అన్ని రంగాలలోని మహిళల పట్ల పీడన, వివక్ష, లైంగిక వేధింపులు, హింస బాగా పెరిగిపోయాయి. విస్తృతమవుతున్న సాంకేతిక పరిజ్ఞానం కొత్త కొత్త సమస్యల్ని మన ముందుకు తెస్తోంది. స్త్రీని అంగడి సరుకుగా మారుస్తున్న వ్యాపార ప్రకటనలు యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. స్త్రీలు పని చేసే చోట, ప్రభుత్వ కార్యాలయాల్లో, కళాశాలల్లో స్త్రీలకు పటిష్టమైన భద్రత, రక్షణ కోసం ఎన్నో చట్టాలకు సవరణలు చేస్తున్నారు. కానీ స్త్రీల రక్షణకు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ ఆ చట్టాలు పరిమిత ప్రయోజనాన్నే కలిగిస్తున్నాయి. కారణం చిత్తశుద్ధి లేక పోవడమనేది వాస్తవం. ఏ సమాజమైన పరిడవిల్లాలంటే అక్కడ స్త్రీ జాతి అభ్యున్నతిని సాధించాలి. సమాజంలో ఒక భాగం క్షీణించిపోతుంటే, బలహీన పడుతుంటే, మరో భాగం ఎలా ఎదగగలదు? ఎలా వర్ధిల్లగలదు. ఆకాశంలో సగంగా ఉన్న మహిళ నేడు గౌరవం లోపించి, సమానత్వం లోపించి ఉంటున్న స్థితికి పరిష్కారాన్ని వెతకాలి. చట్టసభల్లో మహిళ ప్రాతినిధ్యం పెరగాలి. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు వివక్షకు చోటు ఉండదు. సమాన విద్యా, ఉద్యోగావకాశాల కల్పన లాంటి వాటితో కొంత మేరకు పరిష్కారం లభించవచ్చు. కానీ పురుష సమాజం ఆలోచన విధానం మారినప్పుడు లింగ వివక్ష పూర్తిస్థాయిలో రూపుమాస్తుంది. స్త్రీ, పురుషుల మధ్య ఉన్నది ముమ్మాటికీ సూత్ర వైరుధ్యమేనన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పుడే మహిళా దినోత్సవానికి సార్థకత చేకూరుతుంది.
- ఎ.కవిత