Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. గ్రామసీమలను అద్దంలా మెరిపించాలి అన్నవి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నుండి పదేపదే వినిపించే ప్రవచనాలు. కానీ ఆచరణ మాత్రం శూన్యమని గత గ్రామ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీల ప్రత్యక్ష అనుభవాలు చెబు తున్న సత్యాలు. గత పంచాయతీలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక సంవత్సరం, ప్రత్యేకరాష్ట్రంలో నాలుగు సంవత్సరాలు నడిచినవి. ఉమ్మడి రాష్ట్రంలో సంవత్స రకాలం తెలంగాణ రాష్ట్ర ఆందోళనలో అభివృద్ధికి నోచుకోలేదు. అనంతరం ప్రత్యేక తెలంగాణ ఏర్పడి కేసీఆర్ రాష్ట్ర పాలకుడిగా వచ్చారు. వచ్చీరావటంతోనే బంగారు తెలంగాణ నినాదం అందుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఎంతో అభివృద్ధి చేయవచ్చని, గ్రామాల్లో ఎవరికీ రాని అవకాశం తన పాలనా కాలంలో వచ్చిందని సంబరపడి పోయారు. కాని వారి ఆశలు బండికిముందుకట్టిన పచ్చగడ్డికుచ్చులు దొరుకుతాయనే ఆశతో ఉరికి న గుర్రం సామెతలా మారినవి. సమగ్రకుటుంబ సర్వేతో ప్రారంభించిన కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థల్లో కూడా ప్రణాళికలమీద ప్రణాళికలు త ప్ప ఒరిగింది శూన్యమని తేలిపోయింది. రాష్ట్రం విడిపోయి మిగులు ని ధులు కలిగిన రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రంలో స్ధానిక సంస్థలను ఉత్సవ విగ్ర హాలుగా మార్చివేశారు. గ్రామాల అభివృద్ధికి ఒక్కరూపాయి నిధులు ఇవ్వలేదు. 13, 14,వ ఆర్థికసంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామపంచాయతీల ఖాతాలలోనే వేస్తుంది కదా ఇంకా రాష్ట్రం ఏం ఇస్తుం దన్న వాదనలు వినపడినవి. 13, 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలలో గతంలో పేరుకుపోయిన విద్యుత్ బాకీలు, గ్రామీణ మంచినీటి బిల్లులు మరియు ప్రస్తుత మెయింటినెన్స్కే 40 శాతానికి పైగా ఖర్చైపోయినవి. అనేక గ్రామపంచాయతీల బకాయిలు చెల్లించక రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో విద్యుత్ నిలిపివేసి అంధకారంలో ఉంచింది. మంచినీటి సరఫరా నిలిపి వేసింది. కొన్ని గ్రామాల్లో బోర్లు, బావుల ద్వా రా నడుస్తున్న మంచినీటి స్కీంలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసిన దుర్మార్గాన్ని సర్పంచ్లు ఎదుర్కొన్నారు. చేసేదిలేక విద్యుత్ బాకీలకు, మంచినీటి సరఫరా మెయింటినెన్స్కు గ్రామపంచాయతీలే నిధులు ఇచ్చినవి. అలా ప్రతిసారి ఆర్థిక సంఘం నిధుల నుండి వచ్చిన నిధులలో 40, 30శాతం నిధులను లాగేసుకున్నది. సర్పంచ్లు ఎదురు తిరుగుతారని ముందుగానే చెక్ పవర్కు గ్రామపంచాయతీ కార్యదర్శికాక అదనంగా ఈఓఆర్డీలను నియమించింది. విద్యుత్, నీటి మెయింటెనెన్స్ బిల్లులకు చెక్కు రాసిన గ్రామపంచాయతీలకే అబివృద్ధి, గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాల చెక్కులపై సంతకాలు చేసేవిధంగా నిర్బంధం పెట్టింది. పైగా గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయలు రానున్నట్టు పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలను గుమ్మరించింది. కాని ఏరోజూ ఒక్కరూపాయి విడుదల చేయలేదు. ముందుగా మన ఊరు-మన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించింది. సర్పంచ్లు, గ్రామకమిటీలు గ్రామాలకు మొదటివిడతగా ఏమి అవసరమో నివేదికలు తయారు చేసి ఇచ్చినవి. అనంతరం మన మండలం- మనప్రణాళికలు కోరింది. వాటిని తయారు చేసి ఇచ్చారు. ఇచ్చిన నివేదికల్లో మొదటి ప్రాధాన్యతగా మూడు పనులను ఆమోదించి ఇవ్వాలని అధికారులు కోరగా వాటిని సర్పంచ్లు అందజేసారు. కానీ ఏ ఒక్కటి ఆచరణకు నోచుకోలేదు. తదనంతర కాలంలో గ్రామజ్యోతి ప్రణాళికలకు ఆదేశించింది. ఆ ప్రణాళికలో మొత్తం 7 ఉపకమిటీలు వేశారు. వాటి అమలుకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఊరించింది తప్ప పైసా విధిలించలేదు. ఇలా నాలుగేండ్ల టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో స్థానిక సంస్థలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైనవి. ఉన్న నిధులను కూడా గ్రామపంచాయతీల అవసరాలకనుగుణంగా వినియోగించుకోకుండా నెలల తరబడి ఎకౌంట్స్పై ప్రీజింగ్ పెట్టి ఆ నిధులను వేరే అవసరాలకు వాడినట్టు కూడా విమర్శలు ఉన్నవి. గ్రామపంచాయతీ సర్పంచ్ల గౌరవవేతనాలు నెలకు 5వేలు ఇస్తానని ప్రకటించి 18నెలలకు ఇచ్చి మరో18 నెలలకు ఎగ్గొట్టింది. అవి వస్తాయన్న ఆశను కూడా మాజీ సర్పంచ్లు వదులుకున్నారు. తిరిగి అధికారం చేపట్టిన కేసీఆర్ కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపొందించారు. రాబోయే ఐదేండ్లకాలంలో స్థానిక సంస్థలకు వివిధ రూపాలలో నిధులే నిధులని వాటితో గ్రామపంచాయతీలు అద్దంలా మెరిసేలా చేస్తామని ఓట్అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ మరోసారి ప్రవచించారు. అంతటితో ఊరుకోక పనిచేయని సర్పంచ్, కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు కూడా వేస్తామని హెచ్చరించారు. కాని ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. మిగులు రాష్ట్రమని జబ్బలు చరుచుకున్న గత ప్రభుత్వ కాలంలోనే స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం అప్పుల రాష్ట్రంలో ఏమిస్తుందో అనే అనుమానం గ్రామసర్పంచ్ల మదిలో మెదులుతోంది. అంతేగాక ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన 15వ ఆర్థిక సంఘం నిపుణుల బృందంతో స్థానిక సంస్థలకు నిధులు పెంచాలని కోరారు. అంతవరకు సంతోషం. కాని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వారీగా గ్రామపంచాయతీలలో అభివృద్ధికి ఇన్ని కోట్లు మొదటి విడతగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించలేదు. కొత్తగా రాష్ట్ర పంచాయతీల బాధ్యత చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్రావు ఇటీవలే అధికారులతో సమావేశమయ్యారు. వారి ప్రణాళిక ఏమిటో, ఆర్థిక వనరులేమిటో ఇంకా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అర్థం కాలేదు. ఇక ఎంపీటీసీ పరిస్థితి అగమ్యగోచరం. ఈ విధంగా స్థానిక సంస్థల్లో ఏ స్థాయిలో కూడా గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. సుమారు రెండులక్షల కోట్లకుపైగా అప్పుతో ఉన్న రాష్ట్రం ఇంకా అప్పుచేయటం తప్పుకాదు, నేరం కాదనీ నిబంధనలకు లోబడి అప్పు చేయవచ్చని రాష్ట్ర ప్రజలకు హితబోధ చేస్తుంది. అప్పుచేసైనా స్థానిక సంస్థల అబివృద్ధికి పాటుపడతారా లేదా అన్నది ఆచరణలో చూడాల్సిందే.
- పారుపల్లి కృష్ణారావు
సెల్ : 9963657377