Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. మన దేశ ఆర్థికాభివద్ధిలో వ్యవసాయం ప్రధాన పాత్ర వహిస్తోంది. అసలు ప్రపంచ వ్యాప్తంగా పూర్వం వ్యవసాయం ప్రకతి పద్ధతులతో మొదలైంది. తర్వాతి కాలంలో అనేక కొత్త విధానాలు, కొత్త పంటల రకాలు, వాటిలో అధిక దిగుబడినిచ్చే సంకరాలు సాగులోకి వచ్చాయి. పంటలకు వచ్చే తెగుళ్ల నివారణకు వివిధ రసాయనాల వాడకం మొదలైంది. దానితో ఆగిపోకుండా అధిక దిగుబడి ఆశతో అశాస్త్రీయమైన సేద్య విధానాలను అవలంబిస్తూ రైతులు వాటికి వచ్చే చీడపీడల నివారణకు ఎరువులను అధిక మోతాదులో వాడడంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం పొంచి వుంది. ఈ రోజు ఏ ఆహార పదార్థం తీసుకోవాలన్నా వంద సార్లు ఆలోచించి వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్దేశంలో 2016-17వ సంవత్సరానికి గాను నాలుగు కోట్ల టన్నుల రసాయన ఎరువులు ఉత్పత్తి అయ్యాయంటే వీటి వినియోగం ఏ స్థాయిలో వుందో మనం ఊహించుకోవచ్చు. ఇవి సరిపోవనట్టు, 88 శాతం మేరకు డై అమ్మోనియా ఫాస్ఫేట్ ( డీఏపీ)ను కెనడా, రష్యా, అమెరికా, జోర్డాన్, మొరాకో వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. పంటలకు మోతాదును మించి ఎరువులను వాడడంతో వాటి రసాయనిక అవశేషాలు, ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇలా ఒకటేమిటి అనేక రూపాల్లో మనం రసాయనాలనే తింటున్నామని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీనితో రకరకాల భయంకర, దీర్ఘకాలిక, వైద్య విజ్ఞ్ఞానానికే అంతుచిక్కని ఎన్నో రోగాలు మానవాళిని ఆవహిస్తు న్నాయి. సాధారణంగా పంటలకు 4:2:1 నిష్పత్తిలో నత్రజని, భాస్వరం, పొటాషియం పోషకాలను అందించాల్సి ఉండగా అత్యధిక దిగుబడి ఆశతో స్వల్పకాలిక ప్రయోజనాలను దష్టిలో వుంచుకొని వాటిని దేశవ్యాప్తంగా 8:2:9 నిష్పత్తిలో వాడుతున్నారంటే రసాయన కాలుష్యం జీవ జాతి మనుగడను ఎంతగా కబళిస్తుందో అర్థం చేసుకోవచ్చు. రైతులలో ఈ అంశంపై అవగాహనా రాహిత్యం, నిరక్షరాస్యత, ఎరువుల వినియోగాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం, రైతులకు సరైన మార్గదర్శనం చేసే విధానాలు లోపించడం, వ్యవసాయ రంగానికి సమస్యగా మారింది. పర్యావరణ హిత వ్యవసాయం, భూమిలోని స్థిరత్వాన్ని, భూమిలో ఉండాల్సిన జీవ సమతుల్యాన్ని పెంచుతుంది. కానీ ఈ రోజు వ్యవసాయంలో స్వల్పకాలిక లాభాల ఆశ పెరిగి ఎడాపెడా రసాయనాలను వుపయోగిస్తుండడంతో భూమిలో అసమతుల్యం ఏర్పడి పంటలకు పోషక లోపాలు ఏర్పడుతున్నాయి. కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలిక వూడిన చందంగా వ్యవసాయ భూములలో ఒక లోపం సవరించేందుకు రసాయనాలు వాడితే, అది పూర్తిగా పంట భూముల సారానికే నష్టం చేస్తోంది. మన దేశంలో వందకు పైగా ఎనభై వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం వున్న బయోఫెర్టిలైజర్ కంపెనీలు వున్నా ఇరవై వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరగడం ప్రభుత్వాలకు వున్న నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. తెలుగు రాష్ట్రాలలో అయితే రసాయన ఎరువుల విస్తత వినియోగంతో పంట పొలాలలో కార్బన్, జింకు లోపాలతో పంట దిగుబడి మీద దెబ్బ తీస్తోంది. ఈ ద్రావకాల వినియోగం వలన వ్యవసాయ భూములలో సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడి వ్యవసాయానికి, ఉద్యాన పంటలకు అడ్దంకిగా మారి పంట దిగుబడి రాక రైతు ఆర్థికంగా దెబ్బతింటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కండ్లు తెరిచి సేంద్రీయ ఎరువుల పట్ల, పర్యావరణ హిత వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తే తప్ప విషతుల్య రసాయనాల సంస్కతికి స్వస్తి పలికే అవకాశం వుండదు.
- సి.కనకదుర్గ
సెల్ : 7674887456