Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేముల వీరేశం గెలిపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య విజయం సాధించారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకూ ప్రత్యర్థులుగా ఉన్న వేముల వర్సెస్ చిరుమర్తీ ఇప్పుడు ఒకే గూటి పక్షులయ్యారు. ఎమ్యెల్యే అయితే పార్టీ మారిండు గానీ ఎంపీటీసీలు, సర్పంచ్లకు మాత్రం ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుంది. నిన్నగాక మొన్నటి వరకు రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంతో ఉన్న ఇమేజ్తో వీరేశమే పెత్తనం చేస్తున్నారని, ఆయన పలుకుబడే సాగుతుందని నాయకులు చెబుతున్నారు. ప్రజల్లో ఓడినా పార్టీ నేతను నేనే అంటూ దూసుకుపోతున్నాడు వీరేశం. ఈ ఇద్దరి కలయిక ఎలా ఉన్నదో తెలియదు గానీ గ్రామాల్లో వీళ్లకు ఓట్లేసిన ప్రజలు మాత్రం సిగ్గుతో తలదించుకుంటున్నారు. మా పార్టీ, మా ఎమ్మెల్యే అని గల్లలెగరేసిన నాయకులు గల్లీలకే పరిమితమయ్యారు. కొంత మంది రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.. పట్టించుకోవద్దంటూ తమ పని చేసుకుపోతున్నారు. అదీ నకిరేకల్ రాజకీయం.
- మోత్కూరు యాదయ్య