Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారులు నిత్యం పలు రకాల వ్యాపారుల చేతుల్లో మోసాలకు గురవు తున్నారు. క్రయ విక్రయాలు జరిపే వ్యాపారులు తమ లాభార్జనే ధ్వేయంగా తమ సరుకు లను అమ్ముకుంటున్న సంగతి సకలజనులకూ తెలిసిందే. అయితే ఇందులో తూనికల, కొలతల తతంగం ఒకటి. వ్యాపారులు ఎక్కువమంది తక్కువ తూకం రాళ్లతో తప్పుడు సెటింగ్లతో ఈ దందా కొనసాగిస్తున్నారు. అంతా వినియోగదారుల కండ్లెదుటే జరుగుతున్నా గుర్తించలేక మోస పోవడం వినియోగదారుల వంతే అవుతున్నది. ఈ క్రమ తూకాల నియంత్రణ కోసమని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన తూనికల, కొలతల శాఖ సంస్థే. ఈ శాఖాధికారులు తమ విధుల్లో భాగంగా సక్రమంగా పర్యవేక్షిస్తూ ప్రతి వారానికో, నెలకో దాడులు నిర్వహిస్తే ఈ మోసాల దందాలకు తెరపడేది. కానీ ఈ శాఖాధికారుల్లో అధిక శాతం వ్యాపారుల నుండి నెల వారీ మామూళ్లు వసూలు చేసుకొని పడకేసే పనికే పరిమితమవుతున్నారు. ఈ శాఖలో కొత్తగా చేరిన లేదా నిజాయితీ పరులైన కొద్దిమంది అధికారులే గుడ్డిలో మెల్లగా తమ విధులకు న్యాయం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో సంబంధిత శాఖాధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పలు అక్రమాలు వెల్లడయ్యాయి. ఈ దందా ప్రతి చోటా జరుగుతందనడానికి ఇది చక్కని ఉదాహరణగా పేర్కొనవచ్చు. తూనికల కొలతల శాఖాధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో బయల్పడిన అక్రమాలను మీడియా ముందు వెల్లడి చేశారు. వ్యాపారుల తూకం రాళ్లు కిలోగ్రాంకు అరకిలో గ్రాం సరి సమానంగా తూకం ఉండటం అధికార్లను ఆశ్చర్య పరిచింది. ఒక కిలో సరుకులు కొంటే అరకిలో సరుకులు వస్తాయన్నమాట. ఇక పెట్రోలు బంకులో అయితే ఈ తరహా మోసాలకు అంతేలేదు. ఇట్లా ప్రతి రోజు వినియోగదారులు రకరకాలుగా మోసపోతూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంబంధిత అధికారులు తమ తమ పరిధుల్లోని మార్కెట్ కేంద్రాల్లో ఆకస్మిక దాడులు నిర్వహిస్తే వినియోగదారులకు న్యాయం జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనకితోడు వినియోగదారులు కూడా చైతన్యవంతులు అయితే కొంతలో కొంతైనా ఈ దందాకు తెరపడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లు, బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేసిన విధంగానే ప్రభుత్వ తూనికల కొలతల శాఖ కూడా ఈ రద్దీ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ తూకం స్టాండులను ఏర్పాటు చేసినట్లయితే ఈ దందా నియంత్రించినట్టు అవుతుంది. వ్యాపారులకు ఎలక్ట్రానిక్ తూకం స్టాండులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించాలి. పాత కాలపు త్రాసులు, స్టాండింగ్ త్రాసులు, బండరాళ్లను తూకపు రాళ్లుగా వినియోగించరాదని హెచ్చరికలు చేయాలి. హెచ్చరికలు పెడచెవిన పెట్టిన వ్యాపారులకు జరిమానా, జైలు శిక్ష లాంటి శిక్షలు విధిస్తామనే ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరమున్నది. అప్పుడే వినియోగదారులకు న్యాయం చేసినరవుతారు.
వినియోగదారులు కూడా చైతన్యవంతంగా మారి తాము వెచ్చించిన మొత్తం డబ్బులకు సరిపడా వస్తువుల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి. తాము అప్రమత్తంగా ఉన్నా వ్యాపారులు మోసాలకు పాల్పడినప్పుడు వెంటనే సంబంధిత తూనికలు, కొలతల అధికారులకు తెలియజేయాలి. మార్కెట్ స్థలాల్లో ఆయా ఏరియా అధికార్ల ఫోన్ నెంబర్లు వెల్లడి చేసే ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇలాంటి పలు మెలకువలు పాటించినప్పుడు అమ్మకందారులు కూడా తమ అక్రమాలను నిలిపేస్తారు. వినియోగదారులకు చెప్పలేనంత మేలు కలుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తూనికల కొలతల శాఖాధికారుల బృందాలు ప్రతి నిత్యం మేల్కొని పైన సూచించిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని వినియోగ దారులు ఆశిస్తున్నారు.
- నల్లెల రాజయ్య
సెల్: 9989415571