Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బేటి బచావో బేటి పడా వో'' అనే కేంద్ర ప్రభుత్వం నినాదానికి తూట్లు పొడుస్తున్నారు. అమ్మా యిలే ఇంటికి దైవాలని, బ్రూణ హత్యలు నేరమని ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు ఎంత ప్రచారం చేసినా రాష్ట్రంలో యథేచ్ఛ గా లింగ నిర్దారణ పరీక్షలు జరుగుతున్నాయి. మగ, ఆడ, సమాన నిష్పత్తిలో ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలకు తూట్లు పొడుస్తున్నారు. పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే కడుపులో ఉండగానే అబార్షన్ చేయిస్తున్నారు. తల్లి కడుపులో పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి వైద్యులు చేస్తున్న స్కానింగ్
పరీక్షలు తప్పట డుగుకు నాంది వేస్తున్నాయి. పుట్ట బోయే బిడ్డ ఆడో, మగో తెలుపడం నేరమైనప్పటికీ కొం దరు దళారులు ఈ చర్యలకు పాల్ప డుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ హాస్పిటల్స్ నమోదు స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ పరీక్షలు చేస్తునారు. లింగ నిర్దారణ, భ్రూణ హత్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా పట్టించుకున్న దాఖలా లేదు. ''ఏఏ రోజు ఏ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఏఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందరికి స్కానింగ్ టెస్టులు నిర్వహించారు'' అనే వివరాలను రోజు వారీగా నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లింగ నిర్ధారణ చేసి పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలిపిన వారి మీద రూ.10 వేల జరిమానతోపాటు, 3 సంవత్సరాలపాటు మొదటిసారి కారాగారా శిక్ష విధిస్తారు. రెండోసారి అలాగే తప్పు చేస్తే రూ.50 వేల జరిమానాతోపాటు లైసెన్సును రద్దు చేసి వైద్యుడి మెడికల్ లైసెన్సును క్యాన్సిల్ చేస్తారు. దీంతోపాటు అబార్షన్కు సహకరించిన దళారులు, మధ్యవర్తులకు జైలు శిక్ష పడుతుంది. ఈ శిక్షలు ఇప్పటికీ అమలుకానందువల్ల యథేచ్ఛగా స్కానింగ్ పరీక్షలు జరుగుతు న్నాయి. వివిధ జిల్లాల్లో లింగనిర్ధారణతోపాటు అబార్షన్లు చేయించడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ కొందరు ఏజెంట్లను నియమించుకుం టున్నాయి. గ్రామీణ ప్రాంతంలో నివసించే పేద మహిళలు, తమకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి, కొందరు బ్రోకర్లను ఆశ్రయించి 'కడుపు' తీసివేయించుకుంటున్నారు. స్కానింగ్ సెంటర్ల మీద, పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు ఆకస్మికదాడులు చేసి దొరికిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే అబార్షన్లకు 'పుల్స్టాప్' పడే అవకాశముంది. ఒక్కొక్క జిల్లాలో వంద నుండి 200 దాక స్కానింగ్ కేంద్రాలున్నాయి. హైదరా బాద్, వరంగల్, కరీంనగర్ వంటి పాత జిల్లాకేంద్రాల్లో ఇంకా అధిక సంఖ్యలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి స్కానింగ్ సెంటర్లో రోజు నమోదు అవుతున్న కేసుల వివరాలను తెలుపాలని జిల్లా వైద్య ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీచేసింది. దీని కోసం స్పెషల్గా ఒక 'యాప్'ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు స్కానింగ్ కేంద్రాల వారు వివరాలను ఎప్పటికప్పుడు పంపించాల్సి ఉంది. దీని కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతిరోజు వివరాలు పంపని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం వెయ్యిమంది మగ పిల్లలకు 935 మంది ఆడపిల్లలున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 962 మంది ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 935 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
- రావుల రాజేశం
సెల్ : 7780185074