Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత శుక్రవారం నాడు న్యూజిలాండ్లోని క్రిస్టుచర్చ్ పట్టణంలోని రెండు మసీదుల మీద జరిగిన ఉగ్రవాద దాడి ప్రపంచాన్ని ఉలిక్కిపడేట్టు చేసింది. ఆస్ట్రేలియా కు చెందిన 28ఏండ్ల బ్రెంటన్ హారిసన్ టారంట్ అనే శ్వేతజాతి ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు. పదకొండు మంది చావుబ తుకుల మధ్య ఉన్నారు. అనేక మంది గాయప డ్డారు. ఇస్లాం, ముస్లింల పట్ల పెరుగుతున్న విద్వే షం, తప్పుడు ప్రచారం ప్రపంచ వ్యాపితంగా ఉం దని ఈ ఉదంతం స్పష్టం చేస్తున్నది. న్యూజిలాడ్ జనాభా మొత్తం 50లక్షలకు అటూ ఇటూగా ఉంటే వారిలో ముస్లింలు 50వేల వరకు ఉన్నా రు. మన దేశంలో హిందువుల ఉనికికే ముప్పుగా ఇస్లాం, క్రైస్తవం తయారయ్యాయని మతోన్మా దశక్తులు ఎలా నిరంతరం ప్రచారం చేస్తున్నారో, ఈ టారంట్ అనే ఉగ్రవాది కూడా ప్రపంచంలో శ్వేత జాతికి ముస్లింలు ముప్పుగా తయారయ్యా రనే ఉన్మాదానికి లోనయ్యాడు. తనకు బ్రిటిష్ ఫాసిస్టు ఓస్వాల్డ్ మోస్లే, నార్వీజియన్ హంతకు డు ఆండ్రెస్ బ్రెవిక్ వంటి వారు స్ఫూర్తి నిచ్చారని, ప్రపంచంలో శ్వేతజాతి గుర్తింపునకు అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్ నూతన ప్రతీకగా తనకు ఉత్తేజ మిచ్చాడని మసీదులపై దాడులకు ముందు ఇం టర్నెట్లో 74పేజీల పత్రంలో పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ ఉదంతం ప్రపంచ సంక్షోభాని కి ఒక తార్కాణంగా అనేక మంది వర్ణించారు. మీ డియాలో ముస్లిం వ్యతిరేకత ఒక సాధారణ అంశ ంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ముస్లిం లందరిని ఉగ్రవాదులు అనం, అనకూడదు గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలుగానే కనిపిస్తున్నా రు కదా అనే ఒక గడుసరి ప్రచారంతో అనేక మంది నిజమే కదా అనుకునేలా సంప్రదాయ మీడియాలో, సామాజిక మీడియాలో అనేక కథ నాలను వండివారుస్తున్నారు. ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా ఖండిస్తామంటూ పుల్వామా ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ట్రంప్ క్రిస్తు చర్చ్ మసీదు ఉదంతాల విషయానికి వచ్చేసరికి శ్వేతజాతి జాతీయవాదం(దురహంకారం) నుంచి ఎలాంటి ముప్పు లేదని ప్రకటించాడు.
ఇటీవలి కాలంలో అమెరికా, ఐరోపాలోని ప్ర భుత్వాలు ముస్లిం వ్యతిరేక చర్యలనేకం తీసు కున్నాయి. ముస్లిం దేశాల నుంచి వలసలపై ఆంక్షలు విధించాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాలలో షరియా వ్యతిరేక చట్టాలు చేశా రు. ఇటీవలి కాలంలో ఈ దేశాలన్నింటా ము స్లిం వలసలను అనుమతిస్తే శ్వేతజాతీయులు మైనారిటీలుగా మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరిగింది. మొత్తం ముస్లిం మ తావలంబకులు ప్రస్తుతం ప్రపంచవ్యాపి తంగా వున్నది కేవలం 24శాతం మందే. వా రంతా వలస వచ్చినా ఎక్కడా మెజారిటీగా మారే అవకాశమే లేదు. కానీ అనేక మంది ఈ ప్రచారాన్ని తలకెక్కించుకొని ఉన్మాదులుగా మారి అనేక చోట్ల హత్యలకు సైతం పాల్పడుతున్నారు. మీడియాలో ఉగ్రవాదం ఎలా ఉందో చూద్దాం. యాభై మందిని చంపిన క్రీస్తు చర్చి హంతకుడిని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక గన్ మన్(తుపాకితో వున్న వ్యక్తి) అని శీర్షికలో పెడితే అదే పత్రిక కాశ్మీర్లో ఒక మహిళా పోలీసు అధికారిని చంపిన వాడిని టెర్రరిస్టు అని శీర్షికలో పెట్టింది. అంతేకాదు ఆవులను వధిస్తున్నారనే పేరుతో దాడులు చేసే వారిని గోరక్షకులు అని లేదా ఫలానా సంఘ కార్యకర్తలని ముద్దుపేర్లతో రాయటం తప్ప వారిని హిందూ తీవ్రవాదులు అనేందుకు మీడియాకు నోరు రాదు. అదే పశ్చిమ దేశాల్లో ఒక శ్వేతజాతీయుడు హత్యాకాండకు పాల్పడితే వాడిని మతిస్థిమితం లేనివాడిగా ముద్ర వేస్తారు తప్ప జాత్యహంకార ఉన్మాది, ఉగ్రవాది అని ఎక్కడా పేర్కొనరు. వారిని ఉత్తేజపరుస్తున్న దేమిటో అసలు చర్చించరు.
ముస్లింలు, ఇస్లామ్కు సంబంధించి ప్రపంచ వ్యాపితంగా ముస్లిమేతర దేశాలలో వ్యతిరేకత పుంఖాను పుంఖాలుగా కనిపిస్తుంది. అమెరికాలో అది 80శాతం, బ్రిటన్లో 70శాతం వున్నట్లు పరిశోధనల్లో తేలింది. ముస్లింలతో అమెరికాకు ముప్పు ఏర్పడిందని ట్రంప్తో సహా అనేక మంది గతంలో రెచ్చగొట్టారు. తీవ్రవాద ముస్లిం నుంచి అమెరికన్లను రక్షించేందుకు ఏడు ముస్లిం దేశాల నుంచి జనాన్ని అమెరికాలో ప్రవేశించేందుకు వీల్లేకుండా డోనాల్డ్ ట్రంప్ సర్కార్ నిషేధం విధి ంచిన విషయం తెలిసిందే. 2008-2016 మ ధ్య అమెరికాలో 201 ఉగ్రవాద చర్యలు చోటు చే సుకుంటే వాటిలో ట్రంప్ నిషేధించిన దేశాలైన ఇ రాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, ఎమెన్లకు చెందిన వారు పాల్గొన్న లేదా ప్రేరేపి ంచిన ఉదంతాలు కేవలం మూడే. అమెరికాలో ట్రంప్ హయాంలో, అంతకు ముందూ జరిగిన హత్యాకాండను చూస్తే అత్యధిక సంఘటనల్లో నేరగాండ్లు శ్వేతజాతీయులే ఉన్నారు. వారి చేతుల్లోనే ఎక్కువ మంది మరణించారు. వారెవరికీ ముస్లిం తీవ్రవాద సంస్థలతో లేదా విదేశీయులతో సంబంధాలు లేవు. ఇస్లాం నుంచి ఉత్తేజాన్ని పొందిన వారూ కాదు.
ప్రపంచంలో కేవలం ముస్లిం తీవ్రవాద సంస్థలే ఉన్నట్టు మీడియా చిత్రిస్తున్నది. ఉగాం డాలో లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్టీ(ప్రభు ప్రతిఘటన సైన్యం) పేరిట క్రైస్తవ తీవ్రవాదులు లక్ష మందిని హత్య చేశారు. టెన్ కమాండ్మెంట్స్ ప్రాతిపది కన మతరాజ్యాన్ని ఏర్పరచాలన్నది దాని లక్ష్యం. అమెరికాలో ఆర్మీ ఆఫ్ గాడ్(దేవుని సైన్యం) పేరు తో వున్న తీవ్రవాదులు అబార్షన్లకు వ్యతిరేకంగా హింసాకాండకు పాల్పడుతున్నారు. వీరికీ ఇస్లా మిక్ దేశాలలోని ఆల్ఖైదా, తాలిబాన్లకు తేడా ఏముంది? అమెరికాలో, ఇతర ఐరోపా దేశాల్లో శ్వేతజాతీయులతో కూడిన ఉగ్రవాద బృందాలు అనేక నేరాలకు పాల్పడుతున్నాయి. కానీ ముస్లిం తీవ్రవాదులు ఒక సంఘటనకు పాల్పడినపుడు మీడియాలో 105పతాక శీర్షికలు చోటు చేసుకుంటే.. అదే ముస్లిమేతర ఉగ్రవాదులు పాల్పడిన ఘటనలకు కేవలం 15పతాక శీర్షికలే ఉంటున్నట్టు అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయం జరిపిన విశ్లేషణలో తేలింది. ప్రపంచమంతటికీ ఇస్లామిక్ తీవ్రవాదులు, తీవ్రవాదంతో ముప్పు ఏర్పడిందన్నది ఒక తప్పుడు ప్రచారం. నిజానికి ఉగ్రవాదం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ప్రపంచవ్యాపితంగా అంగీకరించిన అర్ధం ఇంతవరకు లేదు. మధ్య ప్రాచ్యంలో రోమన్లను కూలదోసేందుకు యూదులు కొందరు ఉగ్రవాదులుగా మారారు. క్రీస్తు శకం తొలి శతాబ్దిలో సికారి అనే యూదు సంస్థ ఏర్పాటయింది.దానికి ముందు జాకబ్, సైమన్ అనే యూదునేతలు దేవుడు తప్ప యూదులను మరొకరు పాలించటానికి లేదని అవసరమైతే సాయుధ ప్రతిఘటన చేయాలని ఉద్బోధించారు. సాయుధ ప్రతిఘటనతోపాటు రోమన్లతో సయోధ్య కోరుకున్న యూదులను కూడా హతమార్చాలని పిలుపునిచ్చింది. తరువాత వారు ఇతరులతో కలసి మరణించిన వారికోసం ఏడుపులు, పెడబొబ్బలు పెట్టి తప్పించుకొనే వారట. పదిహేడవ శతాబ్దిలో స్పెయిన్లో కాథలిక్ రాజ్యాన్ని స్ధాపించేందుకు గై ఫాకెస్ నాయకత్వంలో మత ఉగ్రవాదులు విఫల తిరుగుబాటు చేశారు. తరువాత ఫ్రెంచి విప్లవ సమయంలో తమ మాట వినని వారిని నిర్ధాక్షిణ్యంగా అధికారంలో ఉన్నవారే చంపి రాజ్య ఉగ్రవాదానికి తెరలేపారు. హంగరీలో ముస్లింలు ఒకశాతం మంది కూడా లేరు. అయినా సరే అక్కడి ప్రధాని విక్టర్ ఓర్బన్ హంగేరియన్ పిల్లలను కనేందుకు దేశంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వలసలను అంగీకరించటం అంటే మనం లొంగిపోవటమే అని కొద్ది రోజుల క్రితం రెచ్చగొట్టాడు. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగకపోతే లండన్ నగరం ఫ్రెంచి పెట్టుబడిదారులకు బదులు టర్కీ ముస్లింలతో నిండిపోతుందని బ్రెక్జిట్ అనుకూల వాదులు ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం కారణంగా అమెరికాలో 17శాతం మంది ముస్లింలు ఉన్నారని మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో అమెరికన్లు చెప్పారు. నిజానికి అక్కడ ఒకశాతానికి దగ్గరగా ఉన్నారు. ఫ్రాన్స్లో కూడా ఉన్నదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువున్నారనే ప్రచారానికి అక్కడి వారు లోనయ్యారు. అనేక ముస్లిం దేశాలలోని ఛాందసులు కూడా ఇలాంటి ప్రచారంతోనే అక్కడి సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. మత ఉగ్రవాదులను తయా రు చేస్తున్నారు. మతోన్మాదం తలకెక్కితే ఏ మతం వారైనా ఒకటే. మన దేశంలో ముస్లింలు, క్రైస్త వుల సంఖ్యను పెంచేందుకు పెద్ద కుట్ర జరు గుతోందని, దాన్ని వమ్ముచేసేందుకు హిందువు లు కూడా పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని చెప్పిన కాషాయ తాలిబాన్లనూ చూశాము. న్యూజిలాండ్ లో ముస్లింలను హతమార్చిన క్రైస్తవ ఉగ్రవాది ఏమన్నాడో చూడండి. ''మన భూముల నుంచి ఒ క వేళ రేపు మనం ఐరోపాయేతరులందరినీ (వారిలో భారతీయ హిందువులు కూడా ఉంటార ని మరచిపోవద్దు) బయటకు పంపివేసినా యూ రోపియన్ల సంఖ్య నశించి చివరకు అంతమౌతు ంది. చివరికి తిరిగి మనం జననశక్తిని పెంచుకో వాలి, లేకపోతే అది మనల్ని చంపివేస్తుంది''. కాషాయ తాలిబాన్లకు, ఇతని తేడా ఏముంది? ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారు. అందుకే ఉగ్రవాదం ప్రపంచ సంక్షోభానికి చిహ్నం. గతంలో మతం కోసం ఉగ్రవాదులు తయారైతే ఇప్పుడు సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలలో భాగంగా మత ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు. అదే నాటికీ నేటికీ తేడా!
- శారద
సెల్ : 8331013288