Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం పరీక్షల సమయం. విద్యార్థుల ఫీజులు ఇప్పటి వరకూ వాయిదా వేసుకొచ్చినా ఇప్పుడు మాత్రం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇది పరీక్షల సమయం గనుక. ఫీజు మొత్తం చెల్లించకుంటే హాల్టికెట్ ఇవ్వని పరిస్థితి ప్రయివేటు పాఠశాలల్లో ఉంటుంది. ఈ తల్లిదండ్రులు ఫీజు కట్టడానికి తప్ప మరే సందర్భంలోనూ స్కూల్లో కాలుపెట్టే పరిస్థితి ఉండదు. నానా తిప్పలు పడి, అప్పులు చేసైనా ఫీజుల కట్టే ఆందోళనలో తల్లిదండ్రులున్నారు. కానీ ఈ తల్లిదండ్రుల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులను చదివిస్తున్న తల్లిదండ్రులు మాత్రం ఆడుతూ, పాడుతూ ఆహ్లాద వాతావరణం గడుపుతున్నారు. ఎస్డబ్ల్యుఆర్ఇఐఎస్ కార్యదర్శి డా|| ఆర్ఎస్. ప్రవీణ్కుమార్ 'అమ్మానాన్నల హల్చల్' పేరుతో తల్లిదండ్రులను ఎంటర్టైన్మెంట్తోపాటు జ్ఞానవంతులుగా తయారు చేస్తున్నారు. రబ్బీక్యూబ్స్, అబాకస్, క్యారమ్, చెస్క్రీడల్లో ఐదు రోజులపాటు పాల్గొని విజేతలుగా నిచిచారు. భారత్దర్శనం పేరుతో నాగ్పూర్లోని దీక్ష భూమి, ఉత్తరప్రదేశ్లోని ప్రవర్తన స్థలం, ఆగ్రాలోని తాజ్మహల్తో పాటు ఢిల్లీలో పార్లమెంటును చూపించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలో గురుకుల విద్యార్థుల తల్లిండ్రులు ఈ పర్యటనకెళ్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో చదివించే తల్లిదండ్రుల పరిస్థితి ఆ విధంగా ఉంటే గురుకుల పాఠశాలల్లోని చదువరుల విద్యార్థుల తల్లిండ్రుల పరిస్థితి ఇందుకు భిన్నం.
- మోత్కూరు యాదయ్య