Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''స్నేహితులు లేని జీవితం నిస్సారం'' అంటారు. ''దో స్త్ మేరా దోస్త్.. తూహై మేరీ జాన్'' అం టూ పాటలు పాడుకుంటాము. అయినా ఎక్కడో, ఎప్పుడో తప్ప చక్కని చిక్కని స్నేహం అందరికీ చిక్కదు. ఎప్పటికీ వదలని, ఎంతకీ తరగని అనంతమైన నిధిలాంటి స్నేహం ఏదన్నా ఉందంటే అది పుస్తకం అన్నది అక్షర సత్యం.
రేపు ప్రపంచ పుస్తక దినోత్సవం కనుక నా ప్రియ నేస్తంపైన నాకున్న ప్రేమను వ్యక్తీకరిస్తున్నాను. తొలుదొలతగా 17వ శతాబ్దంలో యూరప్లో ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం జరిపారట. వ్లాదిమీర్, షేక్స్పియర్, సెవాంతస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత రచయితల జనన లేదా మరణాలు ఈ తారీఖున జరగ డం దీనికి కారణం అంటారు. 1995 నుండి యునెస్కో ఏప్రిల్ 23ను అధికారికంగా ప్రపంచ పుస్తక దినంగా ప్రకటించింది. పుస్తకం కాలానుగుణంగా ఎన్నో మార్పులు చేర్పులు పొందుతూ ఎలక్ట్రానిక్ బుక్లుగా, ఈ బుక్లుగా కూడా రూపాంతరం చెంది ంది. మొట్టమొదటి పుస్తకం 8వ శతాబ్దంలో చైనాలో ప్రింట్ అయ్యింది. ప్రపంచంలోనే దుబారులో మహమ్మద్ ఫ్రొఫైల్పైన వెలువరించిన పుస్తకం అతి పెద్దదిగా గుర్తించబడింది. దీని బరువు 1500 కిలోలు. కాగా కెనడాకు చెందిన పుస్తకం 2012లో ప్రపంచంలోనే చిన్న పుస్తకంగా గుర్తింపబడింది. మైక్రోస్కోపు సహాయంతో దీనిని చదివాలట. గొప్ప విషయమేమిటంటే అమెరికా వారు చేసిన సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ''పుస్తక పఠనం'' చేసేవారు మన భారతీయులే అని చెప్పారు. గర్వపడవలసిన విషయమే.
ఎవరికైనా పుస్తకానికి మించిన నేస్తం ఎవరుంటారు? సమస్యల నుండి సమాధానంలోకి నడిపిస్తుంది పుస్తకం. అమ్మలా లాలిస్తుంది, నాన్నలా ఆదరిస్తుంది. స్నేహితుడై సదా వెంట ఉంటుంది. గురు వై జ్ఞానం పెంచుతుంది. తోడునీడై నీవెవరో నీకు తెలియజే స్తుంది. మంచి పుస్తకం వందమంది గొప్ప స్నేహితులతో సమానం. అందుకే ''చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో'' అన్నారు కందుకూరి. మరణ శిక్ష ఎలా అమలు చేయాలి నీకు అని సోక్రటీస్ని అడిగితే తనకు ఇచ్చే విషాన్ని ఒక గ్రంథం ప్రతి పేజీకి పైన పూస్తే ఆ పేజీలు వేలితో తిప్పుతూ నోట్లో పెట్టుకుంటూ పుస్తకం చదువుతూ, చదువుతూ చనిపోతా అన్నారట. ఇంతకన్నా గొప్ప స్ఫూర్తి ఇక వేరే లేదు (మూర్ఖ లోకం గొప్ప తాత్వికవేత్తను పోగొట్టుకుంది) కదా!
పుస్తకం హస్త భూషణమే కాదు, మస్తకానికి మందు. కలికి తురాయి కూడా! అక్షరాలనే ఆణి ముత్యాలను తనలో పోదివి పట్టుకున్న పవిత్ర మాతృగర్భం పుస్తకం. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని అన్నారు. జ్ఞాని పంచే వెలుగులు చంద్రుని వెన్నెల వంటివి. సూర్యుని కిరణాల వంటివి. అవి ఎవరు అడ్డు పెట్టినా ఆగవు. జ్ఞానం సదా పరిమళిస్తుంది. ఈర్ష్యా ద్వేషాలకు అతీతమై ప్రభవిస్తుంది. సమాజం లో మహోన్నతమైన స్థానాన్నిస్తుం ది. ఇదికేవలం పుస్తక పఠనం వలనే సాధ్యం. రోజుకు ఆరు గంటలు పు స్తకాలు చదివే పిల్లలు, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడే పి ల్లలపై జపాన్లో మానసిక శాస్త్రవే త్తలు పరిశోధనలు చేసి ఆశ్చర్యకర మైన విషయం చెప్పారు. మెదడు లో ఉండే 'గ్రే మ్యాటర్' అనే పదా ర్థం సెల్ఫోన్ మొ|| వాటి యొక్క వి పరీతమైన వాడకంతో అరిగిపోతుం దట. దాని వలన ఐక్యూ తగ్గడమే కాక సున్నితమైన భావావేషాలు (ఎమోషన్స్) అంతరించిపోతాయట. ఊబకాయం, షుగర్ వంటివి రావడానికి ఆస్కారం ఉందట. అలా కాకుండా పుస్తకాలు చదివే పిల్లల్లో ఐక్యూ, అనలటికల్ పవర్, లీడర్షిప్ క్వాలిటీలు బాగా పెరుగుతాయని రుజువైందట.
''చెదరలేదు ప్రేమ పటము
ప్రిదుల లేదు ప్రీతిఘటము
ఎదుట ఉంతు ఎడపదలక
చదువు కొనుము చెలిమి ఒలక
చెమ్మగిల్లిన కన్నులతో
కమ్మలెన్నో చదివాను''
అంటారు ప్రజాకవి కాళోజీ. ఎన్నో భాషలు, ఎ న్నెన్నో రచనలు.. బాల మిత్ర చందమామ నుంచి మొదలుకొని చరిత్ర, రాజకీ య అర్ధశాస్త్రాల దాకా..! దేనికవే గొప్పవి!! ఒక్కో పదం ఒక్కో వజ్రాయుధం. నీరసించిన వాడికి అమృత పేయము. దారి తప్పిన వారికి దిశానిర్దేశం. విద్యార్థి కి గురు ఉపదేశం. క్రియా శీలురకు చైతన్యం, భావుకు లకు ప్రేమ సందేశం, శ్రామికులకు ఉక్కు పిడికిలి. తాత్వికులకు అనంత ఝరీ ప్రవాహం, వెరసి ''పుస్త కం''. అది ఒక ''అనంతమైన జ్ఞాన భాండాగారం''.. ఒక్కో రచన కోటి తుణీరాలసమం.
దురదృష్టం ఏమిటంటే ప్రస్తుత సమాజంలో పుస్తక పఠనం తగ్గిపోతుంది. సుమారుగా 18-20 సంవత్సరాలకు పూర్వం వరకూ అందరి ఇండ్లలో రకరకాల నవలలు- మాస, వార పత్రికలు ఉండేవి. అందరూ చదివేవారు. కాలక్షేపం పుస్తకాలే అయ్యేవి. ''టీవీ సీరియళ్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు పుస్తకాలను చంపేశాయి'' అనడంలో ఎలాంటి సందేహం లేదు. బుక్స్ కోసం అందరిండ్లలో అరలు ఉండేవి. ఇప్పుడు వాటి అవసరమే లేదు. కానీ చరిత్ర తెలుసుకోవాలంటే పుస్తకమే చదవాలి. భవిష్యత్తుకు ప్రయాణించాలన్నా పుస్తకమే చదవాలి. ఆ పుస్తకానికి ప్రాణం పోయాలంటే పిల్లలకు పుస్తకాలు అందించాలి. బహుమతులుగా ఇవ్వాలి. వారిని పాఠకులుగా చిన్నప్పట్నుంచే తయారు చేయాలి. గొప్పగొప్ప రచయితలు, చరిత్రకారులు, తత్వవేత్తల భావ పరంపర, జ్ఞానం మనకు చేరాలంటే పుస్తకమే వారధి. అందుకే పుస్తకాన్ని బతికించాలి.
''నా తెలంగాణ కోటి రతనాల వీణ'' అన్న దాశరథి వాక్యం, తిలక్ గారి అమృతం కురిసిన రాత్రిలోని అద్భుతం, ఇగెటెడ్ మైండ్స్లోని స్ఫూర్తివంతమైన అబ్దుల్ కలాం మాటలు, మా క్సిమ్గోర్కి అమ్మని చూడాలి కదా! '' నింగి లోతును సూడగో రితే నీటి సుక్కను కలుసుకో, రత్నరాసుల విలువ తెలుసుకో గోరితే రాతి ముక్కను కలుసుకో!!'' అన్న సినారే గజల్ ఎంత గొప్ప తత్వానికి ప్రేరణ కదా!! పుస్తకం ద్వారా ప్రపంచాన్ని దర్శిం చగలం. ఎన్ని పుస్తకాలు.. ఎన్నెన్ని పుస్తకాలు... జీవిత పంథానే మార్చేసినవి ఉన్నాయి. కథ, కవిత్వం, నాటకం, నవల, వ్యాసం, ఎన్నెన్నో...! ఎదుటి వారిని అర్థం చేసుకోవాలంటే కవిత్వం రా యాలంటారు. గుండెకు గాయమైతే గేయం వస్తుందంటారు. నాది - నేను అనే సంకుచితత్వం నుంచి అంతా మనదే అనే వి శాలతత్వం వైపు పుస్తకం నడిపిస్తుంది. '' నిరంతర పఠనాసకి ్తగ ల వారు మాత్రమే ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారు'' ఇది తథ్వం.
ూశీష శీట చీa్బతీవలో ఖరవ aఅస ణఱరబరవ అనేది ఒక నియమం. ఒక బల్ల లేదా ఏదైనా వస్తువును ఒక చోట కదలకుండా పెడదాం. కొన్నాళ్లకు అది తుప్పుపట్టి పోతుంది. అలాగే ఏదైనా అంతే. మానవ శరీరంలోని అవయవాలూ అంతే. య్యూజ్ అండ్ డిస్ య్యూజ్ ఫార్ములా మన మేధస్సుకు కూడా వర్తిస్తుంది. వాడకపోతే మెదడు కూడా మొద్దుబారి పోతుంది. ఆలోచ నా శక్తి క్షీణి స్తుంది. అం దుకే మన మంతా మన ప్రియనేస్తంగా పుస్తకాన్ని చేసు కుందాం. విశ్లేష ణాత్మక శక్తి, నాయక త్వ లక్షణాలు, సర్వ మానవాళి యెడల అ వగాహన, విశ్వవ్యా ప్తమైన సహృద్భావం, జ్ఞానం, ప్రేమ, సున్నిత త్వం, చైతన్యం, పుస్తకం ద్వారా లభిస్తాయి. అందుకే విజ్ఞులు, మేధావులు, భావు కులు, శాస్త్రవేత్తలు, మనో విశ్లే షకులు, తాత్వికులు ఇలా ఎంద రెందరో ఎన్నెన్నో గొప్ప గ్రంథా లను ఆవిష్కరించారు. ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా మన మంతా పుస్తకాలను ఇంటికి తెచ్చు కుందాం! పుస్తకం చదవడం అలవాటు చేసుకుందాం!!
నాడు
పుస్తకాల దొంతరల
గ్రంథాలయాలు
దైనందిన
వార, మాస పత్రికలు
జనులెల్లరి
కరదీపికలు
కవన వ్యాస శీర్షికలు
విమర్శలు
విద్యతో చర్చలు
సమీక్షల
సభాగోష్టుల
సూచికలు పుస్తకాలు
జ్ఞానానికి ఆధారాలు!!
నేడు
సెల్ఫోనులు
నోటు ప్యాడులు
ల్యాప్ట్యాబులు
బౌజింగులు, రోమింగుల
ఓ పుస్తక రాజమా..!
చెదలు పడుతున్నది
నీకే కాదు
మా మానవ జాతికి
మా మస్తిష్కానికీ...!!
- రమాదేవి కులకర్ణి
సెల్ : 8985613123