Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎ న్నికలు ముగిసాయి. పోలింగ్ ముగిసి రెండు వారాలకుపైగా గడిచింది. ఫ లితాలు రావడానికి ఇంకా ఇరవై రోజులకు పైగా సమయముంది. ఈ సమయంలో అందరూ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడు తారు? అనే అంశాలపై లెక్కలు కడుతు న్నారు. పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఇదే టెన్షన్తో ఉన్నారు. బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోయి మరీ బెట్టింగుల నిర్వహణకు సిద్ధమయ్యారు. కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించే వార ంతా ఇప్పుడు పొలిటికల్ బెట్టింగ్స్తో బిజీ అయి పోయారు. వారికున్న పరిజ్ఞానంతో తమ లెక్క లు పక్కా అనే నమ్మకంతో కోట్ల రూపాయలను కుమ్మరించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు పోటాపో టీగా ఓటింగు సాగడం వల్ల టీడీపీ, వైసీపీలు ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడటంవల్ల గెలుపు ఏ వైపు ఉందో, ఎవరిని వరిస్తుందో అ ర్థం కాని అయోమయంలో ప్రజలు, నాయకులు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం ఇరు పార్టీలు తమ సాయశక్తులా పోరాడాయి. జనసేన, వామపక్షాలు కూడా శక్తి మేరకు పోరాడా యి. ఎన్నికలు ముగిసినా ఫలితాల కోసం చాలాకాలం వేచి ఉండా ల్సి రావడంతో అందరూ ఉత్కంఠతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే బెట్టింగ్ రాయుళ్ళకు గొప్ప అవకాశంగా మారింది. ఈజీ మనీకి అలవాటు పడినవారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వరంగా మారాయి.ఇటీవల కాలంలో అమరావతి, విజయవాడ పరిసర ప్రాతాలలో ఇటువంటి బెట్టింగ్ ముఠాలను పోలీసులు పట్టుకున్నా రు. వారి దగ్గర్నుంచి మొబైల్స్ లాప్ టాప్లు, డైరీలు స్వాధీనం చే సుకున్నారు. దీనిని బట్టి చూస్తే ఆన్లైన్లోనూ, మొబైల్ ఫోన్లలో నూ కోడ్ భాషలో ఈ పందేలు జోరుగా సాగుతున్నాయని అర్థమవు తోంది. ఒకప్పుడు బెట్టింగ్ అనేది వందలు, వేలల్లో మాత్రమే సాగేది. కాని ఇప్పుడు లక్షలు, కోట్లలోనే వ్యవహారం సాగుతోంది.
ఎన్నికల ఫలితాలపైన, మెజార్టీపైన, గెలుపొందే స్థానాలపైన, బూత్లు, గ్రామాల వారీగా, తొలి ఫలితాలు ఎవరికి అనుకూలం ఇ లా ఏ ఒక్కటీ వదలకుండా పందేలు జోరందుకుంటున్నాయి. ఏకం గా పోటీలో ఉన్న అభ్యర్థులే తమ ఫలితాలపై ప్రత్యేక సర్వేలు చేయి ంచుకుని బెట్టింగ్ రంగంలోకి దిగుతున్నారంటే ఇవి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎ వరికి ఎంత మెజారిటీ వస్తుంది? ఏ జిల్లాలో ఎవరిది పైచేయి ? ప లానా నియోజకవర్గంలో గెలుపెవరిది? అక్కడ మూడో స్థానంలో నిలిచేదెవరు? ఇలా ఒకటేమిటి ప్రతి అంశమూ బెట్టింగ్కు పనికి వచ్చేదే. సీటును బట్టి రేటు మారుతోంది. కొన్ని స్థానాల్లో ఫలానా అభ్యర్థి గెలిస్తే రూ.లక్ష ఇస్తామని, ఓడితే రూ.3 లక్షలు తీసుకుం టామని డీల్ కుదుర్చుకుంటున్నారు. ఏపీలో మంగళగిరి, గుడివా డ, నగరి, గాజువాక, భీమవరం, సత్తెనపల్లి, హిందూపురం, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నర్సాపురం పార్లమెంట్ స్థానాల గెలుపోటములపై బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారన్న అం శంపై బుకీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొం తమంది వైసీపీ వస్తుందనీ మరికొంత మంది టీడీపీ గెలుస్తుందని భావిస్తున్నారు. కొందరు పంటర్లు మాత్రం ఏ పార్టీకీ మెజార్టీ రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరివైపు ఉంటారన్నదానిపై అధికారం ఆధారపడి ఉంటు ందని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా పందేలు నిర్వహిస్తున్నా రు. అమరావతి ప్రాంతంలో పందెం రాయుళ్లకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. రాజధాని రాకతో భూముల విలువ కోట్లకు పెరగ డం.. ల్యాండ్ పూలింగ్తో ఉన్నపళంగా కోటీశ్వరులుగా మారడం తో కారు రాజ్ కారు అంటున్నారు. ఇల్లు, పొలాలు, నగదు, బం గారం ఇలా ఒకటేమిటి అన్నీ కుదువపెట్టి జూదం మొదలు పెట్టే శారు. రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరు, ఉండవల్లి, పెను మాకల్లో పందేలు హద్దుల్లేకుండా సాగుతున్నాయి. ఫలితాల గడు వు దగ్గరపడిన కొద్దీ బెట్టింగ్లు మరింత జోరందుకుంటున్నాయి. నిర్వాహకులు ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. నగదు అందుబాటులో లేకుంటే ఆస్తి పత్రాలను కూడా ష్యూరిటీగా ఉం చవచ్చంటూ పందెం రాయుళ్లను ముగ్గులోకి దించుతున్నారు. ఇరుపక్షాల నుండి డబ్బులు తీసుకుంటున్న నిర్వాహకులు ఫలితాలు వచ్చాక గెలిచిన వ్యక్తికి ఆ సొమ్మును అందిస్తారు. ఈ తతం గమంతా నిర్వహించినందుకు పందెం మొత్తంలో ఒకటి నుంచి మూడు శాతం వరకు కమీషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చు కుంటున్నారు. ఈ బెట్టింగ్లో రకరకాల పద్ధతులున్నాయి. పందెం మొత్తం రూపాయికి రూపాయి ఒక పద్ధతి. ఒకటికి ఒకటిన్నర, ఒక టికి రెండు ఇలా రకరకాలుగా పందెం కాస్తున్నారు. పందెం మొత్తా న్ని మధ్యవర్తికి ఇచ్చి, అతడి వద్ద ప్రామిసరీ నోటు రాయించుకొం టున్నారు. అన్ని వర్గాలకు చెందిన వారు వారివారి స్థాయిలో బె ట్టింగ్స్ మొదలు పెట్టారు. వీరు కాక ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు బెట్టింగ్లో పాల్గొం టున్నారు. ప్రస్తుతం ఒక కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇ ప్పటి వరకు ఒకరితో ఒకరు బెట్టింగ్ కట్టేవారు. అయితే ప్రస్తుతం ఐదారుమంది గ్రూపులుగా చేరి కోట్లలో బెట్టింగ్లు కడుతున్నారు. రూ.25 వేల నుంచి మొదలుకొని రూ.25 లక్షల వరకు పందేలు కాస్తున్నారు. ప్రధానంగా ఏపీలో హాట్ సీట్లపై జోరుగా పందేలు కా స్తున్నట్టు సమాచారం. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే బెట్టింగ్లు సాగాయి. దాదాపు రూ.200 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. ఇప్పుడు ఏపీలో ఫలితాల పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. నిజానికి పోలింగ్కు ముందే ఏపీలో బెట్టింగ్లు మొదలయ్యాయి. పోల్ పర్సంటేజీలపై పందెం కాశారు. ఎవరికి ఎక్కడ టికెట్ వస్తుంది. ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదవుతుందనే అంశాలపైనా పందెం నడిచింది. ఇక పోలింగ్ ముగిసిన ఒక్కరోజులోనే కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. చివరికి చేపల చెరువులు, భూములు, పొ లాలు సైతం బెట్టింగ్ రింగ్లోకి లాగే స్తున్నారు. ఫలితాల తేదీ దగ్గ ర పడుతున్నా కొద్దీ పందేలు మరింత జోరు అందుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ వ్యవహారం రూ.500 కోట్లు మించే చాన్స్ ఉందం టున్నారు విశ్లేషకులు. ఇప్పటికే విలువలు దిగజారుతున్న రాజకీ యాల్లో ఇదొక అవాంఛనీయమైన పరిణామం. ఈ సమయంలో ఇలాంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ప్రభుత్వం, పోలీసులు గట్టిగా ప్రయత్నించాలి.
వాసిలి సురేష్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎ న్నికలు ముగిసాయి. పోలింగ్ ముగిసి రెండు వారాలకుపైగా గడిచింది. ఫ లితాలు రావడానికి ఇంకా ఇరవై రోజులకు పైగా సమయముంది. ఈ సమయంలో అందరూ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడు తారు? అనే అంశాలపై లెక్కలు కడుతు న్నారు. పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఇదే టెన్షన్తో ఉన్నారు. బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోయి మరీ బెట్టింగుల నిర్వహణకు సిద్ధమయ్యారు. కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించే వార తా ఇప్పుడు పొలిటికల్ బెట్టింగ్స్తో బిజీ అయి పోయారు. వారికున్న పరిజ్ఞానంతో తమ లెక్క లు పక్కా అనే నమ్మకంతో కోట్ల రూపాయలను కుమ్మరించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు పోటాపో టీగా ఓటింగు సాగడం వల్ల టీడీపీ, వైసీపీలు ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడటంవల్ల గెలుపు ఏ వైపు ఉందో, ఎవరిని వరిస్తుందో అ ర్థం కాని అయోమయంలో ప్రజలు, నాయకులు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం ఇరు పార్టీలు తమ సాయశక్తులా పోరాడాయి. జనసేన, వామపక్షాలు కూడా శక్తి మేరకు పోరాడా యి. ఎన్నికలు ముగిసినా ఫలితాల కోసం చాలాకాలం వేచి ఉండా ల్సి రావడంతో అందరూ ఉత్కంఠతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే బెట్టింగ్ రాయుళ్ళకు గొప్ప అవకాశంగా మారింది. ఈజీ మనీకి అలవాటు పడినవారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వరంగా మారాయి.ఇటీవల కాలంలో అమరావతి, విజయవాడ పరిసర ప్రా ంతాలలో ఇటువంటి బెట్టింగ్ ముఠాలను పోలీసులు పట్టుకున్నా రు. వారి దగ్గర్నుంచి మొబైల్స్ లాప్ టాప్లు, డైరీలు స్వాధీనం చే సుకున్నారు. దీనిని బట్టి చూస్తే ఆన్లైన్లోనూ, మొబైల్ ఫోన్లలో నూ కోడ్ భాషలో ఈ పందేలు జోరుగా సాగుతున్నాయని అర్థమవు తోంది. ఒకప్పుడు బెట్టింగ్ అనేది వందలు, వేలల్లో మాత్రమే సాగేది. కాని ఇప్పుడు లక్షలు, కోట్లలోనే వ్యవహారం సాగుతోంది.
ఎన్నికల ఫలితాలపైన, మెజార్టీపైన, గెలుపొందే స్థానాలపైన, బూత్లు, గ్రామాల వారీగా, తొలి ఫలితాలు ఎవరికి అనుకూలం ఇ లా ఏ ఒక్కటీ వదలకుండా పందేలు జోరందుకుంటున్నాయి. ఏకం గా పోటీలో ఉన్న అభ్యర్థులే తమ ఫలితాలపై ప్రత్యేక సర్వేలు చేయిచుకుని బెట్టింగ్ రంగంలోకి దిగుతున్నారంటే ఇవి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎ వరికి ఎంత మెజారిటీ వస్తుంది? ఏ జిల్లాలో ఎవరిది పైచేయి ? ప లానా నియోజకవర్గంలో గెలుపెవరిది? అక్కడ మూడో స్థానంలో నిలిచేదెవరు? ఇలా ఒకటేమిటి ప్రతి అంశమూ బెట్టింగ్కు పనికి వచ్చేదే. సీటును బట్టి రేటు మారుతోంది. కొన్ని స్థానాల్లో ఫలానా అభ్యర్థి గెలిస్తే రూ.లక్ష ఇస్తామని, ఓడితే రూ.3 లక్షలు తీసుకుం టామని డీల్ కుదుర్చుకుంటున్నారు. ఏపీలో మంగళగిరి, గుడివా డ, నగరి, గాజువాక, భీమవరం, సత్తెనపల్లి, హిందూపురం, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నర్సాపురం పార్లమెంట్ స్థానాల గెలుపోటములపై బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారన్న అం శంపై బుకీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొం తమంది వైసీపీ వస్తుందనీ మరికొంత మంది టీడీపీ గెలుస్తుందని భావిస్తున్నారు. కొందరు పంటర్లు మాత్రం ఏ పార్టీకీ మెజార్టీ రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరివైపు ఉంటారన్నదానిపై అధికారం ఆధారపడి ఉంటు ందని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా పందేలు నిర్వహిస్తున్నా రు. అమరావతి ప్రాంతంలో పందెం రాయుళ్లకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. రాజధాని రాకతో భూముల విలువ కోట్లకు పెరగ డం.. ల్యాండ్ పూలింగ్తో ఉన్నపళంగా కోటీశ్వరులుగా మారడం తో కారు రాజ్ కారు అంటున్నారు. ఇల్లు, పొలాలు, నగదు, బం గారం ఇలా ఒకటేమిటి అన్నీ కుదువపెట్టి జూదం మొదలు పెట్టే శారు. రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరు, ఉండవల్లి, పెను మాకల్లో పందేలు హద్దుల్లేకుండా సాగుతున్నాయి. ఫలితాల గడు వు దగ్గరపడిన కొద్దీ బెట్టింగ్లు మరింత జోరందుకుంటున్నాయి. నిర్వాహకులు ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. నగదు అందుబాటులో లేకుంటే ఆస్తి పత్రాలను కూడా ష్యూరిటీగా ఉం చవచ్చంటూ పందెం రాయుళ్లను ముగ్గులోకి దించుతున్నారు. ఇరుపక్షాల నుండి డబ్బులు తీసుకుంటున్న నిర్వాహకులు ఫలితాలు వచ్చాక గెలిచిన వ్యక్తికి ఆ సొమ్మును అందిస్తారు. ఈ తతం గమంతా నిర్వహించినందుకు పందెం మొత్తంలో ఒకటి నుంచి మూడు శాతం వరకు కమీషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చు కుంటున్నారు. ఈ బెట్టింగ్లో రకరకాల పద్ధతులున్నాయి. పందెం మొత్తం రూపాయికి రూపాయి ఒక పద్ధతి. ఒకటికి ఒకటిన్నర, ఒక టికి రెండు ఇలా రకరకాలుగా పందెం కాస్తున్నారు. పందెం మొత్తా న్ని మధ్యవర్తికి ఇచ్చి, అతడి వద్ద ప్రామిసరీ నోటు రాయించుకొం టున్నారు. అన్ని వర్గాలకు చెందిన వారు వారివారి స్థాయిలో బె ట్టింగ్స్ మొదలు పెట్టారు. వీరు కాక ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు బెట్టింగ్లో పాల్గొం టున్నారు. ప్రస్తుతం ఒక కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకరితో ఒకరు బెట్టింగ్ కట్టేవారు. అయితే ప్రస్తుతం ఐదారుమంది గ్రూపులుగా చేరి కోట్లలో బెట్టింగ్లు కడుతున్నారు. రూ.25 వేల నుంచి మొదలుకొని రూ.25 లక్షల వరకు పందేలు కాస్తున్నారు. ప్రధానంగా ఏపీలో హాట్ సీట్లపై జోరుగా పందేలు కా స్తున్నట్టు సమాచారం. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే బెట్టింగ్లు సాగాయి. దాదాపు రూ.200 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. ఇప్పుడు ఏపీలో ఫలితాల పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. నిజానికి పోలింగ్కు ముందే ఏపీలో బెట్టింగ్లు మొదలయ్యాయి. పోల్ పర్సంటేజీలపై పందెం కాశారు. ఎవరికి ఎక్కడ టికెట్ వస్తుంది. ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదవుతుందనే అంశాలపైనా పందెం నడిచింది. ఇక పోలింగ్ ముగిసిన ఒక్కరోజులోనే కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. చివరికి చేపల చెరువులు, భూములు, పొ లాలు సైతం బెట్టింగ్ రింగ్లోకి లాగే స్తున్నారు. ఫలితాల తేదీ దగ్గ ర పడుతున్నా కొద్దీ పందేలు మరింత జోరు అందుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ వ్యవహారం రూ.500 కోట్లు మించే చాన్స్ ఉందం టున్నారు విశ్లేషకులు. ఇప్పటికే విలువలు దిగజారుతున్న రాజకీ యాల్లో ఇదొక అవాంఛనీయమైన పరిణామం. ఈ సమయంలో ఇలాంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ప్రభుత్వం, పోలీసులు గట్టిగా ప్రయత్నించాలి.
- వాసిలి సురేష్
9494615360