Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జవాన్, జై కిసాన్ గత ఎన్నికల్లో గెలవడానికి వాడుకున్న బీజేపీ నరేందమోడీ, ఇప్పుడు వారిని అణచివేసే ధోరణితో ఉన్నారని చెప్పడానికి ప్రస్తుత లోక్సభ ఎన్నికలే సాక్ష్యం. జవాన్లకు సరైన భోజనం పెట్టడం లేదని సైనికుడు తేజ్ బహుదూర్ యాదవ్ లోకానికి చాటిచెప్పగా, పసుపు బోర్డు ఏర్పాటులో ఎన్డీయే సర్కారు విఫలమైందంటూ వారణాసి ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించిన రైతుల్ని వెనక్కినెట్టేశారు. ఒకనాడు వీరిని ఎన్నికల నినాదాలు చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇప్పుడు వారిని దూరం పెట్టేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరించడం రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నది. ఎన్నికల సంఘాన్ని చేతిలో పెట్టుకుని కనీసం పోటీ చేసే హక్కును సైతం నిరాకరించడాన్ని తప్పుబడుతున్నారు. కుక్క తోక వంకర అన్నట్టు, అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అడ్డదారులనే మళ్లీ ఎంచుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- బి.బసవపున్నయ్య