Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజంగా ఎక్కడైనా రాస్తారోకోలు... ధర్నాలు... పికెటింగ్లు, బంద్లు... బైఠాయింపులు, లేక ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల ముందు ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు పోలీసులు అరెస్టు చేస్తారు. అందరికీ తెలిసిన విషయమే. కానీ అరెస్టు చేసిన వారికి స్టేషన్లో పోలీసులు కచ్చితంగా భోజనం చేయించాలన్న సంగతి కొంతమందికే తెలుసు. అరెస్టు అయిన వారిలో అనుభవం, ఆలోచన ఉన్న వాళ్లు భోజనం తెప్పించుకుంటారు. అప్పుడు అరెస్టు చేసిన వారితో పాటు పోలీసు కూడా అందులోనే తెప్పించుకుంటారు. ఒకవేళ అడగపోతే అరెస్టు అయిన వాళ్ల పేరుమీద పోలీసులే భోజనం తెప్పించుకుంటారు. ఈ మధ్య ఇంటర్ బోర్డు ముందు సుమారు రెండు వారాల నుంచీ రోజుకు మూడు నుంచి నాలుగు బృందాలను అరెస్టు చేస్తున్నారు. సంబంధిత పోలీసు స్టేషన్కు తీసుకెళ్తున్నారు. భోజనాలు పెట్టి సాయంత్రం వరకు ఉంచి వదిలేస్తున్నారు. వారం రోజుల క్రితం నిరక్ష్యరాసులైన తల్లిదండ్రులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్లను అరెస్టుచేసి పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. ఆకలవుతుందా? భోజనం చేస్తారా? అని పోలీసులు అడగ్గానే తల్లిదండ్రులు అవాక్కయ్యారు. భోజనం కూడా పెడతారా? అని వారు అడిగితే.. మీకు ఆకలైతే మీది మీకు పెడతాం, మాది మేం తింటాం, మీకొద్దంటే, మీదీ మాదీ మేమే తింటామని పోలీసులు చెప్పడంతో తల్లిదండ్రులు అవక్కాయ్యారు.
- యాదయ్య