Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనాటి నిజాం నియం త పాలనకు, దొర లు, భూస్వాములు, దేశ్ ముఖ్లు, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా, నిజాం పోలీసు, యూనియన్ సైన్యాలను ఎదిరి ంచేందుకు గాను ప్రజలను ఏ కతాటిపై నడిపి సాయుధ ద ళాలకుప్రత్యక్షంగా శిక్షణని చ్చి, నాయకత్వం వహించి పోరాట విజయ పతాకాలను ఎగరవేసిన ధైర్యశాలి బీఎన్.
1922లో నల్గొండ జిల్లా (ప్రస్తు తం సూర్యాపేట జిల్లా) తుంగతుర్తి మండలం, కర్విరాల కొత్తగూడెం గ్రా మంలో భీమిరెడ్డి చొక్కమ్మ - రామిరెడ్డి దంపతులకు మొ దటి సంతానం బీ ఎన్. పుట్టింది భూస్వా మ్య కుటుంబం లో అయినా ఆయనెప్పు డూ పేదల పక్షమే. బీఎన్ బాల్యమంతా అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే గడిచింది. ఆ రోజు లలో గ్రామాలలో విద్యావకాశాలు లేకపోవడంతో నాల్గో ఫారమ్ చదవటా నికి సూర్యాపేటకు చేరాడు. ఆనాటి నిజాం రాజ్యం హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ) లో రాజ భాష గా ఉర్దూ ఉండడంతో బీఎన్ కూడా ఉర్దూ చదవక తప్పలేదు. నల్గొండ జిల్లాలో 8వ తరగతి వరకు చది వాడు. సంవత్సరం తరువాత హైదరా బాద్లో బం ధువుల సహకారంతో 9, 10 తరగతులు పాసయ్యా డు. చదువుతున్న కాలంలోనే జాతీయంగా వందేమా తర ఉద్యమం, అంతర్జాతీ యంగా ప్రపంచ యుద్ధం బీఎన్లో రాజకీయ ఆసక్తిని పెంచాయి. సరిగ్గా అదే సమయంలో నిజాం పాలనకు వ్యతిరేకత ప్రభంజనం లా ఉద్యమం మారటం మొదలైంది. 1941-42లో నిజాంకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరించాడు.
హైదరాబాద్ సంస్థానానికి నిజాం రాష్ట్రం (తెలం గాణ)లో 2600 మంది జమీందార్లు, జాగీదార్లు, దేశ్ముఖ్లు ఉండేవారు. వీరి ఆధీనంలో 10వేల గ్రా మాలు, 5కోట్లా30లక్షల ఎకరాల సాగుభూమి ఉండే ది. సొంతభూమి ఉన్న రైతులు 30శాతం ఉంటే, మిగిలిన 70శాతం భూమి పెత్తందార్ల పదఘట్టనల కింద ఉండేది. 1951 పరిపాలన రిపోర్టు ప్రకారం నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో 500 ఎకరాలకు పైగా భూమి కలిగి ఉన్న భూస్వాములు దాదాపు 550 మంది ఉన్నారు. సూర్యాపేట తాలుకా లో దేశ్ముఖ్గా పేరుగాంచిన ఎర్రపాడు, జన్నాగారెడ్డి దొరలకు 30 గ్రామాలలో ఒక లక్ష 50వేల ఎకరాల భూమి ఉండేది. జనగామ తాలూకా విసునూర్ దొర రాంచంద్రారెడ్డికి 40 గ్రామాలలో 40వేల ఎకరాల భూమి ఉండేది. ఇవేగాక ''ఇనాములు'' ''పాయగాలు'' పేర్లతో లక్షల ఎకరాల భూమి వీరి ఆధీనంలో ఉండే ది. మొత్తం గ్రామీణ వ్యవస్థ అంతా జమీందారీమ యంగా ఉండేది. ఈ వాతావరణం రైతు కూలీలలో అసంతృప్తిని రగిల్చింది. రైతాంగం కూడా రైతు కూలీలకు మద్దతిచ్చి పెత్తందార్ల వ్యతిరేక ఉద్యమంతో చేతులు కలిపారు.
నిజాం రాజ్యంలో భూమిలేక, బతకలేక వెట్టి చేసేవారి బతుకులు ప్రాణసంకటంగా మారి ఆకలితో అలమటిస్తూ అల్లాడేవారు. బీఎన్ ఇంట్లో పనిచేసే మూగపాలేరుతో కలిసి పొలంలో గూడ వేస్తున్న సమయంలో పాలేరు నీరసంతో కిందపడిపోయాడు. ఏమిటని ఆరాదీస్తే రెండు రోజులుగా తిండి లేక పస్తులున్నాడని తెలిసింది. పొద్దంతా పనిచేస్తున్న వారికి తిండి లేకపోవడమా? వీరి భవిష్యత్ ఏమిటని తోటి మట్టిమనుషుల గురించి వేయి ప్రశ్నలు బీఎన్ను వెంటాడాయి. ఇలాంటి సమయంలోనే తెలుగు భాషకు జరుగుతున్న అవమానాన్ని భరించ లేక కొంత మంది ప్రారంభించిన భాషా- సాంస్కృతిక ఉద్యమం క్రమంగా బలపడింది. భాషా - సంస్కృతు ల పునరుజ్జీవనం కోసం ఏర్పడిన ఆంధ్ర జన కేంద్ర సంఘం చివరకు ఆంధ్ర మహాసభగా మారింది. దీని ఉద్యమ పరిధిలోకి ప్రజల సమస్యలతోపాటు భూమి సమస్య కూడా చేర్చబడింది. వెట్టిచాకిరీని నిర్మూలిం చాలనీ రాత్రిబడులు స్థాపించాలనీ తెలుగు భాషకు సమున్నత గౌరవం ఇవ్వాలనీ దొరలు, భూస్వాముల భూములను ప్రజలకు పంచాలని ఇలా అనేక నినాదాలతో ఆంధ్ర మహాసభ ముందుకు సాగింది.
నిజాం నిరంకుశత్వాన్ని అంతమొందించి, భూ స్వాముల, దొరల పెత్తనాలకు వ్యతిరేకంగా, కమ్యూ నిస్టు పార్టీ స్ఫూర్తితో ఎర్రజెండా నీడన గ్రామాలలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. శతృవు మూకలను ఎదిరించడానికి గుత్పల సంఘాలు ఏర్పడ్డాయి. వడిసెల రాళ్లను చేతబూనినారు. నిజాం రాజ్యం లో రైతాంగ పోరాటమై ప్రజలు వి జృంభించారు. దొరలను ఎదిరిం చి చాకలి అయిలమ్మ పొలంలో ధాన్యాన్ని ఆమె ఇంటికి చేర్చారు. ప్రజలపైన, రైతులపైన విరుచు కుపడిన నిజాం పోలీస్, రాజాకా రులను ఎదుర్కోవడానికి ప్రజలు, రైతులు ఆయుధం పట్టవలసి వ చ్చింది. ఈ సాయుధ పోరాటా ని కి నాయకత్వం వహించిన అగ్రనే తల్లో బీఎన్ ఒకరు. దళాలకు గెరి ల్లా శిక్షణ ఇవ్వడం, వ్యూహాలతో, ఎత్తుగడలతో శత్రుమూకలను మట్టికరిపించేందుకు శిక్షణ ఇచ్చేవారు బీఎన్. పాత సూర్యాపేట, దేవరుప్పుల, ఆలేరు, అలాగే కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అనేక ప్రాంతాలలో నిజాం రైఫిల్లను ఎదిరించి ప్రజలను ముందుకు నడిపారు. మహాసేనా ని అయిన బీఎన్ ఆధ్వర్యంలో రావులపెంట, కోట పా డు, చివ్వెంల గ్రామాలలో జరిగిన దాడుల ద్వారా సేక రించిన ఆయుధాలతో పోరాటం ముందుకు సాగింది. మొండ్రాయి, దేవరుప్పుల, బాలెంల గ్రామాలలో బాహబాహీ పోరాటాలు జరిగాయి. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కో సం జరిగిన తిరుగుబాటు పోరాటాలకు ఆయుధాలు చేత పట్టి అచెంచలమైన ధైర్యసాహసాలతోతెలంగాణ సా యుధపోరాటాన్ని ముందుకు నడిపారు. 1947 అధి కార మార్పిడి తరువాత ఇటు నిజాం సైన్యాలతో, అ టు యూనియన్ సైన్యాలతో తలపడవలసి వచ్చింది. దళాలను మైదాన ప్రాంతాల నుండి అడవి ప్రాంతాల కు మలిపి గోదావరి పరివాహక ప్రాంత రెండు వైపుల సుమారు 200 గ్రామాలలో ఉద్యమాన్ని విస్తరింపజే శారు. 1946 నుండి 1951 అక్టోబర్ వరకు విరా మం ఎరుగక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. చారిత్రా త్మకంగా సాగిన ఈ పోరాటంలో 4వేల మంది ప్రాణా లు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆ వీరుల త్యాగాల ఫలితంగా తె లంగాణలో 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిం ది. 3వేల గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పడ్డా యి. ఈ పోరాటం దేశ రాజకీయ పరిణామాల్లోనూ, సామాజిక వ్యవస్థలోనూ ప్రముఖమైన మార్పులకు దారితీసింది. తొలితరం కమ్యూనిస్టు అయిన బీఎన్ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, ఆ తరువాత ఏర్పడిన మార్క్సిస్టు పార్టీలో ఆపైన ఎంసీపీఐ(యూ)లో పలు కీలక బాధ్య తలు నిర్వహించారు. రెండుసార్లు సూర్యా పేట నుండి రాష్ట్ర శాసనసభకు, మూడుసార్లు మిర్యా లగూడ పా ర్లమెంటు సభ్యునిగా ఎన్నికై ప్రజల హక్కు లపై, సమ స్యలపై చట్టసభలలో తన గళాన్ని వినిపి ంచారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు గర్వ ంతో ఉండకుండా నిరాడంబర జీవితాన్ని గడిపారు బీఎన్. పుట్టింది ధనవంతుల కుటుంబంలో ఆయినా కష్టజీవు లంటే ఎ నలేని ప్రీతి ఆయనకు. కష్టాన్ని న మ్ముకొని జీవించే మట్టి మనుషులకు భూమి కావాలని జీవిం చినంత కాలం తపించాడు. వారి సమస్యలపై పాలకు లను ని లదీశాడు. మనుషుల మధ్య కుల - మత, ప్రాంతీయ అసమానతలు లేని సమాజాన్ని నిర్మించా లన్నదే బీఎన్ ఆశయం. కమ్యూనిస్టుల ఐక్య త, సామాజిక న్యాయం ఆయన స్వప్నం. నేడు ఆయ న వర్ధంతి. ఆయన ఆశయాలకు పునరంకితమవుదాం.
- వనం సుధాకర్
సెల్ : 9989220533