Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడి (capital) అనే పదం చాలా చిన్న పదం. ఇప్పుడు అందరికీ తెలిసిన పదమే. కానీ దాని విశ్వరూపాన్ని దర్శించినట్టయితే మనం నిబిడాశ్చర్యంతో నివ్వెరపోక తప్పదు. ఎందుకంటే నేడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ది ఈ పెట్టుబడే. అందుకనే మార్క్స్ తన రాజకీయ అర్ధశాస్త్ర విశ్లేషణకు పెట్టుబడి అని పేరు పెట్టాడు.
పెట్టుబడి యొక్క పూర్తి నిజ స్వరూపం తెలియాలంటే పెట్టుబడి గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిందే. వేరే మార్గం లేదు. మార్క్స్ పెట్టుబడిని ఎందుకు చదవాలంటే ఇప్పుడు మనం చూస్తున్నది తలకిందుల ప్రపంచాన్ని. తల కిందు లుగా ఉన్న దాన్నీ సరిగ్గా నిలబెట్టి చూపించడం, సమగ్రంగా వివరించడం ఈ వ్యాసంలో కుదరదు కానీ రేఖామాత్రంగా పరిచయం చేస్తాను.
అసలు పెట్టుబడి అంటే ఏమిటి? పెట్టుబడికి మూలం ఏమిటి? తేలిగ్గా చెప్పుకోవాలంటే ఇతరుల శ్రమ నుండి వచ్చి పోగుబడిన వ్యక్తిగత ఆస్తే పెట్టు బడి. పెట్టుబడిదారీ విధానమంటే అవసరాల కోసం కాక అమ్మకాల కోసం తయారు చేసే ఉత్పత్తి విధా నం. ఇందులో పెట్టుబడి అంటే ఉత్పత్తి సాధనాలే. వేతనం చెల్లించి శ్రమను కొంటాడు కాబట్టి శ్రమ కూడా.
పెట్టుబడి కేవలం ఒక సాధారణమైన దొంగత నం, దగా కాదని అనకుండా ఉండాలంటే దానిని ఒక పవిత్ర వారసత్వపు హక్కుగా ప్రకటించాలంటే శాసనం యొక్క సహాయం కావాలి. వారసత్వంగా కానీ సంపాదన ద్వారా కానీ సంపదకు యజమాని కావచ్చు. ప్రత్యక్షంగా తక్షణమే సంపద వల్ల లభ్య మయ్యేది కొనుగోలు శక్తి. అంటే మార్కెట్లో లభించే శ్రమపైన, శ్రమ నుండి వచ్చిన ఉత్పత్తులపైన అదు పు చేయగల అంటే శ్రమనూ శ్రమ నుండి వచ్చిన ఉత్పత్తులనూ నియంత్రించ గల శక్తి గలదే పెట్టుబడి.
పెట్టుబడి దారునికి ఈ శక్తి తన వ్యక్తి గత లేక మానవ లక్షణం గా రాలే దు. పెట్టు బడికి సొంత దారుడు కావ డం వలన ఆ శక్తి వచ్చింది. పెట్టు బడితో లభ్యమ య్యే కొనుగోలు శక్తే అతడి శక్తి. ఆ శక్తికి ఎదురుగా ఏదీ నిలబడలేదు. అందు కనే పెట్టుబడికి లొంగని దేదీ లేదు. ఈ అంశానికి సంబంధించి మనకు తెలవాల్సినది ఏమంటే పెట్టుబడి అంటే కొంత ప్రమాణంలో పోగుబడిన శ్రమేనని పెట్టుబడిదారుడంటే ఈ శ్రమను స్వాధీన పర్చు కున్నవాడు. అంటే దోపిడీ చేసినవాడు అని. అయితే శ్రామికుడు తాను శ్రమించేది శ్రమను పెట్టుబడిగా మలిచేందుకు కాదు. తన జీవన భృతి కోసం మాత్రమే. శ్రమను కొ ని, దోచుకుని దానిని పెట్టుబడిగా మార్చి మాయో పాయాలకు పాల్పడుతున్నవాడు పెట్టుబడిదారుడు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో మనుషుల అవసరా లను తీర్చే వరకే పరిమితమై వస్తు ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి అయిన వస్తువులను అమ్మడం కోసం అంటే ఒక వస్తువుకుండే ఉపయోగ విలువతో పాటుగా మారకం విలువగల సరుకుగా ఉత్పత్తి జరుగుతు ంది. ఇక్కడొక ఉదాహరణ చూద్దాం. కార్పొరేట్ కళాశాలల్లో లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్నారు. ఈ అభ్యసన కేవలం జ్ఞానం కోసం, జీవన భృతి కోసమే కాదు. వెచ్చించిన పెట్టుబడితో పొందిన విజ్ఞానాన్ని తిరిగి కార్పొరేట్ సంస్థలకో, సాఫ్ట్వేర్ కంపెనీలకో అమ్ముకోవడం జరుగుతుంది. కొనుక్కున్న వాడు తిరిగి అమ్ము కుంటాడు. అంటే అ మ్మకాల కోసమే కొనటం జరు గుతుంది. కొనుగోలు, అమ్మకాలే పెట్టుబడిదారీ వ్య వస్థ లక్షణం. వ్యవసాయక ఉత్పత్తిలో జీవనం కొన సాగింపు కోసం ఉంటుంది. అందులోనూ ఇప్పుడు పెట్టుబడిదారీ లక్షణం వచ్చేసిందనుకోండి. రియలె స్టేట్ వ్యాపారంలో భూమిని కొనేది తిరిగి అమ్మటానికి. భూమిని కూడా ఒక సరుకుగా మలిచిన ఫలితమిది.
పెట్టుబడిదారీ ఉత్పత్తి జరగాలంటే పెట్టుబడి పోగుపడాలి. పెట్టుబడి పోగు పడాలంటే అదనపు విలువ ఉండాలి. అదనపు విలువ ఉండాలంటే పె ట్టుబడిదారీ ఉత్పత్తి జరగాలి. అంటే ఉత్పత్తి దారుల చేతిలో పెట్టుబడి శ్రమ శక్తి గణనీయంగా ఉండాలి. ఇదొక వలయం. పెట్టుబడి సంచయ నానికి ముందు ఆదిమ సంచయనం ఉందని ఆడమ్ స్మిత్ చెప్పాడు. అంటే ఆదిమ సంచయనం పెట్టుబడిదారీ విధానపు ఫలితం కాదు. దాని ప్రారంభ స్థానం.
ఆదిమ సంచయనం చరిత్రలో అపారమైన జన సముదాయాలు తమ జీవనధారాల నుండి హఠాత్తుగా, బలవం తంగా గుం జి వేయబడి స్వేచ్ఛాయుత అనుబంధిత కార్మికులుగా మార్కెట్లోకి విసిరి వేయ బడ్డారు. చర్చి ఆస్తిని దొంగిలించడమూ, ప్ర భుత్వ ఎస్టేట్లను మో సంగా పరాధీనం చే యడమూ, సమష్టి భూముల అపహరణా, ఫ్యూడల్ కుటుంబ తెగల ఆస్తి దురాక్రమణా, భూ మి నుండి ప్రజల తొల గింపు, ఆస్తిహరణం దాని ని తమ సొంత ఆస్తిగా మార్చడమూ ఇవన్నీ ఆదిమ సంచయనం యొ క్క రూష్యా శ్రమ పద్ధ తులు. ఇందుకోసం రా జ్యాధికారాన్ని సమాజపు వ్యవస్థీకృత దౌర్జన్యాన్ని ఉపయో గించింది. కొత్త ఉత్పత్తి సమాజాన్ని కనబో యే ప్రతి పాత సమాజా నికీ బల ప్రయోగమే మంత్రసాని. ఈ విషయం మార్క్స్ నొక్కి చెబుతాడు.
అనేక చిత్ర హింస లు, భయానకమైన శాస నాలు, వేతన వ్యవస్థకు అవసరమైన క్రమ శిక్షణ గల కార్మికులను తయారు చేసాయి. పెట్టుబడి దారీ వర్గం పుట్టినప్పుడు అది వేతనాలను నియం త్రించడానికి రాజ్యాధి కారాన్ని కోరుతుంది. ఉపయోగించుకుంటుంది. అదనపు విలువను ఉత్పత్తి చేయడానికి అనుకూల మైన పరిమితులతో వేతనాలను నియంత్రితం చేయడానికి, పని దినాన్ని పొడిగించడానికీ, కార్మికు న్ని పరాధీన స్థాయిలో ఉంచడానికీ ఉపయో గించుకుంటుంది. ఆదిమ సంచయనంలో ఇది అత్య ంత ముఖ్యమైన అంశం.
పెట్టుబడికి వేతన శ్రమ ఉండాలి. వేతన శ్రమకి కూడా పెట్టుబడి ఉండాలి. ఒకదాని మనుగ డకు మరొకటి అవసరమైన షరతు నూలు కర్మాగారంలో పని చేసే కార్మికుడు నూలు తప్ప మరిదేన్నీ ఉత్పత్తి చేయడా? చేస్తాడు. పెట్టుబడిని ఉత్పత్తి చేస్తాడు. అతని శ్రమను ఆజ్ఞాపిం చగలిగిన విలువను ఉత్పత్తి చేస్తాడు. అదే పెట్టుబడిగా మారేలాభం. ఉత్పత్తి ప్రక్రియలో సరుకులను ఉత్పత్తి చేయడమనేది పెట్టుబడిదారుని అంతిమ లక్ష్యం కాదు. అతని అంతిమ లక్ష్యం లాభం. ఈ లాభం శ్రామికుడు ఉత్పత్తి చేసిన అదన పు శ్రమ ద్వారా పెట్టుబడి దారునికి లభిస్తుంది. ఇది తిరిగి పెట్టుబడిగా మారి, తన చలనాన్ని కొనసాగిస్తుంది. పెట్టుబడి అనగానే మనందరికీ డబ్బు రూపమే కనపడుతుంది. అవును అది డబ్బు రూపం ధరిస్తుంది. మార్కెట్లోకి పెట్టుబడి డబ్బు రూపంలోనే ప్రవేశిస్తుంది. కేవలం డబ్బుగా ఉండే డబ్బుకి, పెట్టుబడిగా ఉండే డబ్బుకి మధ్య తేడాని వాటి చలామణి రూపంలో చూస్తాము. సరుకులు డబ్బుగా మారుతుంది. డబ్బు సరుకుగా మారుతుంది. అంటే డబ్బును సరుకుగా, తిరిగి సరుకును డబ్బుగా మార్చేయడం. చలామణిలో ఉండే డబ్బుకు పెట్టుబడిగా మారే శక్తి ఉంది. ఈ చలామణిలోంచే అదనపు విలువను లాభంగా పొందుతాడు. పెట్టుబడిదారుడు తన సరుకులను అమ్మి తద్వారా పొందిన డబ్బుతో ఎక్కువ భాగాన్ని తిరిగి పెట్టుబడిగా మార్చుకోగలగటమే సంచయనానికుండే ప్రథమ లక్షణం. అయితే సరుకుల మార్పిడి నుండి, కొనుగోలు, అమ్మకాల నుండి సరుకుల చలామణి, డబ్బు చలామణి నుండి అదనపు విలువ పుట్టదు. అంటే లాభం పుట్టదు. ఎందుకంటే ఒక వస్తువు ఉత్పత్తికి వంద రూపాయ లు అయిందనుకుందాం. దాన్ని వంద రూపాయ లకు అమ్మితే అంటే వంద రూపాయల వ్యయమైన వస్తువును వంద రూపాయలకే అమ్మితే అదనపు విలువ రాదు. అసలు విలువల మధ్య మార్పిడి వల్ల కూడా అదనపు విలువ పుట్టదు. ఈ లావాదేవీలేవీ జరగక ముందే అంటే శ్రామికుడు చేసిన అదనపు శ్రమ వల్లనే ఆ వస్తువుకి అదనపు విలువ ఏర్పడు తుంది. ఇదే లాభంగా పెట్టుబడిదారుడు పొం దుతాడు. వంద రూ పాయలు వెచ్చించి ఉత్పత్తి అయిన సరుకు నూటా పది రూపా యలకు అమ్మితే పది లాభం వస్తుంది. ఈ పది అదనపు విలువ. దీన్ని కూడా పెట్టుబడిగా తిరిగి మార్చేది ఈ రకమైన చలామణిలోనే. లాభం తక్షణమే పెట్టుబడిగా మారుతుంది. మూల పెట్టుబడితోపాటు చల నంలో పెట్టబడుతుంది. పెట్టుబడిగా మారిన డబ్బు తన చలనాన్ని ముగించేది కేవలం మళ్లీ ప్రారంభించడానికే.
చైతన్యం, ఇచ్ఛా సంతరించుకున్న పెట్టుబ డికి మానవాకారంగా పెట్టుబడిదారు వ్యవహరి స్తాడు. పెట్టుబడిదారున్ని డ్రైవ్ చేసేది కూడా పెట్టుబడే. కాబట్టి సరు కులో ఉండే ఉపయోగ విలువ అనేది అతని లక్ష్యం కాదు. అతని అంతిమ లక్ష్యం డబ్బు. అయితే ఒకే లావాదేవీలో ఒక లాభం కూడా అతని లక్ష్యం కాదు. ఎప్పుడూ ఎడతెగని లాభం చేసుకునే అవిరామ ప్రక్రియ మాత్రమే అతని లక్ష్యం. సంపద పట్ల అపరిమితమైన దురాశ, మార్పిడి విలువ కోసం ఉద్వేగపూరితమైన వేట, వీటి విషయంలో పెట్టుబడిదారుడు, పిసినారి ఒకటే. ఎందుకంటే లాభం కోసం ఆర్పరాని జ్వాలగా మండే కోరిక, బంగారం కోసం పాపిష్టిదాహం, ఇవే అతన్ని నడినపిస్తాయి. అందుకనే మార్క్స్ ఇలా వివరిస్తాడు. తగినంత లాభం ఉంటే పెట్టుబడి చాలా ధైర్యం కలది. నిశ్చయమైన పదిశాతం లాభం ఉంటే అది ఎక్కడైనా వ్యాపారం చేస్తుంది. ఇరవై శాతం లాభం దానికి ఉబలాటం కలిగిస్తుంది. యాభై శాతం సాహసాన్ని ఇస్తుంది. వంద శాతం ఉంటే అదిమానవ నియమాలన్నింటినీ కాలరాయడానికి సిద్ధపడుతుంది. మూడు వందల శాతం ఉంటే ఏ నేరం చేయడానికైనా సంకోచించదు. దాని సొంతదారునికి ఉరిశిక్ష పడే అవకాశానికి కూడా నిరభ్యరంతరగా ప్రోత్సహిస్తుంది. అంటే ఈ విషయం పెట్టుబడిని మోసము, దొంగతనం, దౌర్జన్యం రాక్షసత్వమూ గలదిగా రుజువు చేసింది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో అన్నీ సరుకులుగా, వాటి అమ్మకాలు కొనుగోలుగా మారిపోతాయి. మనుషుల్ని కూడా సరుకుగా చేస్తుంది. దీని పర్యావసానంగా సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు, అనుబంధాలు, ప్రేమలు, పెండ్లీలు, స్నేహాలు, దయాదాక్షిణ్యాలు, గౌరవాలు, మర్యాదలు, నమ్మకాలు, విశ్వాసాలు, రాజకీయాలు, చట్టాలు, న్యాయాలు, ప్రభుత్వాలు, విలువలు, కళలు, సాహిత్యం మొదలైనవన్నీ వాటితో ప్రభావితమై పని చేస్తుంటాయి. అంతెందుకు మానవ భావోద్వేగాలను కూడా సరుకుగా మార్చేస్తారు. 'రుడాలి' సినిమా చూడండి. మనిషి చనిపోతే ఏడ్వటానికి కొందరు తమ ఏడ్పుని డబ్బుకు అమ్ముకుంటారు. ఇదీ పెట్టుబడి విశ్వరూపం. ''డబ్బు అనేది పుట్టకతోనే ఒక చెంప మీద రక్తపు మరకతో జన్మిస్తే... పెట్టుబడి అనేది నఖశిఖ పర్యంతం ప్రతి రోమ కూపం నుండి రక్తమూ, చీమూ, మురికీ కారుతూ జన్మిస్తుంది.''
- ఆనందాచారి
సెల్ : 9948787660