Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్మూర్ ప్రాంత రైతాంగా న్ని సమీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలవల్ల ఏర్పడిన సంక్షోభంపై అఖిల భార త రైతుకూలీ సంఘం పోరాటానికి సైరన్ ఊదింది. పసుపు ధర, పసుపు బోర్డు సాధన, ఎర్రజొన్న రైతులను నిలువు దోపిడీ చేస్తున్న సిండికేట్ వ్యాపారుల దగాకోరు తనంపై, ప్రేక్షకపాత్ర పోషించిన పాలక యంత్రాంగాన్ని నిగ్గదీసేందుకు గత కొన్ని ఏండ్లుగా పసుపు బోర్డును ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం, తెప్పించి పట్టునిలపుకుం టామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రెండూ - మాటతప్పాయి.
ఏటా లక్ష 74 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఎనిమిది లక్ష ల టన్నుల పసుపు మన దేశంలో ఉత్పత్తవుతుంది. అందు లో తెలంగాణ ప్రాంతంలో 55 వేల హెక్టార్ల సాగుతో 30 శాతం వాటా కలిగి ఉంది. ఆర్మూర్, జగిత్యాల ప్రాంతాల్లో 25 వేల హెక్టార్లలో పసుపు సాగు జరుగుతుంది. ప్రకృతి సహకరిస్తే సరాసరి ఎకరాన 16 క్వింటాళ్ల పసుపు దిగు బడి వస్తుంది. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర క్వింటాల్కు ఎక్కువలకు ఎక్కువ ఆరు వేలు పలుకుతుంది. ఒక ఎకరానికి 1 లక్ష 43 వేల ఖర్చు వస్తుంది. ఎకరంలో 16 క్వింటాళ్ల దిగుబడి రాగా, రూ.6,000 చొప్పున అమ్మగా, రైతుకు రూ.96 వేల ఆధాయం వస్తుంది. ఈ లెక్కన రైతుకు ఎకరాన రూ.47 వేలు నష్టం వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు ఏ మాత్రం పుసుపు రైతుకు నష్టాన్ని పూడ్చలేకపోతుంది. కనుక గిట్టుబాటు ధర కల్పించడం, పసుపు బోర్డు ఏర్పాటే దీనికి పరిష్కారం.
ఆర్మూర్ ప్రాంతంలోనే పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయాలంటే దేశవ్యాప్తంగా 4 లక్షల 30 వేల ఎకరాల్లో పసుపు సాగు అవుతుంది. అందులో తెలంగాణలో 1,03,750 ఎకరాల్లో సాగు అవుతుండగా, కేవలం నిజామాబాద్ జిల్లాలోనే 62,500 ఎకరాల్లో సాగుచేస్తు న్నారు. పసుపు ఎక్కువ శాతం సాగు అవుతున్న ప్రాంతం లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయడం న్యాయమైంది. ఆర్మూర్ ప్రాంత పసుపు ప్రపంచంలోనే నాణ్యతకు పెట్టింది పేరు. సుమారుగా 500 కోట్ల విలువ కలిగిన పసుపు ఉత్పత్తి జరుగుతుంది. ఎగుమతులు కూడా భారీగానే జరుగుతాయి. అందుకే ఇక్కడ ఏర్పాటు చేయా లి. కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల వాగ్దానా లకు మాత్రమే పరిమితమయ్యాయి. ముఖ్యమంత్రి తనయురాలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి పసుపు బోర్డు ఏర్పాటు గురించి లేఖలు సేకరించి కేంద్రానికి ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్నారు. కాని పసుపు బోర్డు ఏర్పాటు గురించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించకపోవడం వీరి నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం బోనస్ రూపంలోనైనా పసుపు రైతును ఆదుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకు - చేతలకు పొంతనలేదు.
ఎర్రజొన్న పంటను 1975-76లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు ఇచ్చి కొనుగోలు చేసింది. రైతులకు లాభసా టిగా ఉండటంతో జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో 50 వేల నుండి 60 వేల ఎకరాలు సాగవుతుంది. రాజుగారి గుర్రం రానురాను గాడిద అయినట్టు ఈ లాభసాటి పం ట విత్తనంపై వ్యాపారుల కన్నుపడింది. దళారి వ్యాపా రస్తులు ప్రభుత్వాన్ని శాసించి ప్రైవేట్ కొనుగోలును ప్రార ంభించారు. అప్పటినుంచి రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 2000 సంవత్సరంనుండి ప్రతి యేట ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 2018 సంవత్సరంలో రైతులు రోడ్లపైకి వస్తే శాసనసభ ఎన్నికలు ఉండటంతో శాసనసభ్యుల ఒత్తిడితో ప్రభుత్వం క్వింటాల్కు రూ. 2,300 చొప్పున 5 లక్షల క్వింటాల్ కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం ఎర్రజొన్నలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిరాకరించడంతో 40 మంది దళారులు సిండికేట్గా ఏర్పడి కృత్రిమంగా ధరను తగ్గించి క్వింటాల్కు రూ.1,600 చొప్పున కొనుగోలు ప్రారంభించారు.
ఇందుకు నిరసనగా ఫిబ్రవరి 7న ఆర్మూర్ - హైదరాబాద్ జాతీయ రహదారి మామిడిపల్లి చౌరస్తావద్ద వేలాదిమంది రైతులు, వివిధ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించగా సాయంత్రం 5 గంటల తర్వాత ఆర్మూర్ ఆర్డీఓ, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ మార్కెట్ అధికారులు ధర్నా స్థలం వద్దకు వచ్చి 4 రోజులు సమయం ఇవ్వండని రైతులను కోరారు. రైతులు సమ్మతించి ధర్నాను విరమించారు. కానీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కవిత అధికార అహంకారంతో రైతుల్ని అవమానించే విధంగా ఆందోళన చేస్తున్నది రైతులే కాదనీ, రైతుల డిమాండ్లో ఏమాత్రం న్యాయం లేదనీ రైతు ఉద్యమాన్ని నీరుగార్చి, కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళన కేవలం కాంగ్రెస్ వారి ఆందోళన అని ముఖ్యమంత్రి బట్టకాల్చి మీద పడేశారు. అందుకే వందలాది మంది రైతులు ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు.
పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్య పరిష్కారంలో నిండా నిర్లక్ష్యం వహించిన బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలు నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టేసుకోవడంపైనే పోటీ పడ్డాయి. ఫలితంగా దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని ఈ రెండు ప్రధాన సమస్యలను జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలనే వినూత్నమైన రాజకీయ అభిప్రాయానికి వచ్చిన రైతుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాచి రంపాన పెట్టాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేసి ఎంపీ ఎన్నికల్లో రైతులు పోటీ చేయకుండా ఉండేందుకు చేయాల్సిన కుట్రలన్నీ చేశాయి. కవిత మీద రైతులు పోటీని నివారించేందుకు కేసీఆర్ తమ బలగాన్ని రంగంలోకి దింపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చివరికి పోలీసు అధికారులను సైతం ఉసిగొల్పినా రైతుల చైతన్యం ముందు ఆ కుట్రలు ఫలించలేదు. ఫలితంగా నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో 178 మంది రైతులు పోటీ చేశారు. ఊరంతా నామీద ఉమ్మేస్తే, తాను వెళ్లి చెరువులో ఉమ్మేసినట్టుగా నిజామాబాద్ నామినేషన్లు రుచించని టీఆర్ఎస్ తమ కార్యకర్తలచేత మోడీపైనే పోటీ చేయించేందుకు పార్టీ సానుభూతిపరులను, తమ శ్రేణులను పురమాయించి వారణాసికి పంపింది కవిత. నిజామాబాద్లో టీఆర్ఎస్ పెద్దలు ఆడిన ఆటలనే వారణాసిలో మోడీ సేన తూ.చ తప్పకుండా ఆచరణలో పెట్టింది. కేంద్ర ప్రభుత్వ నిఘా అధికారులు, బీజేపీ శ్రేణులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు వారణాసిలో తెలంగాణ పోలీసులు చూపించిన నీతినే టీఆర్ఎస్ కార్యకర్తలకు చూపించారు. చివరికి రూముల్లోనుండి పారిపోయేంతటి భీతావాహ పరిస్థితిని తెచ్చిపెట్టింది మోడీ ప్రభుత్వం.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో వేలాదిమందితో జరిగిన సభలో ఆర్మూర్, జగిత్యాల రైతాంగం చేస్తున్న ఆందోళనకు సమస్య పరిష్కారానికి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందని చిలక పలుకులు పలికారు కేసీఆర్. ఉద్యమం ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమైన వార్తలు అన్ని దినపత్రికల్లో పతాక శీర్షికల్లో, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రము ఖంగానే ప్రచారంలోకొచ్చింది. మార్చి 10 వరకు అంటే నెల 6 రోజులపాటు అణచివేత ధోరణి, లాఠీచార్జీలనె దిరించి జరిగిన ఉద్యమం వారి దృష్టికి రాలేదట? పరిష్కారం చేయాలని ఉంది కాని, ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని మాట్లాడటం ఎంత వరకు సమంజసం. ఎన్నికలు పూర్తికాగానే ఎర్రజొన్న రైతులకు బోనస్ ప్రకటిస్తానన్న హామీలు సైతం తుంగలో తొక్కివేశారు. ఇప్పటికైనా పాలక పార్టీలు పట్టుదలకు పోకుండా పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కార్యాచరణకు పూనుకోవాలి. లేనిపక్షంలో ఐక్య రైతాంగ ఉద్యమాలు మరింత ఉదృతమవుతాయి.
- వి.ప్రభాకర్
సెల్ : 94401 51616