Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఉన్నత విద్యలో ప్రతి డిగ్రీ విద్యార్థికి పర్యావరణ పరిరక్షణ, భూమి సమతుల్యం వంటి అంశాలపై అవగాహన ఉండాలనీ, పర్యావరణ శాస్త్రాన్ని ప్రతి విద్యార్థి చదవాలని ఆదేశించడం మంచి పరిణామం. నేటి ఆధునిక కాలంలో పర్యావరణ కాలుష్యం వంటి అంశాలపై ప్రతి విద్యార్థికీ అవగాహన ఉంటే భవిష్యత్ తరతరాలలో పర్యావరణాన్ని, భూమిని కాపాడటానికి సరైన ప్రణాళికలు తయా రుచేసుకునే అవకా శాలుంటాయి. ప్రతి ఒక్కరి నీ చైతన్య పరచడానికి విద్యా పరిశో ధనాంశాలలో కూడా దీనిపై అవగాహన ఉండా లని ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల పర్యావ రణాన్ని, భూ మిని సంరక్షించవచ్చు. రెం డేండ్ల క్రితం విశ్వ విద్యాలయ నిధుల సంఘం ఆదేశానుసారం దేశంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, డిగ్రీలో వివిధ కోర్సుల్లో, సీబీసీఎస్లో భాగంగా పర్యావరణ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాయి. కానీ కేవలం రెండు క్రెడిట్లకు అనుగుణంగా కేవలం నలభై మార్కులకు మాత్రమే ప్రవేశపెట్టారు. దీనివల్ల వివిధ కళాశాలల్లో ఉన్న అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు మాత్రమే పర్యావరణ శాస్త్రాన్ని బోధిస్తున్నారు. మరికొన్ని కళాశాలల్లో దీనిని భోధించకుండా కేవలం కోర్స్ మెటీరియల్ పంపిణీ చేస్తూ విద్యార్థులను నేరుగా పరీక్షలకు సిద్ధం చేస్తూ కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేకమైన విషయ నిపుణులను, అర్హులైన అధ్యాపకులను నియమించకుండా, యూనివర్సిటీల నిబంధనలు పాటించకుండా కాలం వెళ్లదీస్తున్నాయి. వీరిపై ఉన్నత విద్యా మండలి అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ మధ్య విశ్వవిద్యాలయం నిధుల సంఘం విడుదల చేసిన నిబంధనల ప్రకారం పర్యావరణ శాస్త్రాన్ని ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో కంపల్సరీ కోర్సుగా ఆరు నెలల కాలవ్యవధిలో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అందుకే ప్రతి డిగ్రీ ప్రోగ్రాంల కాంబినేషన్లో వంద మార్కులకు అంటే ఐదు క్రెడిట్ల కోర్ సబ్జెక్ట్గా ప్రవేశపెట్టే దిశగా పూర్తి చర్యలు తీసుకోవాలి. ఈ వంద మార్కులు వారి డిగ్రీ తుది మార్కుల జాబితాలో వచ్చే విధంగా చేయాలి. అలా చేస్తేనే అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు సీరియస్గా తీసుకొని చదివే అవకాశముంది. వంద మార్కులకు కచ్చితంగా ఈ సబ్జెక్ట్ని ప్రవేశపెడితేనే విద్యార్థులు పూర్తిస్థాయిలో శ్రద్ద కనబ రిచి వాటిని అవలం భించే అవకాశా లుం టాయి. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలల్లో పర్యావరణ శాస్త్రాన్ని బోధించేందుకు ప్రత్యే కమైన, అర్హులైన అధ్యాప కుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి పోస్టులను నింపాలి. విద్యార్థులు పర్యావరణ శాస్త్రాన్ని కేవలం విద్యాపరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో పర్యావరణ పరిరక్షణకు, వివిధ రకాల కాలుష్యాలను అరికట్టడానికి, అందుకు అనుగుణంగా ప్రజలను చైతన్య పరచడానికి కషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఈ అంశాలను ఉన్నతవి ద్యామండలి పరిగణలోకి తీసుకొని రాబోయే విద్యా సంవత్సరంలో పర్యావరణ శాస్త్రాన్ని పూర్తిస్థాయి సబ్జెక్ట్గా వెంటనే అమలు పరిస్తే మంచి ఫలితాలుంటాయి.
- శ్రవణ్ కుమార్ కందగట్ల
సెల్ : 8639374879