Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీదు వివాదం పై సుప్రింకోర్టు మధ్యవర్తిత్వ కమిటీకి ఆగస్టు వరకు గడువు పొడిగించింది. అయితే ఈ వివాదం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఉన్న వివాదాస్పద స్థలం తమదేనంటూ హిందూ సంస్థలు, సున్నీ వక్ఫ్, బోర్డు నిర్మొహీ అకాడా తమ వాదనలు వినిపిస్తున్నాయి. చరిత్రలోకి వెళితే మొఘల్ చక్రవర్తి బాబర్. క్రీస్తుశకం 1527లో బాబ్రీ మసీదు నిర్మించినట్టుగా భావిస్తున్నారు. అయితే అది హిందువుల ఆరాధ్యదైవం రాముడి జన్మస్థలంగా, అక్కడ రామమందిరాన్ని కూలగొట్టి దానిపైన మసీదు నిర్మించారనీ, కాబట్టి ఆ స్థలం మాకే చెందుతుందనీ హిందూ ధార్మిక సంస్థల వాదన. అయితే చరిత్రలో రికార్డ్ అయిన వివాదం ప్రకారం 1853లో బ్రిటీష్ హయాంలో ఈ విషయమై ఘర్షణలు తలెత్తాయి. 1859లో కూడా ఇలాగే ఘర్షణలు తలెత్తడంతో బ్రిటిష్ ప్రభుత్వం వివాదాస్పద స్థలాన్ని రెండుగా విభజించి కంచె ఏర్పాటు చేసింది. 1885లో మహంత్ రఘు బీర్ దాస్ అనే వ్యక్తి ఫైజాబాద్ జిల్లా కోర్టులో స్థల వివాదంపై కేసు వేశాడు. తర్వాత అనేక చిన్న చిన్న ఘర్షణ వల్ల 1949లో కొంతమంది రాముడు, సీత విగ్రహాలను మసీదులో ప్రతిష్టించారు. ఆ తర్వాత స్థల వివాదంపై ఫైజాబాద్ జిల్లా కోర్టులో నాలుగు కేసులు దాఖలు చేశారు. నిర్మొహ అకాడా, సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు, రామ్ లాల అనే సంస్థలు స్థల వివాదంపై కేసు వాదనలు వినిపిస్తున్నాయి. 1982లోనే విశ్వ హిందూ పరిషత్ రామ జన్మ భూమి ఉద్యమం చేపట్టింది. 1989లో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై ఒక తీర్మానం చేసి ఆమోదించారు. ఫైజాబాద్ సివిల్జడ్జి కె.ఎం.పాండే 1986 ఫిబ్రవరి 1వ తే దీన మందిరంతాళాలు తెరిపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ చర్యతో ఆగ్రహించిన ముస్లింలు అఖిల భారత బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీని ఆగమేఘాలపై స్థాపించారు. రాజీవ్ ప్రభుత్వానికి మసీదు కార్యాచరణ కమిటీకి చర్చలు జరుగుతున్న తరుణంలోనే 1986 నవంబరు 9వ తేదీన వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసుకునేందుకు వీహెచ్పీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో బీజేపీతో సహా హిందూ ధార్మిక సంస్థలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఆ తర్వాత 1989లో బీజేపీ అడుగుపెట్టిన తర్వాత ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది. 1990లో నాటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేశారు. అదే సంవత్సరం అద్వానీ రథయాత్ర దేశవ్యాప్తంగా హిందువులలో ఈ అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది. 1992 డిసెంబర్ 6న దాదాపు లక్షా యాభై వేల మంది కరసేవకులు అయోధ్యలో సమావేశం నుంచి మసీద్ వైపు వెళ్లి కూల్చివేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మత ఘర్షణలు చో టుచేసుకున్నాయి. దాదాపు రెండు వేల మంది ఈ ఘర్షణ ల్లో చనిపోయారు. 1992 డిసెంబర్ 16న బాబ్రీ మసీదు కూల్చివేత ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై విచారించేందుకు లిబర్హాన్ కమిషన్ వేసింది.
2002లో వాజపేయి ప్రభుత్వం హిం దూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ ప్రారంభించింది. అదే సంవత్సరం అ యోధ్యకు వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి చేసి దాన్ని తగులబెట్టిన ఘటనలో 58 మంది చనిపోయారు. దీనికి ప్రతిగా గోద్రా అల్లర్లు జరిగాయి. అందులోనూ వందలాది మంది చనిపోయారు. అయోధ్యలోని రామ మందిరం, బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కరించేందుకు అలహాబాద్ హైకోర్టులో ముగ్గురు జడ్జీల ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన లో ఏడుగురు నేతలపై విచారణ ప్రారంభ మైంది. 2005 జూలైలో ఇస్లామిక్ మిలిటెంట్ వివాదాస్పద భూ భాగంపై దాడి చేశారు. ఈ సంఘటనలో సెక్యూరిటీ ఫోర్స్ ఐదుగురిని హతమార్చింది. 1992 డిసెంబర్ 16న ఏర్పాటుచేసిన లిబర్హాన్ కమిషన్ను పలు ప్రభుత్వాలు 48 సార్లు పొడిగించడంతో భారతదేశ చరిత్రలోనే అతి సుదీర్ఘ కాలం నడిచిన కమిషన్గా ఇది నమోదైంది. సంఘటన జరిగిన 16 సంవత్సరాల తర్వాత తన నివేదికను 2009 జూన్ 30న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు అందజేశారు. ఇందులో బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి పూర్తి విచారణ, అందుకు బాధ్యులైన నేతల పేర్లను ప్రస్తావించారు.
2010 సెప్టెంబర్ 13న అలహాబాద్ హైకోర్టు చారిత్ర క అయోధ్య రామమందిరం -బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుదీర్ఘ తీర్పు ఇస్తూ వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా కేటాయిస్తూ ఒక భాగం రామమందిరం కోసం రెండో భాగం బాబ్రీమసీదు కోసం మూడో భాగం నిర్మొహి అకాడకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సంతప్తి చెందని ఇరువర్గాలు, కొన్ని సంస్థలు వేర్వేరుగా సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లారు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2016లో బాబ్రీ మసీదు కూల్చివేతపై కేసు దాఖలు చేసిన హష్మీమ్ అన్సారీ మరణించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వివిధ సంస్థలు స్థల వివాదంపై 16 పిటీషన్లు దాఖలు చేశాయి. అనేక సుదీర్ఘ వాదనలు పూర్వాపరాలను పరి శీలించి రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఐదు గురు న్యాయమూర్తుల ధర్మాస నం ఇటీవల మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం ది శగా కషి చేయాలని భావించిం ది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముగ్గురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో జస్టిస్ ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, సీనియర్ న్యాయ వాది శ్రీరాం పంచ్లు సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి 8 వారాల సమయమిస్తూ వారం రోజుల్లోనే ఈ కమిటీ తన పనిని ప్రారంభించాలని, ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. ఒకవేళ అవసరమైతే మరి కొందర్ని కమిటీలో చేర్చుకునే వెసులుబాటు కల్పించింది. మధ్య వర్తిత్వం కమిటీకి అవసరమైన అన్ని సౌకర్యాలనూ ఫైజాబాద్లో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కల్పించాలని ఆదేశించింది. మధ్యవర్తులు అవసరమైతే న్యాయ సహాయం కూడా తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ కోర్టు పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా సాగుతుందని జస్టిస్ రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు. అంతేకాదు, మధ్వవర్తిత్వం ప్రక్రియను మీడియాకు వెల్లడించడం కూడా కుదరదని ఆదేశాలు జారీచేసింది. అలాగే, మరో నాలుగు వారాల్లో పిటిషనర్లు, వాద ప్రతి వాదులతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఫైజాబాద్ కేంద్రంగా ఈ ప్రక్రియ మొత్తాన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ధర్మాసనం సూచించింది. ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా?అంటే ఇరు పక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటే సమస్య పరిష్కరించవచ్చు! అలా కాకుండా ఎవరి వాదనలో వారు ఉంటే రామమందిర -బాబ్రీ మసీదు వివాదం ఎప్పటికీ పరిష్కారం కాదు. మధ్యవర్తిత్వం సఫలం కాని పక్షంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది.
- పొన్నం రవీందర్
సెల్ : 9866267880