Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రాజకీయ క్రీడకు ఊతమియ్యబట్టే. అవినీతి కుంభకోణాల్లో ఇరుకున్న వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ తీర్థంబోస్తూ కాషాయమయం చేసేకుట్రకు పూనుకుందని రాజకీయ విశ్లేషకులు అనబట్టిరి. టీడీపీకి చెందిన ఎంపీలను కమలదళంలో చేర్చుకుని రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సైతం తాను గత నెల రోజులుగా ప్రవచించిన ప్రవచనాలకు తిలోదకాలిచ్చారంటూ ప్రతిపక్షాలు ఉతికేసాయి. నీతులు పరులకు చెప్పడానికి గానీ తాము పాటించడానికి కాదంటూ వ్యవహరిస్తున్న బీజేపీకి కీలెరిగి వాతపెట్టే రోజు వస్తుందని అని కూడా సెలవిస్తున్నారు ఆ కమలదళంలోని సీనియర్ నేతలు !
- బి.బసవపున్నయ్య