Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సభ్య సమాజంలో తలదించుకునేలా హన్మకొండలో జరిగిన ఘటనతో రాష్ట్రం అట్టుడికి పోతోంది. ఇంత దారుణం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. ఈ అత్యాచారాల కు అంతం లేదా...
ఇటీవల మీడియాలో వార్తలు పరిశీలిస్తే చెన్నైలో పదకొండేండ్ల దివ్యాంగు రాలు కామాంధుల చేతిలో చిత్ర వధకు గురైన సంఘటన. మనుషుల మధ్యన ఉంటున్న 22 మంది రాక్షసులు, క్రూరమృగాలు, కామ పిశాచాలు, పశువులలాగా అభం శుభం తెలియని ఒక దివ్యాం గురాలిపై అత్యచారం. చీ చీ ఈ పాడు సమాజంలో ఎందుకు పుట్టాను అని రోధిస్తున్నా ఆ చిన్నారి బాల్యాన్ని తిరిగి ఇచ్చేదెవరూ.....ఉత్తరాఖండ్లో ఎనిమిదేండ్ల చిన్నారిపై అశ్లీల వీడియోలకు బాని సలుగా మారిన మైనర్లు అత్యచారమా... సభ్యస మాజం తలదించుకొనే పరిస్థితి దాపురించింది. చిన్నారులపై లైంగిక దాడుల సంఘటనలు, పిల్లల శరీర భాగాలతో వికృత చేష్టలతో సమాజంలోని చీ డ పురుగుల సంఘటనలు కోకొల్లలుగా పెరిగిపోతు న్నాయి. సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థి తులలో మనమున్నాం. ఒక యువకుడు 6ఏండ్ల చిన్నారిని చాక్లెట్ ఇస్తానని చెప్పి నిర్జల ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా, క్రూరంగా చిత్ర హింసలకు గురిచేసి అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘట న, వావివరుసలు మరిచి చిన్ని హృదయాలను చిదిమేస్తున్నారు, పసి మనుషులను బలి చేస్తున్నా రు, తమ కామవాంచ చిన్నారులపై వికృత స్థాయి లో విజంభిస్తున్న మానవ మృగాలను ఏం చేయాలి.
మనిషి జీవితంలో బాల్యం అనేది వెలకట్టలేని ఒక విలువైన దశ. పిల్లలు పెద్ద వారికంటే సులువుగా మోసానికి, దాడికి, దోపిడికి, వేధింపులకు గురవుతారు. ప్రతి పిల్లవాడు ఎవరికి వారే ప్రత్యేకం. పిల్లలను జాతీయ సంపదగా పరిగణించాలి. బాలలు కూడా మనుషులే, మానవ హక్కులన్నీ వారికి వర్తిస్తాయి. ప్రతి బిడ్డ గౌరవంగా, సామరస్య వాతావరణంలో పెరగాలి. పిల్లల రక్షణ బాధ్యత మనందరిదిగా గుర్తించాలి.
ప్రస్తుత తరుణంలో మనిషి కాలంతోపాటు పోటీ పడుతూ సాంకేతికంగా అభివృద్ధిలో దూసుకెళ్తూ ప్రపంచాన దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసినా కొన్ని మానవ కామ పిశాచాల వల్ల దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. సమాజంలోని మనిషి మానవతా విలువలను కాపాడటంలో దిగజారిపోతున్నాడు. తమ కామ వాంచ తీర్చుకోవడానికి మహిళలపై వికృత స్థాయి లో విజంభిస్తూ వికృత రూపంగా మారుతున్న మానవ మృగాలను ఏం చేయాలి. దేశంలో బలమై న చట్టాలు ఉన్నప్పటికీ మానవ మృగాలు చిగురు టాకులను చిదిమేస్తూ వికృత ఆనందం పొందుతు న్నారు. మధుర, నిర్భయ, అసిఫాలపై జరిగిన లైంగిక దాడులు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాడులు భవిష్యత్తులో జరగకుండా కఠినంగా వ్యవహరించాల్సిందే.
లైంగిక దాడులకు గురైన బాలలు పెరిగి పెద్ద అయిన తర్వాత వారి మనస్థత్వంలో, మానసిక ప్ర వర్తనలో చాల మార్పులు చోటుచేసుకునే ప్రమాద ముంది. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైన వారు సమాజంపై ఏహ్యభావం పెంచుకొని భవిష్య త్తులో ఉన్మాదులుగా, శాడిస్టులుగా, తీవ్రవాదులుగా మారే ప్రమాదం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే దేశ మనుగడకు ముప్పు. ఇలాంటి సంఘటనలు భవిష్య త్తులో పునరావృతం కాకుండా ఉండడానికి చట్టాల పై పూర్తి అవగాహన కల్పించాలి. పోక్సో చట్టం అమలులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. గ్రామగ్రామాన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. సామాజిక చైతన్యానికి అందరం చేయిచేయి కలుపుదాం, చిన్నారులపై, మహిళలపై లైంగిక వేధింపులను నేరాలను తరిమికొడదాం.
- డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి
సెల్ : 9703935321