Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని లక్షల కోట్ల పెట్టు బడి కలిగిన సం పన్నుడైనా అన్నమో, రొట్టెనో తిని బతకాల్సిందే. రోజు మనం ఆహారంగా తింటున్నదంతా రైతులు, కార్మికులు పొలాల్లో సాగు చేస్తున్న ఫలితం వల్లనే. అలాంటి వ్యవసాయ రంగంలోకి పెట్టుబడిదారీ విధానం వచ్చి ఏ విధమైన పరిణామాలకు దారి తీయిస్తుందో ఇప్పుడు చూద్దాం.
పెట్టుబడిదారీ వ్యవస్థకు పూర్వం ఉన్న భూ స్వామ్య వ్యవస్థలో ( ఫ్యూడల్ వ్యవస్థ) భారీ పరిశ్రమ లేమీ లేవు. భూమి సొంత ఆస్తిగా గల భూస్వాము లు, జమీందారులు, ఆ భూమిపై కష్టించి పని చేసి పంటలు పండించే కౌలు రైతులు, కా ర్మికులు ఉంటారు. భూస్వామ్య వ్యవస్థలో భూమి మానవులపై అన్యమైన శక్తిగా ఆధిపత్యం వహిస్తుంది. భూస్వామ్యంలో భూస్వామే భూమికి రాజులా కనపడతా డు. ఆయన ఆధిపత్యం కూడా భూమికి చెందుతుంది. ఫలానా దొరగారి భూమి అని భూమి పిలిపించుకుంటుంది. ఆయ నకున్న న్యాయపరమైన హక్కులు, రాజకీ యాధికారం అన్నీ అనుభవిస్తుంది. అది దొరగారి శరీరం వలె కనపడుతుంది. భూమిపై ఆధారపడి బతికే వారికది పితృభూమిగా కనపడుతుంది. ఆ భూమిపై పని చేసే కూలీలు రోజు కూలీలు కాదు. వారు భూస్వామి ఆస్తిలో భాగమవుతారు. వారి సం బంధాలలో గౌరవం, నమ్రత, శ్రద్ధలు కలిగి ఉంటా యి. భూస్వామి కేవలం లాభం కోసమే ప్రయత్నించే వాడు కాదు. తన దగ్గర ఉన్నది అనుభవించేవాడు. కౌలుదార్లకు, కార్మికులకు కొంత వదిలివేస్తాడు. ఇది భూస్వామ్య కులీనులకథ. దీన్ని నిర్మూలించడమే పెట్టుబడి విధాన లక్ష్యం. భూమిని సరుకుగా మార్చా లి. ఆస్తి యొక్క యజమాని పాలన నగమైన వ్యక్తిగ త ఆస్తి పరిపాలనగా మారాలి. పూర్తి స్థాయి ఆర్థిక సంబంధాలు నెలకొల్పబడాలి. వ్యవసాయం లాభాల కోసమే కొనసాగించాలి. ఇదీ పెట్టుబడి కోరుకునేది.
పెట్టుబడిదారీ విధానంతో, భూస్వామిక విధానంలో గృహ పరిశ్రమలుగా, చేతి వృత్తులుగా ఉన్నవి పెద్దపెద్ద పరిశ్రమలుగా అభివృద్ధి చెందు తాయి. దీంతో గ్రామాలకు, పట్టణాలకు అఖాతం ఏర్పడుతుంది. పరిశ్రమలు నూతన టెక్నాలజీతో పెరిగి అభివృద్ధి అవుతాయి. వ్యవసాయం వెనుకబడి ఉంటుంది. చాలా నిస్సారయుతంగా వ్యవసాయం దిగజారిపోతుంది. అప్పుడు పెట్టుబడిదారీ విధానం భూస్వామిక విధాన వ్యవసాయాన్ని బయటకు లాగుతుంది. అంటే భూమి సొంత ఆస్తిగాగల సంబంధాలనేమీ మార్చదు. భూస్వామిక పెత్తందారీ సంకెళ్ల నుండి తప్పిస్తుంది. కానీ దోపిడీ నవీనమైన రీతిలో కొనసాగుతోంది. పరిశ్రమలకు, వ్యవసాయా నికి మధ్య వైరుధ్యాలను పోగొట్టదు. సరికదా మరింత పెంచుతుంది. వ్యవసాయానికి మూలాధా రం భూమి. ఇది పెద్ద పెద్ద విస్తీర్ణంలో స్వయంగా సాగు చేయని భూస్వాముల చేతుల్లో ఉంటుంది. వీరు భూమిని ఇతరులకు కౌలుకు భూమినిచ్చి సాగు చేయిస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో కౌలు రైతు నుండి వసూలు చేసే కప్పాన్ని ''భూమి కౌలు శిస్తు'' అంటారు. ఈ కౌలు శిస్తు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నిరంకుశ కౌలు శిస్తు, రెండు తారతమ్య కౌలు శిస్తు. ఈ రెండింటికి మూలం వ్యవసాయ కార్మికులు సృష్టించే అదనపు విలువనే.
భూములలో కొన్ని సారవంతమైనవి, కొన్ని పర్ర నేలలు. వీటి పంటలలో చాలా భేదం ఉంటుంది. కొన్ని భూములకు కాల్వలు, నీటి సదుపాయం ఉంటుంది. పట్టణాలకు దగ్గరగా పంట రవాణాకు రోడ్ల సౌకర్యం ఉంటాయి. చాలా చౌకగా మార్కె ట్టుకు చేర్చగల వీలుంటుంది. ఇలా భూములలో తారతమ్యం ఉండటం వలన ఈ భూములపై చెల్లిం చే కౌలు శిస్తులో కూడా తారతమ్యం ఉంటుంది. అయితే నిస్సారమైన, బీడు భూములు, సౌకర్యాలు లేని భూములు కూడా సాగు చేయబడతాయి. నిస్సార భూములపై చెల్లించే కౌలు శిస్తును ప్రమాణంగా తీసుకుని సారవంతమైన భూముల కౌలు శిస్తు నిర్ణయిస్తారు. అందుకే ఈ శిస్తును తారతమ్య శిస్తు అంటారు. మామూలు భూములకు చెల్లించేది నిరంకుశ కౌలు శిస్తు అంటారు.
పెట్టుబడిదారీ విధానం వ్యవసాయ రంగంలోకి వచ్చాక మూడు రకాలైన వర్గ సంబంధాలు ఏర్పడతాయి. 1.భూ యజమానులు, 2.పెట్టుబడిదారీ కౌలుదారులు, 3.వ్యవసాయ కార్మికులు. భూస్వామి దగ్గర కౌలుకు తీసుకున్న కౌలుదారు, కొంత పెట్టుబడి పెట్టి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, దున్నే పరికరాలు, చిన్నచిన్న యంత్రాలు సమకూర్చుకొని, కార్మికుల చేత వ్యవసాయం చేయిస్తాడు. ఇందులో కార్మికులపై పెట్టినది ఆస్థిర పెట్టుబడి. మిగతావి స్థిరపెట్టుబడి. వ్యవసాయ కార్మికులు అదనపు శ్రమ చేసి అదనపు విలువను సృష్టిస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థలోకంటే లాభం రేటు ఇందులో అధికంగా ఉంటుంది. ఉదాహరణకు పరిశ్రమలో స్థిర పెట్టుబడి 80, అస్థిర పెట్టుబడి (వేతనాలు) 20, అదనపు విలువ 20. అప్పుడు సరుకు విలువ 120. లాభం రేటు 20శాతం. వ్యవసాయంలో అయితే, స్థిరపెట్టుబడి 60, అస్థిర పెట్టుబడి 40, అదనపు విలువ 40 పంట మొత్తం విలువ 140. లాభం 40. ఇందులో అదనపు లాభం 20. ఇది భూస్వామికి కౌలు శిస్తుగా చెల్లించేది. మిగతా 20 కౌలుదారు దక్కేది. ఇది పెట్టుబడిదారీ వ్యవసాయ విధానం.
కానీ అన్ని చోట్లా ఇంత సూటిగా జరగదు. ఒక్కొక్కప్పుడు భూస్వామి, తన భూమిని కౌలుకు ఇవ్వకుండా స్వయంగా పెట్టుబడి పెట్టి కూలీలతో సాగు చేయిస్తాడు. అప్పుడు కౌలు శిస్తూ, పెట్టుబడి లాభం రెండూ భూస్వామికే దక్కుతుంది. కొన్ని సార్లు కౌలు రైతులు భూస్వామి దగ్గర భూమి కౌలుకు తీసుకుని తానే స్వయంగా సాగు చేస్తాడు. రైతు దగ్గర భూమి లేని కారణంగా భూస్వామి షరతులకు లోబడి కౌలుకు తీసుకుంటాడు. భూస్వామి ధాన్య రూపంలోనూ, వెట్టి చాకిరి రూపంలోనూ ధన రూపంలోనూ కౌలు శిస్తు గుంజుతాడు. ఇక్కడ అదనపు విలువ కౌలు రైతును దోచుకోవడం ద్వారా ఏర్పడుతున్నది. పెట్టుబడి దారీ విధానం అభివృద్ధి చెందడంతో నగరాలలో సంపాదించిన పెట్టుబడితో గ్రామీణ ప్రాంతాల వ్యవసాయంలో పెట్టుబడి దారుడు ప్రవేశిస్తాడు. కేవలం ఒక సరుకుగా ఉత్పాదితాన్ని సృష్టిస్తాడు.
పెట్టుబడిదారీ కౌలుదారీ రైతు భూస్వామికి 'వాస్తవంగా నేలను దున్నే వానికి' మధ్య అడుగు పెట్టినప్పుడు పాత గ్రామీణ ఉత్పత్తి విధానం నుంచి తలెత్తిన సంబంధాలన్నీ చిన్నభిన్నమవుతాయి. కౌలు డబ్బు రూపం ధరించగానే రైతుకు భూస్వామికి మధ్య సంబంధం కేవలం ఆర్థిక సంబంధంగా మారిపోతుంది. అప్పుడు పాత భూస్వామిక వ్యవస్థలోని రైతులు వ్యవసాయ కార్మికులుగా రూపాంతరం చెందుతారు.
అయితే మన దేశంలోని వ్యవసాయ రంగం పూర్వ భూస్వామిక విధానం నుండి కొనసాగింపుగా పెట్టుబడిదారీ వ్యవసాయ విధానానికి మార్పు చెందుతూ ఉన్నది. మన గ్రామీణ భూస్వాములు, ధనిక రైతులు స్వయంగా శ్రమలో ఏ మాత్రం పాల్గొనరు. వ్యవసాయం మొత్తం కార్మికులు, జీతగాళ్ల శ్రమపై ఆధారడి నడుస్తుంది. పొలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందజేసి, సొంత యంత్రాలతో కూలీల చేత వ్యవసాయం సాగిస్తారు. కూలీల వేతనం గతంలో ధాన్య రూపంలో ఉండేది. ఇప్పుడు వేతనాలు డబ్బు రూపంలో చెల్లిస్తున్నారు. అంతేకాక వాణిజ్య పంటలే అత్యధికంగా పండిస్తున్నారు.
ఇక పెట్టుబడిదారీ వ్యవస్థలో భూమిని కొనడం అమ్మడం చేస్తారు. అప్పుడు భూమి ధరను ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. ఉదాహరణకు భూస్వామి కౌలు రైతుకు భూమిని కౌలుకు ఇస్తే సంవత్సరానికి రూ.5వేలు వస్తుందనుకోండి. అంటే భూస్వామికి తనకున్న భూమి వల్ల సాలుకు రూ.5వేల ఆదాయం వస్తుంది. అయితే ఆ భూమిని అమ్మితే వచ్చిన డబ్బును బ్యాంకులో వేసుకున్నా సంవత్సరానికి ఐదు వేలు రావాలి. అంటే బ్యాంకు రేటు 4శాతం అనుకుంటే ఆ భూమిని లక్షా ఇరవై ఐదువేలకు అమ్ముతాడు. వాటిని బ్యాంకులో వేస్తే ఐదు వేల వడ్డీ రూపంలో సంవత్సరానికి వస్తుంది. కాబట్టి భూమి ధర రూ.1,25000.
మనం ఇంతకుముందే చర్చించినట్టు అసలు భూమికి స్వతహాగా విలువ లేదు. ఎందుకంటే భూమి మానవ శ్రమతో సృష్టించబడినది కాదు. ప్రకృతి సంపద మాత్రమే. అయితే భూమిపై కాల్వలు తవ్వబడి, కట్టడాలు, చదును చేసి వ్యవసాయానికి యోగ్యంగా చేయడం మొదలైన మానవ శ్రమ వల్ల విలువ ఏర్పడుతుంది. భూమి యొక్క వెల, ఆ భూమి సాలీనా తెచ్చే ఆదాయాన్ని బట్టి ఉంటుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో భూమి కౌలు శిస్తు కూడా పెరుగుతూ పోతుంటుంది. ఎక్కువ భూమి సాగులోకి తెస్తారు. నీటి పారుదల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. యంత్రాల వాడకం పెరుగుతుంది. ఎరువులు, పురుగు మందులు వాడకం పెరిగి ఉత్పత్తి పెరుగుతుంది. ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఆ భూమికి చెల్లించే కౌలు శిస్తూ పెరుగుతుంది. ఉత్పత్తి శక్తిని పెంచిన కొద్దీ కౌలు రైతు నష్టపోతుంటాడు. సమాజంలో ప్రతి అభివృద్ధి పెద్ద భూస్వామిక లాభం. చిన్న రైతుకు నష్టం.
కౌలు శిస్తు పెరగటం వ్యవసాయానికి ఆటంకమే కానీ వ్యవసాయ సంక్షోభానికి అనేక ఇతర కారణాలూ ఉన్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో సరుకుల ఉత్పత్తిలాగానే ఇందులో కూడా ఒక ప్రణాళిక, క్రమం లేని ఉత్పత్తి జరుగుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు పండించాలో కాకుండా కేవలం వ్యాపార లాభాలు తెచ్చే పంటలనే విపరీతంగా ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి పెంచడం కోసం ఎరువులు, పురుగు మందులు, రసాయనాలు విపరీతంగా వాడటం జన్యు మార్పిడి విత్తనాలు వాడటం వలన భూమి సారంపాడైపోతుంది. పర్యావరణం ధ్వంసమవుతుంది. దీని ప్రభావం కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులపై పడుతుంది. ఇక కౌలు రైతులు, చిన్న రైతులు పెట్టుబడులు పెట్టడం కోసం అప్పులు చేస్తారు. వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడతారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపోతారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మార్కెట్ వ్యవస్థ, రవాణా, స్టోరేజీ, ఇవన్నీ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటుంది. బహుళజాతి సంస్థలు, గుత్త పెట్టుబడిదారుల చేతుల్లో ఉంటాయి. రైతులకిచ్చే సబ్సిడీలు రోజురోజుకు ప్రభుత్వాలు తగ్గిస్తాయి. కానీ పరిశ్రమాధిపతులకు సబ్సిడీలు పెంచుతాయి. అప్పు వసూలు చేయడానికి బ్యాంకులు, వడ్డీదారులు రైతులపై వత్తిడి పెంచి అవమానిస్తారు. భూమి సంబంధాలుగల లక్షలాది మంది రైతులు పరువుతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ వేల కోట్లు ఎగ్గొట్టిన పెట్టుబడిదారులు మాత్రం హాయిగా తప్పించుకు బతుకుతున్నారు. అందువల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభాలు పెరుగుతున్నవి. పెట్టుబడిదారీ అనుకూల ప్రభుత్వాలు సామాన్య రైతులు, కౌలుదారులు ప్రయోజనాలకు ఏమాత్రం పని చేయవు. మన దేశంలో యాభైశాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం కేవలం పది శాతం నిధులనే కేటాయిస్తున్నది. దేశ ప్రజలకు అవసరమైన తిండి గింజల ఉత్పత్తి, తిండి గింజల వినియోగం తగ్గుతున్నది. విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం పెరుగుతున్నది. ప్రజల ఆకలి తీర్చడానికి కావాల్సిన ఉత్పత్తులు గోదాముల్లో ఉన్నా, కోట్లాది ప్రజల ఆకలితో, అర్ధాకలితో బతుకులీడుస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. పెట్టుబడి అనేది అది ఏ రంగంలో ఉన్నా దాని అంతర్గత వైరుధ్య లక్షణాన్ని చూపిస్తూనే ఉంటుంది. వ్యవసాయ రంగంలోనూ అది నగంగా ప్రతిఫలిస్తున్నది.
- ఆనందాచారి
సెల్ : 9948787660