Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అహనా పెళ్లంట..' చిత్రంలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి చూపించినట్టు... బీజేపీ అధినాయకత్వం కాంగ్రెస్, టీడీపీ నేతలను చూపించి మరింతమంది నేతలు వస్తున్నారహౌ..! అని రోజూ సుప్రభాతం పెడ్తోంది. చిన్న చిన్న నాయకులను చూపిస్తూ... పెద్ద పెద్ద నాయకులంతా వస్తున్నారంటూ పొద్దునలేస్తే దండోరా వేసి చెబుతున్నది. నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన ఆనందంలో బీజేపీ నేతలకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నది. తెలంగాణ మొత్తం తమ చేతుల్లోకి రాబోతున్నట్టు కలలు కంటున్నది. కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నది. అవసరమైతే డబ్బులు... అందుకు లొంగకపోతే అక్రమ కేసులు బనాయిస్తూ తమదారికి తెచ్చుకుని పార్టీని బలోపేతం చేసి, 2023 ఎన్నికల్లో అధికార పీఠమెక్కాలని పన్నాగాలు పన్నుతున్నది. ఇలాంటి ఆలోచనతోనే ముందస్తు ఎన్నికల్లో పార్టీ గెలిచినట్టు, మెజార్టీ వచ్చినట్టు.. మంత్రి పదవులు కూడా పంచుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టు బీజేపీ కలల సీన్ రివర్సయింది. ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరే మిగిలారు. అయినప్పటికీ ఇతర పార్టీ నాయకులు వస్తున్నారంటూ బీజేపీ గోబెల్ ప్రచారం మాత్రం మానలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నేతలు వస్తున్నారని ఎంతో ఆశతో ఉన్నది. అయితే ఎవరెవరూ వస్తారో, ఏమి జరుగుతుందో చూద్దాం.."
- గుడిగ రఘు