Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫారెస్ట్ అధికారుల మీద జరిగిన దాడికి అసలు బాధ్యులు ఎవరు? సమస్య ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆలోచించాల్సిన తరుణమిది... ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజల మీద ఆధిపత్యం చేలాయిస్తూ అడవులను కబ్జా చేసేది ఎవ రు? ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల మీద ముమ్మాటికీ గిరిజనులకే హక్కు అని ఎన్నో చట్టాలు ఘోషిస్తున్నా ప్రభుత్వాల విధానాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉ న్నాయి. 1952 జాతీయ అటవీ చట్టం ప్రకారం మొ త్తం భూభాగంలో 33శాతం అటవీ ప్రాంతం ఉండా లి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం ప్రస్తుతం 27,214 చ.కి.మీ. మాత్రమే ఉంది. ఇది 24.28 శాతం మాత్రమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం గడిచిన కొన్నేండ్లలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 2.02 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం కోల్పోయాం. పారిశ్రామికీకరణలో భాగంగా వేల హెక్టార్ల అడ వులు అంతరించిపోతున్నాయి. గుట్టలు మాయమవుతున్నాయి ఫలితంగా వ ర్షం నీరు నిల్వ ఉండే సదుపాయం లేక అడవులు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయ వివాదాలు అ టు గిరిజనులకు ఇటు ప్రభుత్వాలకు మధ్య అగ్గి రాజేస్తున్నాయి. పోడు వ్యవ సాయం చేస్తూ గిరిజనులు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ప్రభుత్వం కన్నెర్ర జేస్తుంటే... సాంప్రదాయకంగా మాకొచ్చిన అటవీ హక్కుల మీద మీ పెత్తనం ఏంటని గిరిజన ప్రజలు తిరగబడటం నిత్యం చూస్తూనే ఉన్నాం. అసలు పోడు వ్యవసాయం అంటే ఏంటి ఓసారి చూద్దాం... పోడు వ్యవసా యానికి దేశంలో అనేక పేర్లు ఉన్నవి. తెలంగాణ రాష్ట్రంలో పోడు అంటే అడవిని నరికి వేసి భూమిని చదును చేసి గిరిజనులు పంటలు పండించుకుని జీవనం సాగిస్తారు. భూసారం తగ్గిన తరువాత చదును చేసిన ఆ భూమిని వదిలేసి మరోచోట అడవిని నరికేసి మళ్లీ భూమిని చదును చేసి పంటలు పండించుకునే విధానాన్ని పోడు వ్యవసాయం అంటారు. వాస్తవానికి పారిశ్రామికీకరణ వల్ల జరిగే అటవీ నష్టం కన్నా పోడు వ్యవసాయం వల్ల జరిగే అటవీ నష్టం తక్కువ.. ఎప్పుడైతే ఏజెన్సీ ప్రాంతాల్లోకి గిరిజనేతరుల వలసలు పెరిగాయో అప్పటి నుండి గిరిజన హక్కులు కాలరాస్తూ వచ్చారు. మైదాన ప్రాంతాల్లో ఉండే నాన్ ఏజెన్సీ గిరిజనులు, ఇతర వర్గాల ప్రజలు రాజకీయ పలుకుబడితో దొడ్డి దారిన ఏజెన్సీ హక్కు పత్రాలు సంపాదించుకుని గిరిజన భూములను మెల్లిమెల్లిగా అక్రమించడం వాళ్లను ఎదిరించే ధైర్యం లేక ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు ఇతర అటవీ ప్రాంతాలకు వలసలు వెళ్లి అక్కడి అడవులను నరకడం, వ్యవసాయం చేయడం నిత్యకృత్యమైంది. ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపద వేగంగా పడిపోయింది. గిరిజనేతరుల ఆధిపత్యం ఒకవైపు ప్రజా ప్రతినిధుల అటవీ భూముల కబ్జాలు మరో వైపు.. ఈ సమస్యల వల్ల నిత్యం తెలంగాణ గిరిజన జాతి నలిగిపోయింది.
అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించే ఉద్దేశంతో గతంలోని ప్రభుత్వం 1/70 చట్టం ద్వారా ఆదివాసుల భూములు కొనరాదు, అమ్మరాదు అని చట్టం చేసినా గిరిజనేతరుల అరాచకాలు కొనసాగుతూ వచ్చాయి. అమాయక గిరిజన ప్రజలకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి గిరిజనుల ద్వారా ఆ అటవీ భూముల్లో వ్యవసాయం చేయించి పండిన పంటలను ఆదివాసులు తీసుకున్న అప్పుల కింద దోచుకు తిన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసుల స్వయం పాలనలో గ్రామ సభలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ 1996 పంచాయతీ రాజ్ గిరిజన ప్రాంతాల విస్తరణ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. 15ఏండ్ల తర్వాత ఇటీవల ప్రభుత్వం దాని అమలుకు నిబంధనలు రూపొందించడంలోనే ఆదివాసుల హక్కుల అధికారాలను పంచాయతీలకు, మండల పరిషత్తులకూ కట్టబెట్టింది. తద్వారా ఆదివాసుల అటవీభూములు మరింత అన్యక్రాంతానికి గురయ్యాయి. పాలకులు తీసుకొచ్చిన ఆదివాసీ హక్కుల చట్టం వీరికి అదనంగా హక్కులు కల్పించకపోగా, సాంప్రదాయకంగా అడవిపై సంక్రమించిన హక్కులను హరించివేయటానికే మరోరూపంలో పూనుకున్నది. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 5 ఎకరాల నిర్దిష్ఠ, నిర్ణీత అటవీ భూమిపై ప్రభుత్వ పట్టానిచ్చి, వారిని శాశ్వతంగా అక్కడివరకే కట్టడి చేయబూనుకోవడం ఈచట్టం అసలు ఉద్దేశ్యం. ఈ చట్టం వల్ల గిరిజనుల అటవీ హక్కులు ఒక స్థాయి వరకు కట్టడి చేయబడి గిరిజనేతరులకు రాజకీయ నాయకులకు ఈ చట్టం ఒక వరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలంటే గిరిజన అటవీ భూముల మీద గిరిజనులకే పూర్తి స్థాయి హక్కులు కల్పించి అన్యక్రాంతానికి గురైన గిరిజన అటవీ భూములను తిరిగి రికవరీ చేయాలి. దొడ్డి దారిలో రాజకీయ పలుకుబడితో గిరిజన భూములు అక్రమిస్తున్న వారిపై ప్రభుత్వం చిత్త శుద్దితో కఠిన చర్యలు తీసుకోవాలి
- సార్ల శ్రీనివాస్
సెల్: 7793941842