Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చాక భారత్ ఎదుర్కొంటు న్న అతి ప్రధాన సమస్యల్లో కాలుష్య పెరుగుదల అత్యంత కీలకమైంది. పర్యావరణం పరిరక్షించుకోవాలని చి న్ననాడు పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ, ఇప్పటికీ అది ఒక నినాదంగా మిగిలిపోయింది తప్పా, ఆచరణకు నోచుకోలేదంటే సత్యదూరం కాదు. మన పరిసరాలంతా కాలుష్యమయ వుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, కాదేదీ కాలుష్యానికి అనర్హం అన్నట్టు పరిస్థితి తయారైంది. ఒకానొక సమయంలో కేవలం పారి శ్రామిక ప్రాంతాలకే పరిమితమైన కాలుష్యం, నేడు సార్వ జనీనమైంది. కాలుష్యం కేవలం ఒక వనరుకే పరిమితం కా కుండా, పంచభూతాలన్నీ కలుషితమయ్యాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలకంటే, మానవాళి ఒక సాంకేతికత తీసుకొస్తున్న డబ్బు దాసోహంలో తమ జీవన విధానంలో మార్పులు లేకుండా పయనం సాగి స్తున్నది. ధ్వని, నీరు, భూమి, ఆకాశంతోపాటు వాయు కాలు ష్యం విపరీతంగా పెరుగుతున్నది. భూమి ఉష్ణోగ్రత పెరగ డానికి గల కారణాలలో వాయు కాలుష్యం పాత్ర అధిక మైం దని స్పష్టంగా చెప్పవచ్చు. అయినా, దాని పట్ల పాలకులకు కనీస శ్రద్ధ లేకపోవడం ఆందోళనకరం. హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, పడిశం రావడానికి గాలిలో ఉన్న దుమ్ము, ధూళితోపాటు వాహనాల నుంచి వెలు వడే నత్ర జని, కర్బన వాయువులు కారణమని వైద్య నిపుణు లు, పర్యా వరణవేత్తలు ఘోషిస్తున్నారు. ఇటీవల కాలంలో క్యాన్సర్ కూడా సాధారణం కావడానికి ప్రాణ వాయువుతో పాటు మనం పీలుస్తున్న ఇతర క్యాన్సర్ కారక వాయువులూ కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, రాష్ట్ర పాలకులకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు.
ముఖ్యంగా పట్టణ పేదలు, మున్సిపల్ కార్మికులు, అవ గాహన లేని పౌరులు, అధికారులు తదితరులు చెత్తను తగ లపెట్టడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. చివరకు మున్సిపల్ అధికారులు సైతం రోజూ వచ్చే టన్నుల కొద్దీ చెత్తను తగలపెట్టడమే పరిష్కారంగా భావించి జవహర్ నగర్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వచ్చే విద్యుత్కంటే, ఖర్చయ్యే విద్యుత్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్లాంట్ నుంచి రకరకాల విష వాయువులు వెలువడి ప్రజారోగ్యం మీద దీర్ఘ కాల ప్రభావం పడుతుంది. చెత్త తయారు కాకుండా విధానాలు, ప్రక్రియల మీద దృష్టి పెట్టకుండా, 'సులువైన, ప్రమాదకరమైన పరిష్కా రాలు చేపట్టడం శ్రేయస్కరం కాదని సర్కారు తెలుసుకోవాల్సి ఉంది. హైదరాబాదులో జరుగుతున్న ఈ తంతు తెలంగాణ లో ఇతర పట్టణాలు, నగరాలు, పల్లెలకు కూడా పాకింది. 'చెత్తను పోగు చేయడం, తగులపెట్టడం' ఒక సమాజహిత ప్రక్రియగా చేపడుతున్న వైనం తెలంగాణ వ్యాప్తంగా కనప డుతోంది. దీని వలన విష వాయువుల ఉత్పత్తి పెరిగి పెద్ద లు, పిల్లలు కూడా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇం టి నుంచే బయటకు వచ్చే చెత్త పరిమా ణం తగ్గించాలి. ఎ క్కువగా వచ్చే తడి చెత్తను ఎరువుగా స్థానికంగానే మార్చుకో వాలి. మిగతా వాటిని, ఒక దగ్గరికి చేర్చి పునవినియో గంలోకి తీసుకురావాలి. చెత్తను ఎట్టి పరిస్థితులలోను కాల్చ రాదు. గాలి కాలుష్యం పెరగటంలో రవాణా రంగం పాత్ర చాలా ఎక్కువగా ఉంది. జాతీయ రహదార్లు, చిన్న పట్టణా లు, పెద్ద ఊర్లు, ఇతర రోడ్లపైన వాహనాల సంఖ్య పెరగ డంతో గాలి కాలుష్యం పెరుగుతున్నది. హైదరాబాద్ నగరం లో 2005 నుంచి 2016 మధ్య వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. జనాభా కంటే వాహనాల పెరుగుదలే ఎ క్కువగా ఉందని తేలడం గమనార్హం. అధికారిక గణాంకాల ప్రకారం హైదరాబాద్ జిల్లా పరిధిలో 2014 మార్చి నాటికి 21.75 లక్షల వాహనాలుండగా.. ఆ సంఖ్య 2018 మార్చి నాటికి 29.09 లక్షలకు చేరుకుంది. ఇక గ్రేటర్వ్యాప్తంగా తీసుకుంటే 50 లక్షల మార్కును దాటింది. ఇతర జిల్లాలకు చెందిన వాహనాలతో కలుపుకొంటే ఆ సంఖ్య 60 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీనితో కొన్ని ప్రాంతాల్లో రద్దీ విపరీతం. గాలి కాలుష్యం పెరుగు తున్నది. రవాణా రంగం వలన వచ్చే వాయుకాలుష్యం తగ్గాలంటే వాహనాల ఇంధనంలో మార్పులు తీసుకురావాలి. డిజిల్, పెట్రోల్ ఇంధనం కంటే విద్యుత్ వాహనాలు, ఇంకా ఇతర ఇంధనాల వినియోగం పెరగాలి.
పారిశ్రామిక రంగం వల్ల కూడా గాలి కాలుష్యం పెరుగు తున్నది. ప్రమాదకరమైన సాల్వెంట్లు కూడా ఇష్టారీతిన వదిలివేయడం వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాదులో కాటేదాన్, బాలానగర్, పటాన్చెరువు, జీడిమెట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కాలుష్యాన్ని అధికారులు పట్టించుకోవటం లేదు. సమీప నివాస ప్రాంతాలలో ప్రాణవాయువు తగ్గిపో తున్నది. ఇంట్లోనూ రకరకాల పదార్థాలు, వస్తువుల వినియో గంతో గాలి కాలుష్యం పెరుగుతున్నది. వ్యవసాయంలో వాడే నత్రజని ఎరువులు, విష రసాయనాలు, పెరుగుతున్న డీజిల్, విద్యుత్, ప్లాస్టిక్ వినియోగం వల్ల కూడా పల్లెల్లో గాలి కాలుష్యం పెరిగింది. కొత్తూరు షాద్నగర్, నందిగామ కేశంపేట ప్రాంతాలలో చిన్న పిల్లలు, పెద్దలు కాలుష్యానికి శ్వాస కోస, క్యాన్సర్, ఇతర చర్మ సంబంధిత రోగాలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. వాయు కాలుష్యం షాద్నగర్లో విపరీతంగా పెరుగుతున్నా అధికా రులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. దాదాపు షాద్నగర్ ప్రాంతంలో 200 ఫ్యాక్టరీలున్నాయి. ముఖ్యంగా నెట్కో, ఐరన్ ఫ్యాక్టరీలు భూ కాలుష్యం తోపాటు రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. కాలుష్య నివారణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడే ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం తక్షణం ఉంది.
- మన్నారం నాగరాజు
సెల్ : 9550844433