Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బ డ్జెట్ ప్రవేశపెట్టింది. తమకు అనుకూలించే అనేక అంశాలను దానిలో ప్రస్తావించింది. దీనికితోడు జాతీయత పేరుతో కాషాయ భా వజాలన్ని తమకు అనుకూలంగా మర్చుకుని ప్రజల్లో ఆదరణ పొందగ లిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఆధికారంలోకి వస్తే దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని యావత్ దేశాన్ని కాషా యాధినేతలు నమ్మించారు. కానీ వాస్తవ పరిస్థితులను గమనిస్తే బీజే పీ ఆధికారంలోకి వచ్చిన అనంతరం దేశ వృద్ధి మందగించింది. బీజేపీ అధికారం చేపట్టిన అనంతరం నుంచి వృద్ధిరేటు ఐదేండ్ల కనిష్ట స్థాయి కి (6.8 శాతానికి) చేరింది. మరీ ముఖ్యంగా గడిచిన ఆరు నెలల వృ ద్ధిరేటు గమనిస్తే కేవలం 5.2 శాతంగా నమోదు కావడం గమనార్హం. మరోవైపు రోజురోజు కూ దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, జాతీయత పేరుతో పౌరులపై కేసు లు, మతం పేరిట జరిగే దాడులతో దేశ ప్రజలు అభద్రతా భావంలో కాలం సాగిస్తున్నారన్నది వాస్తవం. ఇన్ని ప్రతికూలతలు, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్న తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 5న పార్లమెంటులో మొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2030 నాటికి నవభారత నిర్మాణమే ధ్యేయమంటూ ఆమె ప్రకటించారు. బడ్జెట్పై యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూసింది. మరీ ముఖ్యంగా సామాన్య జనం టీవీలకు అతుక్కుపోయి మరీ తమకు ఏం ప్రతిఫలాలు అందుతా యోనని ఎదురుచూసారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. సామాన్యులకు అక్కర కు వచ్చే కనీస అవసరాల గురించి ప్రసా ్తవించకుండా ఆర్థిక మంత్రి ప్రసంగం ముందుకు సాగిన క్రమాన్ని ప్రజలు ఇప్ప టికీ మర్చిపోలేకున్నారు. మోడీ మార్కు ను చూపిస్తూ కార్పొరేట్లకు లాభం చేకూ ర్చలా ఈ బడ్జెట్ ఉందని చెప్పొచ్చు. 'కార్పొరేట్ పన్ను' తగ్గింపు చర్యలతో తమది కార్పొరేట్ల పక్షాన నిలిచే ప్రభుత్వమేనని అనిపించుకున్నారు. ద్రవ్యలోటును స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతం కంటే తక్కువకు తగ్గించాలని చాలా కాలం నుంచి ఆర్థికవేత్తల నుంచి అందుతున్న సూచన. కానీ మోడీ ప్రభుత్వం ప్రస్తుత జీడీపీలో ద్రవ్యలోటును 3.4 శాతాకి పరిమితం చేసింది. జీడీపీలో రుణవ్యయం దాదాపు 68 శాతంగా ఉన్నది. పరోక్ష పన్ను విధానాన్ని ప్రవే శపెట్టినప్పటికీ, ఆచరణలో మాత్రం పేలవంగా ఉన్నది. దీంతో పన్ను రాబడులు ఊహించిన దానికంటే 10 శాతం తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ 2019-20 ఆర్థిక ఏడాదిలో జీఎస్టీ సేకరణ 18 శాతం పెరుగుతుందని తాత్కాలిక బడ్జెట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవడం గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించిందని స్వయాన అర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిం చారు. అయితే ఈ వైఫల్యాలపై తీసుకునే తదుపరి చర్యల గురించి బడ్జెట్-2019లో ప్రస్తా వించపోవడం గమనార్హం.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ వ్యయానికి ప్రభుత్వ రంగ సంస్థలను బలిచేశారు. ఇప్పుడు వాటిని అంతమొందించాలనే చర్యలకు గట్టిగా పూనాదులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులను వెనక్కితీసుకోవాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. పెట్రోల్పై అదనంగా రూ.1 సెస్ పెంచడం ద్వారా ఆ భారం సామాన్యులపై పడనున్నది. వర్షాభావం, రోజురోజుకూ పెరిగిపోతున్న నిరు ద్యోగం, కనీస మద్దతు ధర లభించక రైతులు పడుతున్న వ్యధలకు పరిష్కారం చూపే మార్గా లను ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు. బీమా, రైల్వే, మిమానయాన రంగాలలో ప్రయివేటు భాగస్వామ్యానికి తెరలేపారు. చివరికి సాంఘిక సంక్షేమ రంగంలో కూడా ప్రయివేట్ పెట్టుబ డులకు తలుపులు తెరిచారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందురోజు ఆర్థిక సర్వేలో అనేక సవాళ్లను గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. అయితే బడ్జెట్ విష యానికి వచ్చే సరికి ఆర్థిక సర్వేలో వెల్లడించిన అనేక సమస్యలకు పరిష్కారం చూపకుండా బడ్జెట్ ముందుకు సాగడం పట్ల యావత్ దేశం నిరాశకు లోనైందనేది వాస్తవం. బడ్జెట్ సామాన్యులకు అక్కరకు వచ్చేదిగా లేదనేది నిజం. అధికార బీజేపీకి చెందిన నేత సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఆయన బడ్జెట్పై మాట్లాడుతూ.. 'బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు పోంతన లేదు. బడ్జెట్ సందర్భంగా వివిధ సందర్భాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలే నిదర్శనం' అని ఆయన వ్యాఖ్యనించడం మనం గుర్తెరగాలి. ఎన్ని కోణాల్లో చూసినా ఈ బడ్జెట్ ప్రజా శ్రేయస్సును కోరేదిగా లేదనేది వాస్తవం.
- ఆర్.మహేష్
సెల్ : 9502329152