Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడిదారీ వ్యవస్థను, దాని ఆర్థిక విష యాలను చర్చిస్తున్నప్పుడు తప్పక తెలు సుకోవాల్సినది పరపతి, బ్యాంకింగ్ అంశాల గురి ంచి. ఇవి పెట్టుబడిదారీ అభివృద్ధిని, దానిలో ని వైరుధ్యాల పెంపును ఎలా వేగవంతం చేశా యో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం బ్యాం కుల గురించిన ప్రాథమిక విషయాలను చర్చి ద్దాం.
బ్యాంకుల గురించి చాలామంది వినే ఉంటా రు. కానీ బ్యాంకులను వినియోగించుకోవడం చాలా తక్కువ మంది చేస్తారు. సాధారణంగా ప్రజలందరి కోసం ఇవి పని చేస్తాయని అనుకుంటారు. బ్యాంకులు పెట్టుబడికి కేంద్రంగా పనిచేస్తాయి. అంటే పెట్టుబడిదారుల సేవకు, వారి పరపతి సౌకర్యాలకు ప్రధానంగా పని చేస్తాయి. అందుకనే బాగా డబ్బులున్న వారి పట్ల బ్యాంకులు చాలా మర్యాదగా వ్యవహరిస్తాయి. సామాన్య ప్రజలు, చిన్న ఉద్యోగులు, రైతుల పట్ల విసుగుగా పని చేస్తాయి. ఇది మనందరికీ తెలిసిన విషయం.
బ్యాంకులు ఏం చేస్తాయి? సాధారణంగా రెండు పనులు చేస్తాయి. ఒకరి డబ్బును ఇంకొకరికి పంపడం, ఒకరి డబ్బును ఇంకొకరికి అప్పులు గా ఇచ్చి వడ్డీ సంపాదించడం. మనం బ్యాంకులో డబ్బు పెడితే వడ్డీలు చెల్లిస్తాయి. విదేశాలలో జరిగే వర్తకాలలో సరుకుల ఎగుమతులు, దిగు మతులు డబ్బులెక్కలు మొదలైన పనులు చేస్తాయి. సరుకుల ఉత్పత్తి, మారకం అనే వ్యాపారం ఉన్న సందర్భంలోంచే బ్యాంకులు పురుడుపోసుకున్నాయి. ఆ వ్యాపారంలో దోపిడీలో అది కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తాయి.
బ్యాంకుల దగ్గరున్న, అప్పివ్వడానికి వీలైన పెట్టుబడి అనేక మార్గాల లో బ్యాంకులకు లభిస్తుంది. ఇతరులు వారికి చెల్లించిన, డిపాజిట్ చేసిన మొత్తాలను బ్యాంకులు తమ చేతుల్లో కేంద్రీకరించు కుంటాయి. ఈ నిధులు అప్పివ్వదగిన డబ్బు పెట్టుబడిగా మారతాయి. ఇది వడ్డీవచ్చే పెట్టుబడిగా వ్యవహరిస్తుంది. డబ్బు పెట్టుబడిదారులు తమ డబ్బును అప్పు వ్యాపారంలో సాయం చే యడానికి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అంతేకాక వడ్డీ వస్తు ందనే ఆశతో అన్ని వర్గాల పొ దుపు మొత్తాలు డిపాజిట్ అ వుతాయి. చిన్న చిన్న మొత్తా లు పెద్ద మొత్తాలై డబ్బు శక్తిగా మారుతుంది. ఇలా చిన్న మొత్తాలను పోగు చేయ డం, పెట్టుబడిదారులకు, రుణ గ్రహీతలకు మధ్య నిర్వహించే కా ర్యకలాపాల కేంద్రమే బ్యాంకు. డబ్బు ను డబ్బుగా గాక పెట్టుబడిగా తీర్చే సాధ నం బ్యాంకు. పారిశ్రామిక పెట్టుబడిదారులకు క్యాషియర్లుగా బ్యాంకులు వ్యవహరిస్తాయి.
లాభాలు వచ్చేది కేవలం పెట్టుబడిదారులకే కాదు. ఈ వ్యవస్థను ఆశ్రయిస్తూ ఉన్న వారు కూడా లాభాలు గడిస్తారు. డబ్బు బాగా ఉన్న వాళ్లు (ఎలా డబ్బున్న వాళ్లయ్యారన్నది వేరే విషయం) రోజురోజుకూ మరింత ధనవంతులవుతారు. వాళ్లు డబ్బును పెట్టుబడిగా పెట్టి సరుకులు ఉత్పత్తి చేయకపోయినా ధనం పెరుగుతుంది. అదెలా అంటే డబ్బును పెట్టెలో పెట్టి ఉంచడం వల్ల పెరగదు. ధనవంతులైనవాళ్లు వాళ్ల ధనాన్ని బ్యాంకుల్లో దాచుకుంటారు. బ్యాంకులు వీరికి వడ్డీ చెల్లిస్తాయి. బ్యాంకులు ఈ వడ్డీని ఎలా చెల్లిస్తాయి?
అనేకమంది చిన్న పొదుపుదారుల నుండి మధ్య తరగతి, వ్యాపా రులు, పెట్టుబడిదారులు తమ ధనాన్ని బ్యాంకుల్లో దాచుకుంటారని మనం చెప్పుకుంటున్నాం. అయితే వాళ్లు తమకవసరమైనప్పుడు తీసుకునే విధంగా డిపాజిట్ చేస్తారు. ఇలా తీసుకునే వారి కోసం కొంత డబ్బును నిల్వ ఉంచి మిగతా డబ్బును అప్పుల రూపంలో పెట్టుబడి దారులకు ఇస్తారు. పెట్టుబడిదారుడు ఈ ధనాన్ని తీసుకుపోయి పరిశ్రమలు స్థాపించి సరుకులు ఉత్పత్తి చేసి, అమ్మి లాభాలు గడిస్తాడు. ఈ వచ్చిన లాభం నుండి వడ్డీ రూపంలో బ్యాంకులకు చెల్లిస్తారు. ఈ విధంగా బ్యాంకులు కూడా దోపిడీలో భాగస్వాములవుతాయి. ఒక్కొక్క ప్పుడు బ్యాంకులే స్వయంగా పెద్ద పరిశ్రమలు స్థాపించి అవే పెట్టుబడిదారుగా వ్యవహరిస్తాయి.
బ్యాంకులో డబ్బు దాచుకొన్నది ఒకరైతే, ఆ డబ్బుతో పరిశ్రమలు స్థాపించి సరుకులు ఉత్పత్తి చేసి అదనపు విలువను సృష్టించేది మరొకరు. కానీ డబ్బు దాచుకొన్నవాడు, దాచిన బ్యాంకు, ఉపయోగించిన పారిశ్రామికాధిపతి ముగ్గురూ ఈ అదనపు విలువను అంటే లాభాన్ని పంచుకుంటున్నారు. అదనపు విలువ సృష్టిలో వీరి ప్రమేయమేమీ లేదు.
ఉదాహకరణకు పెట్టుబడిదారు బ్యాంకు నుండి రూ.వెయ్యి అప్పు తీసుకోగా దానిపై అతనికి పదిశాతం లాభం అనగా రూ.100వచ్చింది. ఇందులో బ్యాంకుకు 70శాతం వడ్డీ కింద ఇవ్వాలి. కాబట్టి తన 1,000 + 100 కలిపి రూ.1,100లలో నుండి 1,070 బ్యాంకుకు చెల్లిస్తాడు. అంటే బ్యాంకు 7శాతం చొప్పున వడ్డీ తీసుకుంది. ఈ బ్యాంకు తన డిపాజిటర్లకు వడ్డీని చెల్లించాలి. రూ.50 చెల్లిస్తుంది. అంటే 5శాతం చొప్పున డిపాజిటర్లకు చెల్లిస్తుంది. దీనినే బ్యాంకు రేటు అంటారు. ఈ విధంగా రూ.1,000 పెట్టుబడితో వచ్చిన రూ.100 అదనపు విలువను రూ.30 పెట్టుబడిదారుడు, రూ.20 బ్యాంకు, రూ.50 డిపాజిటర్లు పం చుకుంటున్నారు. బ్యాంకు వ్యాపారం కూడా ఇతర వ్యాపారాల లాంటిదే. ఒక వ్యాపారి ఒక గుర్రాన్ని రూ.50కు కొని, రూ.70కు అమ్మి రూ.20 లాభం సంపాదించినట్టుగానే బ్యాంకు రూ.50 వడ్డీకి డిపాజిటర్ల నుండి డబ్బు తీసుకుని ఇతరులకిచ్చి రూ.20 లాభం పొందుతున్నది. వ్యాపారి ఒక గుర్రాన్ని అమ్మాడు. బ్యాంకు డబ్బును తీసుకుని ఇచ్చింది. లావాదేవీ ఒకటే. వ్యాపారికి గుర్రం ఒక సరుకు. బ్యాంకుకు డబ్బే ఒక సరుకు.
మరి బ్యాంకు ఈ వడ్డీరేటును ఎలా నిర్ణయి స్తుంది? డబ్బు కూడా ఒకప్పుడు చవకగానూ ఒకప్పుడు ప్రియంగానూ ఉంటుంది. ఇది కూడా సప్లయి డిమాండ్ను అనుసరించి ఉ ంటుంది. పెట్టుబడిదారులకు ఎక్కువ డబ్బు అవసరంగా ఉండి వారిలో వారికి పోటీ ఏ ర్పడితే, ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని తీసుకుం టారు. ఒక్కోసారి బ్యాంకులో ఎక్కువ డబ్బు ఉండి పెట్టుబడిదారులు అప్పులు తీసుకోకపో యినట్లయితే అప్పుడు బ్యాంకురేటు తగ్గుతుంది.
బ్యాంకర్ల వాణిజ్యాన్ని రెండు శాఖలుగా విభజించవచ్చు. ఒకటి, పెట్టుబడి అవసరం లేని వారి నుండి సేకరించి తక్షణం అవసరం ఉన్న వారికి పంచడం, బదిలీ చేయడం. దీన్ని పెట్టుబడి చలామణి అంటారు. రెండోది ఖాతాదారుల నుండి డిపాజిట్లు తీసుకుని, తిరిగి చెల్లించడం. ఇది పెట్టుబడి చలనం. బ్యాంకు పెట్టుబడిలో రెండు అంశాలుంటాయి. ఒకటి నగదు డబ్బు, బంగారం లేదా నోట్లు. రెండు సెక్యురిటీలు, వాణిజ్య పత్రాలు, ఎక్చేంజ్ బిల్లులు. ఇవి కొంతకాలం పాటు ఉండి గడువుకొస్తాయి. వాటిని డిస్కౌంట్ చేయడం అంటే చెల్లించడం అన్నది బ్యాంకు ప్రధాన వ్యాపారం. ఇవికాక ప్రభుత్వ సెక్యూరిటీలు, అంటే బాండ్లు, ఖజానా నోట్లు, అన్ని రకాల స్టాకులు (వాటాలు) వడ్డీ ఇచ్చే పత్రాలు.
సరుకుల ఉత్పత్తిదారులు, వ్యాపారుల మధ్య క్రయవిక్రయాలు, వాటి లావాదేవీలుంటాయి. వీటి వల్ల ఏర్పడే అప్పులను వాణిజ్య రుణం అంటారు. ఇది మారక పత్రాల ద్వారా జరుగుతుంది. బ్రిల్స్ ఆఫ్ ఎక్చేంజ్ సరుకులు డబ్బుకు కాక ఒక నిర్ణీత తేదీనాడు చెల్లించే రాతపూర్వక వాగ్దాన పత్రంపై అమ్మబడతాయి. వీటినే బిల్స్ ఆఫ్ ఎక్చేంజ్ అంటారు. అంటే తాను కొన్న సరుకులకై నిర్ణీత కాలంలో చెల్లిస్తానని చేసుకున్న అప్పు ఖరారునామా. చెల్లించాల్సిన తేదీ వరకు అటువంటివే చెల్లింపు సాధనాలుగా చలామణి అవుతాయి. (ప్రామిసరీ నోటు, బ్యాంకు చెక్లు) అవే వాస్తవమైన వాణిజ్య ధనంగా ఉంటాయి.
పరపతి వ్యవస్థ వాణిజ్యం.. అమితోత్పత్తికి, అమితమైన సట్టా వ్యాపారానికి ప్రధాన ఆధారంగా కనిపిస్తుంది. పరపతి వ్యవస్థ ఇతరుల పెట్టుబడిపైన, ఆస్తిపైన తద్వారా ఇతరుల శ్రమపైన కొన్ని పరిమితులకు లోబడి అపారమైన అజమాయిషీ ఇస్తుంది. తన సొంత పెట్టుబడిపైన కాక సామాజిక పెట్టుబడిపైన అజమాయిషీ అన్నది అతనికి సామాజిక శ్రమపైనా అజమాయిషీని పెంచుతుంది.
పెట్టుబడిపై వచ్చి లాభాలు బ్యాంకులలో కేంద్రీకరించబడతాయి. పెట్టుబడిదారుల ధనం అధికంగా బ్యాంకులలో చేరడం వలన బ్యాంకులపై వారి గుత్తాధిపత్యం పెరుగుతుంది. చిన్న బ్యాంకులలో షేర్లను కొనుగోలు చేయడం ద్వారా వాటికి రుణాలు ఇవ్వడం ద్వారా పెద్ద బ్యాంకులు, చిన్న బ్యాంకులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. బ్యాంకుల్లో గుత్తాధిపత్యం పెరుగుతుంది. పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడంలో.., బ్యాంకులు, పరిశ్రమల మధ్య సంబంధాలలో మార్పులు వస్తాయి. జాయింట్ స్టాక్ కంపెనీల ఏర్పాటుకు బ్యాంకులు దోహదపడతాయి. ఆ విధంగా బ్యాంకులు పరిశ్రమల అభివృద్ధికి మధ్యవర్తి పాత్ర నుండి గుత్త సంస్థలుగా రూపొందటమనేది, స్వేచ్ఛాయుత పోటీ దశ నుండి గుత్త పెట్టుబడిదారీ దశకు జరిగే పరివర్తనకు బ్యాంకు పునాదిగా ఉపయోగపడుతుంది.
బ్యాంకుల గుత్త సంస్థల, పారిశ్రామిక గుత్త సంస్థల విలీనంలో ద్రవ్య పెట్టుబడి రూపొందుతుంది. ద్రవ్య పెట్టుబడి (ఖీఱఅaఅషఱaశ్రీ జaజూఱ్aశ్రీ) అంటే పరస్పరం కలగలిసిన పారిశ్రామిక, బ్యాంకుల గుత్త సంస్థల పెట్టుబడి. సామ్రాజ్యవాద యుగమంతా ద్రవ్య పెట్టుబడి యుగమే. బ్యాంకుల పెట్టుబడి, పరిశ్రమల పెట్టుబడి మిళితంగావటమనేది, బ్యాంకుల, పరిశ్రమల అధిపతులు రెండింటిలోనూ ఆధిపత్యం వహిస్తారు. ద్రవ్యాధిపత్యం రాజకీయ రంగంలోనూ ఆధిపత్యం చెలాయిస్తుంది. ప్రభుత్వ జాతీయ, అంతర్జాతీయ విధానాలన్నీ పెద్ద పెద్ద గుత్త సంస్థల ప్రయోజనాలు నెరవేర్చే విధంగానే రూపొందుతాయి.
మనందరికీ బాగా పరిచితమైన ప్రపంచ బ్యాంకు మనకు అప్పులివ్వటమే కాదు. దేనికి అప్పులు తీసుకోవాలో, అప్పు తీర్చ టానికి ప్రజ లపైన ఏయే భా రాలు వేయాలో కూడా షరతులు విధిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయి లో డబ్బును కేంద్రీక రించుకున్న బ్యాంకులు సైతం సంక్షోభానికి ఆర్థిక వ్యవస్థలు గురైనప్పుడు ఏమి చేయలేకపోయాయి. స్వయాన బ్యాంకులే సంక్షోభంలో దివాళా తీసాయి. పెట్టుబడిలోని వైరుధ్యం, బ్యాంకు పెట్టుబడికీ వర్తిస్తుంది కదా!
- ఆనందాచారి
సెల్ : 9948787660