Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంపీలు కమలం కండువా కప్పుకోనున్నా రంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనల్లో కారు స్పీడ్కు బ్రేక్లు వేస్తున్నాయి. ఆ పార్టీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయ తదితరులు చేస్తున్న వ్యాఖ్యలు టీఆర్ఎస్ క్యాడర్ను అయోమయంలో పడేస్తున్నట్టే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సీఎం బిడ్డ ఓటమి పాలు కావడం, నాలుగు ఎంపీ సీట్లు కోల్పోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో బీజేపీ సీనియర్ నాయకులు చేస్తున్న పొలిటికల్ స్టేట్మెంట్లు ఇబ్బందికి గురిచేస్తున్నట్టు సమాచారం. నిత్య వ్యూహరచనల కేంద్రంగా ఉండే ప్రగతిభవన్, బీజేపీకి వాతలు పెట్టేందుకు సమాయత్తమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దేఖ్లేంగే.. అంటున్న కారు పార్టీ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తెలంగాణభవన్లో బహిరంగంగా మాటామంతీ జరుగుతున్నట్టు ఆపార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
- బి.బసవపున్నయ్య