Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి- సమాజం మధ్య అ గాధం పెరగడంవల్ల ''ఆవరణ వ్యవస్థలు'' విధ్వంస మవుతున్నాయి. అవి అడవులు కావచ్చు, జీవ వైవిధ్యం కావ చ్చు, కోరల్ రూప్స్ కావచ్చు, ఓజోన్ పొర కావచ్చు, సము ద్రాలు కావచ్చు. దీనికి కారణం జనాభా పెరగడం కావచ్చు, మానవ కాలుష్యం వల్ల కావచ్చు. ప్రకతి- సమాజాల మధ్య అగాధం ఏర్పడి పర్యావరణం విధ్వంసమవుతోంది.
సూర్యగోళం నుంచి ఒక యురేనియం ఆస్టరాయిడ్స్ భూమిని ఢకొీట్టడం వల్ల భూమిమీద ''డైనోసార్స్'' జాతి అం తరించింది. యురేనియం భూమి అంతర్భాగంలోకి వెళ్లడాని కి లక్షల ఏండ్ల సమయం తీసుకుంటుంది. ప్రకృతిలో ఉన్న 92 సహజసిద్ద మూలకాలలో యురేనియం ఒకటి. ఈ యు రేనియం అస్థిర స్వభావం కలిగి ఉంటుంది. అడవులలోని భూ అంతర్భాగంలోనూ, తీరప్రాంతాలు, గట్టి రాతి నేలల్లో ఈ 'యురేనియం' భార లోహా ఖనిజం ప్రపంచంలో కెనడా, రష్యా, అమెరికా, నైజీరియా, భారతదేశంలో ఉన్నది. భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతంలో తూర్పు కను మలు, పచ్చిమ కనుమలలో యురేనియంతోపాటు అనేక ర కమైన ఖనిజ లోహాలున్నాయి. ఆదివాసులనే తెగలు అనాది గా ఇక్కడ స్థిరపడ్డారు. వారు ప్రకృతి- సమాజాల మధ్య ఆ గాధం రాకుండా ఆవరణ వ్యవస్థలను కాపాడుతున్నారు. వా రు కేవలం ''ఆహార పోషణ''కే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకా నీ ఆహార ఉత్పత్తి విస్తారంగా పెంచడానికి భూసారం నిస్సా రం కావడాన్ని వారు నిరాకరిస్తారు. ఇలాంటి పరిస్థితులలో వారి మానాన వారిని వదిలేయాల్సిందిపోయి వారిని ఇక్కడి నుండి గెంటివేయడం ఒక 'విద్రోహ' చర్య. ''అభివృద్ధి'' ము నుగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారంతో కా ర్పొరేట్ శక్తులు యురేనియం నిల్వల తవ్వకాలకు సిద్ధపడుతున్నాయి. దీని వెనుక ''ప్ర పంచబ్యాంక్'' హస్తం ఉంది. ప్రపంచ మార్కెట్ అనేది నాలుగు రూపాలలో విజృభించడానికి సిద్ధమైంది. 1.ఉ త్పత్తి కేంద్రాల రూపంలో, 2.ముడి సరుకుల రూపంలో, 3.కారు చౌక శ్రమ రూపంలో, 4.పెట్టుబడి రూప ంలో (నగదు). ''మార్కెట్''ను కింది స్థాయికి విస్తరిం చడానికి ప్రభుత్వా లు ప్రయత్ని స్తాయి. 'ముడి సరుకు ల' రూపంలో సహజ వనరులను వి ధ్వంసం చేసి తరలించుకుపోతాయి.
ప్రకృతిలో లభించే సహజ సిద్ధ ''మూలకాల'' (92)లో అతి బరువైన లోహం యురేనియం. ఐడీఐ భూమి లోపల ఉన్నప్పుడు ఎ లాంటి ప్రమాదం లేదు. కానీ భూమి నుండి రెండు పద్ధ తులలో యురేనియంను తీస్తారు. ఒకటి ఓపీఈఎన్ టచ్ మెథడ్ ఐడీఐ భూమిని తొవ్వుతారు. రెండో పద్ధతి రేడియో దాతువుల ధార్మికత వల్ల అణువులో నిలకడ ఉండదు. ఈ అణువులు విస్పోటనం చెందడం వల్ల అంతులేని ''అణు ధార్మికత'' వెలువడుతుంది. ఈ కిరణాల నుంచి వెలువడిన రేడియో తరంగాల వల్ల జంతు, వృక్ష, పక్షుల జాతి ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. యురేనియం క్రషింగ్లో వెలువడే దూళిని అణు దూళి అం టారు. దాంట్లో 'బి కిరణాలు' అనే సూక్ష్మ అణువులుంటాయి. ఇవి కంటికి కనిపించవు. మనం పిల్చుకొనే గాలిలో, నీటిలో, తినే ఆహారంలో కలిసి మానవు ల ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అలాగే ''పర్యావరణ వ్యవ స్థలను'' విధ్వంసం చేస్తాయి. ఇవి కేవలం రెండు విషయా లలో కొద్దిగా ఉపయోగ పడుతాయి. అంతే తప్ప దీనివల్ల ప్రయోజనం శూన్యం. ఈ''యురేనియం'' భూమి లోపల ఉ న్నంతవరకు పర్యావరణానికి ఎలాంటి నష్టం లేదు. కానీ భూమి నుండి తీయటం వల్లనే ఈ ఇబ్బందికరమైన విధ్వం సం జరుగుతుంది. యురేనియం 'అణుబాంబు' టీజేవోలో వాడతారు. దాని వ్యర్థ పదార్థాల వల్ల మూడు రకాలైన ఆవ రణ వ్యవస్థలు విధ్వంసమవుతాయి. 1.లితోస్పియర్ (భూ ఆ వరణం), 2.హైడ్రో స్పియర్ (జలావరణం), 3.అట్మాస్పియ ర్( వాతావరణం). యురేనియం ఒక అర్థ జీవిత కాలం కలి గి ఉంటుంది. ఒక యురేనియం అణుధార్మికత 75 వేల సం వత్సరాలైతే 95 వేల సంవత్సరాల వరకు చుట్టపక్కల ప్రాం తాలకు వెళ్లడానికి వీలులేదు. ఆ చుట్టుపక్కల జంతు, వృక్ష, పక్షి, మానవ జాతి ఉనికి ఉండదు. ఇలాంటి పరిస్థితులు 1984లో రష్యాలోని చెర్నుబి ప్రాంతంలో అణుధార్మికత బ యటికి వచ్చి 15 లక్షల మంది మరణించడమే గాక జంతు, వృక్ష, పక్షి జాతి విధ్వంసం జరిగింది. 2011 ప్రాంతంలో జపానులోని ప్రకోషియం ప్రాంతంలో అణు కేంద్రం నుండి విడుదలైన అణుధార్మికత వల్ల దాదాపు ఆ ప్రాంతంలో 2/3 వంతు ప్రజలు మరణించారు. సాంకేతికంగా ప్రత్యామ్నాయ మార్గాలైన సౌరశక్తి, పవనశక్తి, తరంగశక్తులను వాడుకోవలసిన అవసరం ఉందని ప్రపంచమంతటా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో అక్కడ వదిలేసిన ''అణు కుంపటి'' మన దగ్గర నిర్మించదలచి మన పాలక ప్రభుత్వాలు అతి ఉత్సాహం చూపడం ఎవరికోసం?
నల్లమల అడవులు కావచ్చు. దేశంలో మరెక్కడైనా కావచ్చు. ఈ యురేనియం తవ్వకాలు జరిపినప్పుడు దేశ మూల వారసులైన గిరిజనులు, ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులు అనేక ఆవరణ వ్యవస్థలలో విఘాతం కలిగి ప్రకృతి సమాజం మధ్య అగాధం ఏర్పడుతుంది. ఈ యురేనియం తవ్వకాల వల్ల జరిగిన ప్రయోజనం ఒక వెంట్రుకంతైనా లేకపోగా, నష్టం మాత్రం సముద్రమంత ఉంది. ఈ యురేనియం తవ్వకాలను, అణుకుంపటిని ఆపేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో ×ూజజ (×అ్వతీఅవ్ ూశ్రీaఅవ్ జశ్రీఱఎa్ఱష షష్ట్రaఅస్త్రవ) ఈ యురేనియం తవ్వకాల వల్ల 105 సెల్సియస్ నుంచి 305 సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 2015లో ''పారిస్'' సమావేశంలో మన దేశ పాలకులు పర్యావరణానికి విఘాతం కలిగించబోమని ఒప్పందం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో యురేనియం తవ్వకాలు ప్రారంభిం చాలనుకోవటం తన కూర్చున కొమ్మను తాను నరుక్కోవట మే. ఈ యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ జరపా ల్సిన అవసరముంది. అందుకు రచయితలు, విద్యార్థులు, బుద్ది జీవులు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పౌర సమాజం యుద్ధ ప్రతిపాదికన నడుం బిగించాలి.
- ముత్తన్నగారి రాజేందర్రెడ్డి