Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తొండ ముదిరి ఊసరవెల్లి అయిందని' ఒక సామెత. ఆ రకంగానే పెట్టుబడిదారీ వ్యవస్థ అనేక రూపాలతో కొనసాగుతుంది. ఇప్పుడు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అని మనం పిలుస్తున్నాం. దీనినే Crony Capitalism అంటాం. ఈ క్రోనీ క్యాపిటలిజం గురించిన కొన్ని ప్రాథమిక విషయాలను చర్చిద్దాం.
పెట్టుబడిదారీ వ్యవస్థలో కానీ, భూస్వామిక, బానిస వ్యవస్థల్లో కానీ దోపిడీ చేస్తున్నవారికి సహా యకారిగా, వారి దోపిడీకి ఎలాంటి ఆటంకాలు, వారి ఆస్తిపాస్తు లకు ఎలాంటి నష్టమూ రాకుండా రాజ్యాలు కాపాడుతాయనే విషయం మనం అనేక సార్లు చెప్పుకున్నాం. వారి రక్షణ కోసమే రాజ్య వ్యవస్థ ఏర్పడిందనేది ఒక చారిత్రక సత్యం. అయితే బానిస వ్యవస్థ భూస్వామిక వ్యవస్థల్లోని రాజ్యాలు, రాజులు, సామ్రా జ్యాలు పోయి పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడటంతో స్వేచ్ఛా స్వాత త్య్రాల భావన ఏర్పడి బూర్జువా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తెచ్చి దేశ పౌరుల కోసం, ప్రజా పాలన కోసం ప్రభుత్వాలు ఏర్పడ తాయనే ఆలోచన కల్పించింది ఈ వ్యవస్థ. కొన్ని ప్రజాతంత్ర హక్కులకు, సౌకర్యాలకు కూడా రాజ్యాంగాలు హామీనిచ్చాయి. పెట్టుబడిదారుల స్వేచ్ఛా మార్కెట్టుకు, వ్యాపార కార్యకలాపాలకు అవకాశమిస్తూనే ఒక స్వతంత్ర వ్యవస్థగా రాజ్యం, రాజకీయాల ను నడుపుతున్నట్టు కొంతకాలం భ్రమింపజేసింది. ఇప్పుటికీ రాజ్యానికి, రాజకీయాలకు, పెట్టుబడిదారులకు, దోపిడీకి సంబంధంలేదని చాలామంది ప్రజలు భావిస్తారు. ఆ భ్రమలను పటాపంచెలు చేసి తన నిజ స్వరూపాన్ని పెట్టుబడి నగంగా వ్యక్తం చేయడమే ఈ క్రోనీ క్యాపిటలిజం.
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అనేది సాహసంతో, స్వతంత్రంగా అభివృద్ధి చెందే వ్యాపారం కాదు. ఇది చాలా వేగంగా అభి వృద్ధి చెం దటానికి వ్యాపార వర్గాలు రాజకీయ వర్గాలతో చాలా దగ్గరి సంబంధాల ను కలిగి ఉంటారు. రాజ్యము, రాజకీయాలు, వ్యాపారాల పెనవే సుకున్న బంధంగా ఈ క్రోనీ క్యాపిటలిజం కొనసాగుతుంది. అంటే ఒకరి ప్రయోజనాలు ఒకరు నెరవేర్చుకుంటూ నూతన మైన ఆర్థిక, రాజకీయ గుత్తాధిపత్యాన్ని సంపాదిస్తారు. ఆశ్రిత పెట్టుబడి రాజ్యాధికారాలను ఉపయోగించి దానికి కావలసిన ప్రాథమిక ఏర్పాట్లను పొందుతుంది. అంటే పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన భూమిని ఉదారంగా పొందుతుంది. కావలసిన అనుమతులు, గ్రాంట్లు, పన్ను మినహాయింపులు, ఆటంకంగా ఉన్న చట్ట సవరణలు మొదలైనవన్నీ పొందుతుంది. అంతేకాదు, తన ఉత్పత్తులను ప్రభుత్వానికే విక్రయించి దాని లాభాలకు పూచీని కూడా పొందుతుంది.
పెట్టుబడిదారులకు, పెట్టుబడికి ఇం త సేవ చేసినందుకు గాను రాజకీయా లకు కూడా పెట్టుబడి సహాయం చేస్తుం ది. రాజకీయాలలో కూడా తన పెట్టుబడి ని వినియోగించి రాజకీయ నైతికతను దెబ్బ తీస్తుంది. అంటే రాజకీయాలను వ్యాపారమయం చేస్తుంది. ఆశ్రిత పెట్టుబడి విధానంలో మనం అనేక లాలూచీ లావాదేవీలను చూస్తాం. మన దేశంలో కూడా అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపారంలో పోటీ ఉంటుంది. ఇది ఈ వ్యవస్థ సహజ లక్షణం. కానీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్ల గుత్త సంస్థల పక్షం వహించి వారికి అనుకూల నిర్ణయా లు తీసుకునే ప్రభుత్వాలు పోటీపడే వ్యా పారులను నిరోధిస్తాయి. తన చట్టాలను ఉపయోగించి వాటికి ఆటంకాలు కల్పిస్తా యి. ముప్పుతిప్పలు పెడుతుంది. అంటే ప్రభుత్వం, దాని రాజకీయాలతో కలిసి ఉ న్న పెట్టుబడిదారీ వర్గాలు పరస్పరం సహ కరించుకుంటాయి. తమ వ్యాపారాలను పంచుకుంటాయి. ఈ విషయాలు బయటికి రాకుండా మీడియాను కూడా ఇందులో భాగస్వాములుగా మారుస్తాయి. అంటే వాళ్లనూ అవినీతి పరాలుగా మారుస్తారు. 1980లలో పిలిప్పయిన్లో అక్కడున్న సంక్షోభాన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల జోక్యం పెరిగింది.
ఆశ్రిత పెట్టుబడి విధానం పిలిప్పయిన్ పరిపాలకుడుగా ఉన్న మార్కోస్ హయాంలోనే మొదలైంది. 1997-98లో ఏసియన్ ఫైనాన్షియల్ సంక్షోభంలో ప్రభుత్వంలోని నాయకులు వ్యాపారంలో ఉన్న వాళ్లకు ప్రయోజనం చేకూర్చే అనుకూల నిర్ణ యాలు తీసుకున్నారు. అయితే వ్యాపారంలో ఉన్నవాళ్లు అంతా వారి బంధువులుగానే ఉన్నారు. అంటే మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా పని చేసే ప్రభుత్వాలు రాజకీయ మార్కెట్ను కూ డా సృష్టించి దానికి అనుకూలంగా మార్చుకుంటుంది. థారులాడ్, ఇండోనేషియా, సింగపూర్లలో ప్రభుత్వ జోక్యం వ్యాపారా లలో తీవ్రంగా పెరిగింది. సోవియట్ రష్యా పడిపోయిన తర్వాత అధికారంలో ఉన్న ఎత్త్సిన్ పెట్టుబడిదారుల కలయికతోనే ప్రభు త్వాన్ని నడిపారు. వ్యాపారాలు, రాజకీయాలు చాలా దగ్గర సంబ ంధాలు కలిగి ఉండటమనేది మన దేశంలో వలస రాజ్యంగా ఉన్నప్పటి నుండే ఉంది. ఆ తర్వాత నెహ్రూ కాలంలోనూ కొన సాగింది. కానీ ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు వచ్చిన 1990 నుండి దీని ప్రభావ తీవ్రతను మనం గమనించవచ్చు. ప్రపంచంలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు, భారత మార్కెట్ను వశపర్చుకోవడా నికి వచ్చాయి. అప్పుడే రాజకీయ వర్గాలకు పెద్ద ఎత్తున లంచా లు ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత రాజకీయ నాయకులే వ్యాపా రస్తులుగా మారారు. వ్యాపారస్తులు రాజకీయ నాయకులుగా అవతారమెత్తారు. వ్యాపారస్తులు పార్లమెంట్లోకి రావడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆశ్రిత పెట్టుబడి, పెట్టుబడి యొక్క కనీస నీతిని కూడా కాలరాస్తుంది. అంటే స్వేచ్ఛా మార్కె ట్ వ్యాపారాన్ని అడ్డుకుంటుంది. అవినీతిమయమైన ఈ క్రోనిజా న్ని 'ఫ్లుటోక్రసీ(Plutocracy)అంటారు. అంటే 'సంపదచే పరిపా లన' లేదా క్లెప్టోక్రసీ (Kleptocracy)... అంటే 'దొంగలచే పరిపాలన' అని అర్థం. ఈ ఆశ్రిత పెట్టుబడి వ్యవస్థలో పర్యావరణ విధ్వంసం విపరీతంగా జరుగుతుంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుం ది. భూమిని, సహజ వనరులను చాలా చౌకగా పరిశ్రమాధిపతు లకు ప్రభుత్వాలు కట్టబెడతాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వా మ్యం పేరుతో ఏర్పాటు చేసిన నాటి 'కోల్ గేట్ కుంభకోణం' దీనికి మంచి ఉదాహరణ. ఇందులో గౌతమ్ ఆదానీకి సెజ్ (Special economic zone) నిమిత్తం వేల ఎకరాల భూమిని ప్రభుత్వాలు కేటాయించాయి. కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రభుత్వాలూ ఈ పని చేశాయి.
గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆశ్రిత పెట్టుబడి ఆచరణ వేగంగా పెరిగింది. గౌతమ్ ఆదాని ఒ క జాతీయ పెట్టుబడిదారునిగా ఎదిగాడు. గత ఐదేండ్లలో రెండు శాతంగా ఉన్న ఆదాని ఆదాయం పన్నెండు శాతానికి పెరిగింది. అంబానీ సోదరులకు గత యాభై ఏండ్లలో పోగైన సంపదకు రెట్టిం పు ఆదాయం ఈ ఐదేండ్లలో పెరి గింది. అంతేకాదు ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, వారి చెల్లింపు లకు ఏ రకమైన హామీ లేకుండానే బ్యాంకుల ద్వారా అప్పులు అంద జేస్తాయి. అట్లా బ్యాంకులకు కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయి పడిన పెట్టుబడిదారులు నీరవ్ మోడీ, విజరు మాల్యా మొదలైన వాళ్లెందరో దేశం నుంచి పోయి విదేశాల్లో ఉంటున్నారు. అదేవి ధంగా పెట్టుబడిదారులకు గత ఐదేండ్లుగా దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలను సబ్సిడీ కింద ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ డ బ్బంతా దేశ ప్రజలందరిది. ప్రభు త్వాలు అప్పనంగా వారికి దోచి పె ట్టాయి. పెడుతున్నాయి. గత 45 ఏండ్లలో కనీ వినీ ఎరుగని స్థాయి లో నిరుద్యోగం నేడు యువతను పట్టి పీడిస్తోంటే, లక్షలాదిగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే, రైతులు ఆత్మహత్యలకు పా ల్పడుతుంటే ఏ చర్యా తీసుకోని, కనీసం మాట్లాడని ప్రభుత్వం, పరిశ్రమాధితులు ''మేము నష్టాలలో ఉన్నాం, ఆదుకోవాలి'' అని కోరగానే పోయిన బడ్జెట్లో వేసిన సర్ చార్జీలను ఎత్తివేశారు. ఇంకా ఏ రకమైన ఉద్దీపన కార్యక్రమాలు చేపడతారో చూడాలి.
ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో ఆశ్రిత పెట్టుబడి అనే ది ఒక సంస్కృతిగా మారింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగో ళ్లలో పెద్ద అవినీతి జరిగింది. యూపీఏ హయాంలో ఒక్కో యు ద్ధ విమానానికి రూ.526 కోట్లకు ఒప్పందం చేసుకున్న దానిని రూ.1,670 కోట్లకు పెంచి, ఇక్కడి పెట్టుబడిదారులకు మధ్యవ ర్తిగా లాభాలు చేకూర్చింది. ఇప్పుడు జైలులో ఉన్న చిదంబరం కూడా పెట్టుబడిదారుడిగా వ్యాపారం చేస్తున్న కార్తీ చిదంబరాని కి పరోక్షంగా సహాయం చేయడానికి ఇంద్రాణీతో డీల్ ఏర్పాటు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జియో సంస్థకు 4జీ స్పెక్ట్రమ్ అనుమతినిచ్చి ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ ఎల్కు అనుమతించకపోవడం ప్రైవేటు పెట్టుబడిదారులకు మేలు చేయడానికే అని స్పష్టంగా కనిపిస్తున్నది. 'ఎన్రాన్'తో విద్యుత్ ఒప్పందాలు, వేదాంత కంపెనీకి భూములు, అడవులను ధారాదత్తం చేయడం ఇలా ఎన్నయినా పేర్కొనవచ్చు. మంచి వాళ్లు రాజకీయాలలోకి రావాలనీ, వాళ్లు వస్తే మంచి పరిపాలన వ స్తుందని చాలామంది అంటుంటారు. కానీ మంచివాళ్లుగా, ప్రజ ల కోసం పనిచేసేవారు ఎన్నికలలో పోటీ చేస్తే దారుణంగా ఓడి పోతారు. ఓడిపోతున్నారు కూడా. అవినీతి రహితంగా పరిపాలి ంచిన ప్రభుత్వాలు కూడా ఎన్నికల్లో గెలవలేకపోతున్నాయి. మనం నైతికత అనే విషయాన్ని వ్యక్తుల్లో వెతుకుతాం. కానీ అది వ్యవస్థలో ఉంటుంది. రాజకీయాల్లో నేడు నీతికి తావెక్కడిది. ఎ న్నికలలో పెట్టుబడి విపరీతంగా ప్రవహిస్తోంది. ఇటీవల నే ఎన్ని కల నిధుల సేకరణకు సంబంధించి కొత్త చట్టాన్ని బీజేపీ ప్రభు త్వం తీసుకొచ్చింది. అదేమంటే బాండ్ల రూపంలో రాజకీ య పార్టీలకు చందాలు ఇవ్వొచ్చు. బాండ్ల రూపంలో వచ్చిన డబ్బు ను ఎవరిచ్చారు, ఎంతిచ్చారు అనే లెక్కలేమీ చెప్పాల్సిన అవస రం లేదు. ఇది కూడా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో భాగమే. మొన్న ఎన్నికలలో ఒక్క బీజేపీయే 27వేల కోట్ల రూపాయ లు అధికారికంగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తున్నది. అంటే రాజకీ య ఫలితాలను పెట్టుబడి ఎలా నిర్దేశిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
వ్యాపారం తప్పనిసరిగా అధిక లాభాలను సంపాదించేదిగా ఉండాలని భావించిన వారు, దాన్ని రాజకీయ అధికారం కోసం ఉపయోగిస్తారని నామ్చామ్ స్కీం అంటారు. ప్రభుత్వాలను, ఉద్యోగులను వ్యాపారులు అవినీతిపరులుగా మారుస్తారు. లాబీలు ఏర్పడతాయి. ఆశ్రిత పెట్టుబడి విపరీతమైన అవినీతికి దారి తీస్తుంది. పన్నుల ఎగవేతను, అక్రమ వ్యాపారాన్ని ఇది అనుమతిస్తుంది. అవినీతికర ప్రభుత్వాలు వ్యాపారులతో పూర్తి సంబంధాలు కలిగి ఉంటాయి. ఆశ్రిత పెట్టుబడి ఒక్కోసారి మతానికి, జాతులకు మద్దతుగా మెజారిటేరియన్ నినాదాన్ని ఎత్తుకుంటుంది. ఉదాహరణకు సిరియా, భారతదేశంలో మత విభజన మొదలైనది తీసుకోవచ్చు. ఆశ్రిత పెట్టుబడి వారి మద్దతునూ పొందుతుంది. అయితే అది అవినీతి, సహజ వనరు ల దోపిడీతో ఎదుగుతుంది తప్ప దేశాలనూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచలేదు. అందుకే ప్రజలకు తిరుగుబాటు తప్పదు.
- ఆనందాచారి
సెల్ : 9948787660