Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌనంగా ఉన్న మనిషికి కోపమెస్తే ఎలా ఉంటుందో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఈటెల్లా ప్రత్యర్థులకు దిగాయి. అవి ఎవరికో దిగాయో అర్థం కాక టీఆర్ఎస్ నేతలు కొట్టుకుంటున్నారు. మధ్యలో వచ్చిన వాళ్లం కాదని, గులాబీ జెండా ఓనర్లమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకున్నారని కొంత మంది విశ్లేషణ చేస్తుండగా, కేటీఆర్నుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు అంటున్నారు. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారంతో ఆయన ఊగిపోయారు. ఈటలపై కుట్ర పూరితంగా వార్తలు రాయిస్తున్నారని, అందుకు రాజ్యసభ సభ్యుడు కూడా కారణమన్న చర్చ జరుగుతున్నది. అయితే చర్చ ఎలా ఉన్నా...టీఆర్ఎస్లో అసంతృప్తి వాదులకు ఈ వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి. కేసీఆర్ ఇలాకలో ఈటల సంధించిన ప్రశ్నలతో 'వీడు మాములోడు కాదురా పండు' అని మాట్లాడుకుంటున్నారు. దటీజ్ ఈటల రాజేందర్.
- ప్రియకుమార్