Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాడ్స్ కోసం పెద్దపెద్ద ప్రముఖులకు లక్షలకు లక్షల రూపాయలు ఎందుకు ధారబోయాలనుకున్నడో ఏమోగానీ లలితా జ్యువెలరీ ఎండీ కిరణ్కుమార్ ''డబ్బులు ఎవరికీ ఊరికే రావు...'' అంటూ తన వ్యాపార ప్రమోషన్ కోసం తానే యాడ్ రూపొందించుకున్నాడు. ఆ యాడ్తో ఓ స్టార్ అయిపోయాడు. కోట్లాదిమంది ఆ యాడ్ను వీక్షించారంటే ఫాలోవర్స్ ఏ స్థాయిలో ఉన్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఆ యాడ్పై అనేక వ్యంగాస్త్రాలూ పుట్టుకొచ్చాయి. ఆ పాపులర్ డైలాగ్ను ఇప్పుడు అన్ని రంగాల వారూ తమకు అనువదించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ మెడికల్ రిప్రజెంటేటివ్స్, సేల్స్మెన్స్ ధర్నా చేపట్టారు. ఆ సందర్భంగా ఓ నేత మాట్లాడుతూ తన ప్రసంగానికి కొంచెం సృజనాత్మకతను జోడిస్తూ ''హక్కులు ఎవరికీ ఊరికే రావు... పోరాటాలు చేయాల్సిందే'' అంటూ తనదైన స్టైల్లో అనేసరికి అక్కడున్న వారంతా లలితా జ్యువెలరీ యాడ్ను గుర్తుకుతెచ్చుకుని మరీ నవ్వారు.
- ప్రశాంత్