Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ప్రతిపక్షాల క్షుద్ర పూజలను కనిపెట్టారు. వరుసగా బీజేపీ సీనియర్ నేతల మరణ రహస్యాలను చేధించారు. కాంగ్రెస్ వాళ్లు క్షుద్రపూజలు చేయడం వల్లే తమ నాయకులంతా చనిపోతున్నారని చెప్పి దేశ ప్రజలను ఆశ్చర్యపరిచారు. క్షుద్రపూజలు ఉన్నాయన్న నమ్మకాలకు బీజేపీ కూడా వత్తాసు పలికింది. కనుకనే ఆమె వ్యాఖ్యలను ఖండించలేదు. క్షుద్రపూలతో మనుషులను చంపవచ్చన్నది బీజేపీ నమ్మితే వాటితో అనేక రకాల సమస్యలనూ పరిష్కరించవచ్చు...కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉద్రవాదులను బతకనివ్వకూడదు. బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతలనూ దారికి తెచ్చుకోవచ్చు. క్షుద్రపూజల ద్వారా చంపాలానుకుంటే పోలీసులకు తుపాలెందుకు? ఆర్మీకి ఆయుధాలెందుకు? అణుబాంబులెందుకు? పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్కు క్షుద్రపూజలు చేసి మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకోవచ్చు. అంతెందుకు బీజేపీ పార్టీలో ఉన్న అంతర్గత గ్రూపు నేతలకూ ఇలాంటి పూజలు చేసి పార్టీకి లాయస్టులుగా మార్చుకోవచ్చు. వారికి పార్లమెంట్లో సంఖ్యా బలం కూడా అక్కర్లేదు. క్షుద్ర పూజలతోనే ఏమైనా చేసుకోవచ్చు కదా? అంటున్నారు నెటిజన్లు.
- గుడిగ రఘు